Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్ రికార్డు..!
హృదయానికి మూడు సార్లు బైపాస్ సర్జరీలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు (Guinness World Record)లో స్థానం సంపాధించారు బ్రిటన్కు చెందిన 77 ఏళ్ల కోలిన్ హాంకాక్ (Colin Hancock). ఈ క్రమంలో పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వంశపారపర్యంగా సంక్రమించే హైపర్ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్ డిసీజ్కు కారణమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. రైల్లో లోయర్ బెర్త్ కావాలా? ఈసారి ఇలా చేయండి..
రైళ్లలో (Indian Railways) లోయర్ బెర్త్ (Lowr berth) దొరికితే ఆ సౌకర్యమే వేరు. కూర్చున్నంత సేపూ కిటికీ నుంచి అందాలను వీక్షించొచ్చు. పడుకునేటప్పుడు పైకెక్కాల్సిన బాధలేదు. అందుకే పెద్దవాళ్లతో ప్రయాణించేవారు లోయర్ బెర్త్ కోసం ప్రయత్నిస్తుంటారు. వారికి టికెట్ బుక్ చేసినప్పుడు లోయర్ బెర్త్ను (Berth preference) ప్రిఫరెన్స్గా పెడతారు. అయినా ఏ కొద్ది మందికో మినహా లోయర్ బెర్తులు ఒక్కోసారి దొరక్కపోవచ్చు. ప్రయాణానికి చాలా రోజుల ముందు టికెట్ బుక్ చేసినా ఈ పరిస్థితి తలెత్తొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి?పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి?: చిరంజీవి
బాబీ దర్శకత్వంలో చిరంజీవి (chiranjeevi) నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఇందులో చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతకొన్నేళ్లుగా సినీ పరిశ్రమను చుట్టుముడుతున్న కొన్ని రాజకీయాంశాలపై చిరంజీవి మాట్లాడారు. ‘‘మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. మణిపుర్కు మోదీ ఎందుకెళ్లట్లేదు..? అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రశ్నలు
పార్లమెంట్లో మాట్లాడకుండా ఉండేందుకు ప్రధాని మోదీ మౌనవత్రం పట్టారని, ఆయన్ను మాట్లాడించేందుకే తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Debate)పై మంగళవారం చర్చ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆయన ఈ మాట అన్నారు. అలాగే మూడు ప్రశ్నలను సంధించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అమెరికాలో ‘నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్’గా ఆగస్టు 15.. చట్టసభలో తీర్మానం
భారత (India) స్వాతంత్ర్య దినోత్సవాన్ని అమెరికా(USA)లో కూడా ప్రత్యేకంగా నిర్వహించుకొనేలా ఓ తీర్మానాన్ని కాంగ్రెస్ సభ్యుడు శ్రీ తానేదార్ ప్రవేశపెట్టారు. ఆగస్టు 15ను అమెరికాలో ‘నేషనల్ డే ఆఫ్ సెలబ్రేషన్’గా ప్రకటించాలని దీనిలో కోరారు. ఈ తీర్మానానికి కాంగ్రెస్ సభ్యులు బడ్డీ కార్టర్, బ్రాడ్ షర్మాన్ సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. ఆ రోజును ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో సంబరాల దినోత్సవంగా మార్చాలని వారు కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ‘అన్యాయమైన ఛార్జీలు’.. జొమాటోపై కస్టమర్ అసంతృప్తి.. స్పందించిన సంస్థ
జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళ బిల్లు చూసి షాకైంది. డెలివరీ బిల్లులో అనవసరంగా కంటైనర్ ఛార్జీలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎక్స్ (ట్విటర్) వేదికగా జొమాటోకు(Zomato) ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ను కూడా ఆమె ట్యాగ్ చేసింది. అహ్మదాబాద్కు చెందిన ఖుష్బూ ఠక్కర్ అనే మహిళ మూడు ప్లేట్ల దూదీ తేప్లా (రోటీ వంటిది) ఆహారాన్ని జొమాటోలో ఆర్డర్ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. కోరుట్లలో దారుణం.. బైక్పై వచ్చి కౌన్సిలర్ భర్తను నరికేశారు!
జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం(48)పై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ‘చివరి బంతికి సిక్స్ కొట్టండి’.. అవిశ్వాసం వేళ ఎంపీలకు మోదీ సూచన
కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (no confidence motion)పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. అది ప్రభుత్వంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదని.. వాళ్లలో వారికే నమ్మకం లేక దీన్ని ప్రవేశపెడుతున్నారని విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అంతేగాక, 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై ‘సిక్స్’ కొట్టాలని స్వపక్ష ఎంపీలకు సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి కామెంట్ చేయను: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తోందని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత అన్నారు. వివేకా జయంతి సందర్భంగా కడప జిల్లా పులివెందులలో ఆయన సమాధి వద్ద సునీత, ఆమె భర్త రాజశేఖర్రెడ్డి, కుటుంబసభ్యులు నివాళులర్పించారు. అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. దిల్లీ బిల్లు ఆమోదం వేళ.. మంత్రుల శాఖలు మార్చిన కేజ్రీవాల్..!
దిల్లీ(Delhi)లోని ఆప్(AAP) ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్య మార్పు చేసింది. మంత్రి సౌరభ్ భరద్వాజ్(Saurabh Bhardwaj)ను సేవలు, విజిలెన్స్ విభాగం బాధ్యతల నుంచి తప్పించి.. ఆ రెండు శాఖలను ఆతిశీ(Atishi)కి అప్పగించింది. పార్లమెంట్లో దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుకు ఆమోదం లభించిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!