కోరుట్లలో దారుణం.. బైక్‌పై వచ్చి కౌన్సిలర్‌ భర్తను నరికేశారు!

జగిత్యాల జిల్లా కోరుట్లలో కౌన్సిలర్‌ భర్త పోగుల లక్ష్మీరాజం(48)ను కొంతమంది గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.

Updated : 08 Aug 2023 15:15 IST

కోరుట్ల గ్రామీణం: జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ భర్త పోగుల లక్ష్మీరాజం(48)పై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్లో లక్ష్మీరాజం టీ తాగుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు అతడి మెడపై కత్తితో దాడి చేసి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. తీవ్ర గాయాలతో లక్ష్మీరాజం పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కాసేపటికే ఆయన మృతిచెందారు. ఘటనాస్థలిని డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని