Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
1. ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడు: ప్రధాని మోదీ
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన.. ఎంతో దార్శనికత గల నాయకుడు’’ అని మోదీ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
2. ఫోన్ ట్యాపింగ్పై వాళ్లిద్దరూ సీబీఐ విచారణ కోరరా?: సీఎం రేవంత్రెడ్డి
అన్నింటికీ సీబీఐ దర్యాప్తు కావాలనే భారాస నేతలు కేటీఆర్, హరీశ్రావు.. ఫోన్ ట్యాపింగ్పై మాత్రం సీబీఐ విచారణ కోరరా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
3. చిన్నారులను విక్రయిస్తున్న ముఠా అరెస్టు.. 16 మందిని రక్షించాం: రాచకొండ సీపీ
చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 16 మంది చిన్నారులను కాపాడారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. ఇటీవల మేడిపల్లిలో చిన్నారి విక్రయంతో ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. ప్రజాభవన్కు బాంబు బెదిరింపు
నగరంలోని ప్రజాభవన్కు బాంబు బెదిరింపు వచ్చింది. అక్కడ బాంబు ఉన్నట్లు పోలీసు కంట్రోల్ రూమ్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజాభవన్ వద్దకు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చివరికి ఇది ఆకతాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్ధరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
5. జూన్ 4 తర్వాత ఆయన మాజీ సీఎం: అమిత్ షా వ్యాఖ్యలు
ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాజపా అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ, 75 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు. భద్రక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని చాంద్బలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొని మట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
6. రోజంతా ఒడుదొడుకులు.. 220 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. రిలయన్స్, ఎయిర్టెల్ వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
7. ప్రతి రాత్రి వాట్సప్ ‘డేటా ఎక్స్పోర్ట్’.. మస్క్ ఆరోపణలకు క్యాత్కార్ట్ కౌంటర్!
ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ (WhatsApp) ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. వీటిని వాట్సప్ అధినేత విల్ క్యాత్కార్ట్ తోసిపుచ్చారు. ఆయన వాదన అవాస్తవమన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
8. గోరఖ్పుర్లో భోజ్పురి యాక్షన్ చిత్రం.. యోగి అడ్డాలో హోరాహోరీ..!
భాజపాలో మోదీ తర్వాత అత్యంత పాపులర్ లీడర్ యోగి. ఇప్పుడాయన సొంత నియోజకవర్గమైన గోరఖ్పుర్ (Gorakhpur)లో పోరు యూపీలో హీటు పుట్టిస్తోంది. ఇక్కడ ఎన్నికలు చివరిదశలో ఉండడంతో పార్టీలన్నీ తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అభ్యర్థులు ఇద్దరూ ప్రజాదరణలో ఏమాత్రం తీసిపోని భోజ్పురి నటులే. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
9. కాంబోడియాలో చిక్కుకున్న యువతను రాష్ట్రానికి తీసుకురావాలి: చంద్రబాబు
రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
10. ఆ విషాదం మరువకముందే.. టైటాన్ తరహాలో మరో సాహస యాత్ర..
టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురితో బయలుదేరి వెళ్లి గల్లంతైన టైటాన్ (Titan Submarine) మినీ జలాంతర్గామి విషాదాంతం సంగతి తెలిసిందే. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో ఇద్దరు వ్యక్తులతో మరో యాత్రకు రంగం సిద్ధమవుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరిలో నిన్నంతా హెచ్చుతగ్గులతో కొనసాగిన భారీ వరద శనివారం ఉదయం నుంచి పెరుగుతోంది. -
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..