Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. దందాలు చేసేవారే పార్టీని వీడుతున్నారు
వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు చేసే నాయకులే భారాస పార్టీని వీడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. పూర్తి కథనం
2. ప్రభుత్వోద్యోగులు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు
ప్రభుత్వోద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతి పొందటం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించటమేనని స్పష్టం చేశారు.పూర్తి కథనం
3. ఇక్కడ హిమాలయాలే చిన్నబోతాయి..
అవి సహజ సిద్ధంగా ఏర్పడిన గుట్టలు, అబ్బురపరిచే గుహలు, ప్రాచీనమైన వర్ణ చిత్రాలు, నీటి చెలిమెలు ఇలా ఎన్నో విశేషాలు అక్కడ కనిపిస్తాయి. చుట్టూ పచ్చని పంట చేలు.. ఆ మధ్యలో రమణీమైన ప్రకృతి అందాలు.. ఇవన్నీ జయశంకర్ జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు రావులపల్లి సమీపంలో ఉన్న పాండవుల గుట్టల్లో దాగివున్నాయి.పూర్తి కథనం
4. ప్రజాగళానికి వచ్చారని చంపేశారు
చిలకలూరిపేట ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంగా గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను వైకాపా రౌడీ మూకలు గొడ్డలితో నరికి చంపాయని, ఆళ్లగడ్డలోని చాగలమర్రిలో ఇమామ్హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మాచర్లలో తెదేపా కార్యకర్త సురేశ్ కారును తగలబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.పూర్తి కథనం
5. అసెంబ్లీ బలాలు అక్కరకొచ్చేనా?
హైదరాబాద్ నగరంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో నేతలు పార్టీలు మారడం జోరందుకుంది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రానున్న సార్వత్రిక పోరుకు పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి.పూర్తి కథనం
6. రాజకీయ ప్రయోజనాలు ఆశించి పిల్ వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎం జగన్, ఆయన బంధుగణం పొందిన అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణ కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వేసిన పిల్పై విచారణ జూన్ చివరి వారానికి వాయిదా పడింది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి పిల్ వేయలేదని, ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ రఘురామ హైకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు.పూర్తి కథనం
7. జగన్ భద్రతకు ముప్పుంటే.. బస్సుయాత్ర ఎలా చేస్తారు?: ఆనం
సీఎం జగన్కు, ఆయన కుటుంబానికి భద్రత పెంచుతున్నట్లు డీజీపీ మూడు నెలల క్రితం ప్రకటించారు. అయిదేళ్లుగా ప్రజల కష్టాలను పట్టించుకోని జగన్.. ఎన్నికలు సమీపిస్తుండటంతో బస్సుయాత్ర పేరుతో బయటకు వస్తున్నారు. డీజీపీ చెప్పినట్లు భద్రతాపరమైన ముప్పు ఉంటే.. బస్సుయాత్రకు ఎలా అనుమతిస్తారు?పూర్తి కథనం
8. వైకాపా ప్రచార యావ.. ప్రజాధనం వృథా
వైకాపా నాయకుల ప్రచార యావ వల్ల ఇప్పటికే రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ తీసేయటానికి, రంగులు చెరపడానికి మళ్లీ భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.పూర్తి కథనం
9. టిడ్కో ఇళ్లు.. కదిపితే కన్నీళ్లు!
పేదల సంక్షేమం కోసం అయిదేళ్లలో రూ. కోట్లు ఖర్చు చేశామని పదేపదే చెబుతున్న వైకాపా పెద్దలకు.. టిడ్కో ఇళ్లు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు అసలు పట్టించుకోనే లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇళ్లు పూర్తికాకుండానే గృహ ప్ర‘వేషాల’ పేరుతో హడావుడి చేశారు. వేలాది మందికి గృహయోగం కల్పించామని ప్రగల్భాలు పలికారు. ఒకరిద్దరికే తాళాలు అప్పగించడంతో లబ్ధిదారులు ఆందోళన చేశారు.పూర్తి కథనం
10. సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇష్టారాజ్యం!
మాతృత్వపు మధురిమల కోసం పరితపించేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నవి కొన్నయితే.. అనుమతులను పునరుద్ధరించుకోకుండానే కొనసాగుతున్నవి మరికొన్ని ఉన్నట్లు అధికారులు గుర్తించారు.పూర్తి కథనం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్