Guinness World Record: గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్ రికార్డు..!
గుండెకు మూడు సార్లు బైపాస్ సర్జరీ చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సాధించారు బ్రిటన్కు చెందిన కోలిన్ హాంకాక్.
ఇంటర్నెట్ డెస్క్: హృదయానికి మూడు సార్లు బైపాస్ సర్జరీలు చేయించుకొని అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు (Guinness World Record)లో స్థానం సంపాధించారు బ్రిటన్కు చెందిన 77 ఏళ్ల కోలిన్ హాంకాక్ (Colin Hancock). ఈ క్రమంలో పాత రికార్డును ఆయన బద్దలు కొట్టారు.
వంశపారపర్యంగా సంక్రమించే హైపర్ కొలెస్టెరోలేమియా అనే సమస్యతో కోలిన్ బాధపడుతున్నారు. ఇది శరీరంలో కొవ్వులు పెరగడంతో పాటు కరోనరీ హార్ట్ డిసీజ్కు కారణమవుతుంది. దీని వల్ల 30 ఏళ్ల వయసులో అతడికి గుండె పోటు వచ్చింది. ఆ తర్వాత ఏడాదిలో మూడు సార్లు బైపాస్ శస్ర్త చికిత్సలు చేశారు. అతడు ఈ సర్జరీలు చేయించుకుని 45 సంవత్సరాల 361 రోజులు గడించింది. ఈ కాలంలో ఆయనకు మరో శస్ర్త చికిత్స జరగలేదు. ఇప్పటికీ కోలిన్ ఆరోగ్యంగా ఉన్నారు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందారు. గతంలో ఈ రికార్డు అమెరికాకు చెందిన డెల్బర్ట్ డేల్ మెక్బీ పేరిట ఉంది. ఆయన ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయించుకుని 41 ఏళ్ల 63 రోజులు జీవించారు. 2015లో తన 90 ఏటా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కోలిన్ ఈ రికార్డును బద్దలు కొట్టారు.
రెండేళ్లలో మూడు గిన్నిస్ రికార్డులు
30 ఏళ్ల వయసులో తాను పలు క్రీడల్లో పాల్గొనేవాడినని.. ఆ సమయంలో తనకి గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు ఎలాంటి లక్షణాలు కనిపించలేదని కోలిన్ తెలిపారు. అయితే, తన చిన్నతనంలో ఆరోగ్యం కోసం మంచి ఆహారం కూడా తీసుకోలేదని వెల్లడించారు. గుడ్లు, చిప్స్ ఇష్టంగా తినేవాడిని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరయ్యేను ఖమేనీ వారసుడు?
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణంతో ఆ దేశ భవితవ్యంపై అంతర్గతంగానే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తి పెరుగుతోంది. తదుపరి అధ్యక్షుడు ఎవరనేది కాకుండా... దేశ సుప్రీం కమాండర్ ఎవరవుతారనేది అందరిలో తలెత్తుతున్న ప్రశ్న! -
సింగపూర్ విమానంలో భారీ కుదుపులు
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవడంతో ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. -
‘అవి రక్తంతో తడిసిన చేతులు’
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతిపై అమెరికా ఘాటు వ్యాఖ్యలు చేసింది. నాలుగు దశాబ్దాలుగా ఇరాన్ ప్రజలపై కొనసాగుతున్న అణచివేతలో రైసీది కీలక పాత్ర అని పేర్కొంది. న్యాయమూర్తిగా, అధ్యక్షుడిగా ఆయన చేతులు రక్తంతో తడిసాయని, మరణంతో ఈ కఠోర వాస్తవం మారిపోదని తెలిపింది. -
షెంజెన్ వీసా రుసుములను పెంచిన ఐరోపా
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చు మరింత భారం కానుంది. షెంజెన్ వీసా దరఖాస్తు రుసుంను 12 శాతం పెంచేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదించడమే అందుకు కారణం. జూన్ 11 నుంచి ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
బోకోహారమ్ ఉగ్రవాదుల చెరలోని 350 మంది బందీలకు విముక్తి
ఈశాన్య నైజీరియాలో బోకోహారమ్ ఉగ్రవాదుల చెరలో నెలలు, సంవత్సరాలు బందీలుగా ఉన్న 350 మందిని రక్షించినట్లు అక్కడి సైన్యం తెలిపింది. సాంబిసా అటవీ ప్రాంతంలో వీరిని బందీలుగా ఉంచినట్లు నైజీరియన్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ కెన్ చిగ్బు తెలిపారు. -
సంక్షిప్త వార్తలు(6)
ఆక్రమిత వెస్ట్బ్యాంకులోకి మంగళవారం ఇజ్రాయెల్ దళాలు ప్రవేశించి ఏడుగురు పాలస్తీనీయన్లను హతమార్చాయి. ఇందులో ఓ వైద్యుడు కూడా ఉన్నారు. -
మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్లు
మానవ వృషణాల్లో సూక్ష్మ ప్లాస్టిక్లను పరిశోధకులు గుర్తించారు. దీంతో పురుషుల్లో వీర్య కణాలు తగ్గిపోవడానికి ఇవే కారణమై ఉంటాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. -
తబ్రిజ్లో రైసీ సంతాప యాత్ర
హెలికాప్టర్ దుర్ఘటనలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఇతరుల స్మృత్యర్థం ఇరాన్ ప్రభుత్వం ప్రకటించిన సంతాప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. -
ఐసీసీ అరెస్టు వారెంట్ల అభ్యర్థనకు ఫ్రాన్స్ మద్దతు
తమపై అరెస్టు వారెంట్లు జారీ చేయాలంటూ అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి (ఐసీసీ) ప్రధాన ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ చేసిన అభ్యర్థనపై గరంగరంగా ఉన్న ఇజ్రాయెల్కు ఎదురుదెబ్బ తగిలింది. -
గూగులమ్మ ఇంట ఏఐ పంట
టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. -
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
సింగపూర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం మార్గమధ్యలో తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లోని విమానాశ్రయానికి మళ్లించారు.