Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ‘కాళేశ్వరం’ నిర్మాణాలపై 4 నెలల్లో నివేదిక
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలపై ఏర్పాటు చేసిన కమిటీ 4 నెలల్లో రిపోర్టు ఇవ్వనుంది. వీటిపై అధ్యయనానికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. పవన్ కల్యాణ్ను కలిసిన చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే
చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఇటీవల విజయానందరెడ్డిని వైకాపా అధిష్ఠానం నియమించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్తో సమావేశమై చర్చించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పరిచయం లేని మహిళను అలా పిలవడం లైంగిక వేధింపే: కలకత్తా హైకోర్టు
పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) స్పష్టం చేసింది. అలా పిలిచిన వ్యక్తులను 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని తెలిపింది. ఈ మేరకు పోర్టు బ్లెయిర్లోని హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జై సేన్గుప్తా తీర్పు వెలువరించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్.. వరుసగా రెండోసారి
పాకిస్థాన్ (Pakistan) ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)ల తరఫున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్.. జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్లో మొత్తం 336 ఓట్లకుగానూ 201 ఓట్లు సాధించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. బాధ్యతలు చేపట్టిన 3 వారాల్లోనే.. తిరుపతి ఎస్పీ బదిలీ
తిరుపతి ఎస్పీ మలికా గార్గ్ బదిలీ అయ్యారు. ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మూడు వారాల్లోనే ఆమె బదిలీ కావడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి కోమటిరెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో తొలుత 2 వేల ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో ఆయన పర్యటించారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో పాటు గృహజ్యోతి లబ్ధిదారులతో మాట్లాడారు. బైక్పై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారింది: సందీప్ శాండిల్య
దేశంలో డ్రగ్స్ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒంటరితనం అనుభవించేవారు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’ రికార్డు.. వాచ్ టైం ఎంతంటే!
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). సినీ రంగంలోనే కాదు, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న ‘జీ5’ వేదికగా ఓటీటీలోకి వచ్చింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్మెన్ మృతి
రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్మెన్ గోపిరెడ్డి (30) మృతి చెందాడు. బాపట్ల మండలం ఈతేరు- చుందూరుపల్లి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. బాపట్లలోని ఉప్పెరపాలెంకు చెందిన గోపిరెడ్డి 2018లో పోలీస్ కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే వద్ద గన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. తాము లేకపోతే గెలవడం కష్టమనే వారికి ఇదొక హెచ్చరిక: సునీల్ గావస్కర్
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను (IND vs ENG) భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఎక్కువగా యువకులతో కూడిన టీమ్ఇండియా బలమైన ఇంగ్లిష్ జట్టును సునాయాసంగా ఓడించడం విశేషం. సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, రహానె, కేఎల్ రాహుల్ (తొలి టెస్టు మినహా) లేనప్పటికీ భారత్ గెలిచింది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరుగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే