Modi: ‘చివరి బంతికి సిక్స్ కొట్టండి’.. అవిశ్వాసం వేళ ఎంపీలకు మోదీ సూచన
ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాసంపై లోక్సభలో చర్చ మొదలైంది. దీనికి ముందు అధికార పక్ష ఎంపీల భేటీలో ప్రధాని మోదీ (PM Modi) కీలక సూచనలు చేశారు. విపక్షాల అస్త్రాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (no confidence motion)పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) స్పందించారు. అది ప్రభుత్వంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదని.. వాళ్లలో వారికే నమ్మకం లేక దీన్ని ప్రవేశపెడుతున్నారని విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. అంతేగాక, 2024 ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై ‘సిక్స్’ కొట్టాలని స్వపక్ష ఎంపీలకు సూచించారు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు జరిగిన భాజపా (BJP) పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అవిశ్వాసంపై ఎలా స్పందించాలన్న అంశంపై భాజపా పార్లమెంటరీ పార్టీ మంగళవారం ఉదయం సమావేశమైంది. ఈ భేటీలో మోదీ (Modi) ప్రసంగిస్తూ విపక్షాలపై ఘాటు విమర్శలు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘దిల్లీ సర్వీసుల బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ను కొందరు విపక్ష నేతలు 2024 లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections)కు ‘సెమీఫైనల్’గా అభవర్ణించారు. అయితే, దీనిలో ఫలితం ఏంటో దేశ ప్రజలంతా చూశారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ‘సెమీఫైనల్’లో విజయం సాధించినందుకు గానూ పార్టీ ఎంపీలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేసినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
ఇక లోక్సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మోదీ స్పందిస్తూ.. ‘‘ప్రతిపక్షాల కూటమిలో పరస్పర విశ్వాసం సన్నగిల్లింది. అందుకే ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు. కూటమిలో తమకు ఎవరెవరు ఐక్యంగా ఉన్నారు? ఎవరు లేరు? అనేది పరీక్షించుకునేందుకే వారు ఈ ప్రయత్నం చేస్తున్నారు. అంతేగానీ, ఇది మన ప్రభుత్వంపై తీసుకొచ్చిన అవిశ్వాసం కాదు’’ అని మోదీ విమర్శించారు.
ఇక అవిశ్వాసంపై అధికార పక్షం వ్యూహాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఎలాగైతే చివరి బంతికి సిక్స్ కొట్టాలో.. ప్రస్తుత పరిస్థితులను ప్రతిపక్షాలపై అవకాశంగా భావించండి. 2024 ఎన్నికలకు ముందు చివరి బంతికి ‘సిక్స్’ కొట్టండి’’ అని పార్టీ ఎంపీలకు ప్రధాని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ