Hyderabad: సంతాన సాఫల్య కేంద్రాల్లో ఇష్టారాజ్యం!
మాతృత్వపు మధురిమల కోసం పరితపించేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
నిబంధనల బేఖాతరు.. అడ్డగోలుగా చికిత్సలు
కఠిన చర్యల దిశగా వైద్య, ఆరోగ్య శాఖ
ఈనాడు, హైదరాబాద్: మాతృత్వపు మధురిమల కోసం పరితపించేవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నవి కొన్నయితే.. అనుమతులను పునరుద్ధరించుకోకుండానే కొనసాగుతున్నవి మరికొన్ని ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 265 సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 123 హైదరాబాద్లో ఉండగా.. రంగారెడ్డి జిల్లా పరిధిలో 40, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 35, వరంగల్ జిల్లాలో 27 కేంద్రాలు ఉన్నాయి. రోజురోజుకూ ఈ కేంద్రాల సంఖ్య పెరుగుతుండగా.. అదే స్థాయిలో నిబంధనల ఉల్లంఘనలూ ఎక్కువ అవుతున్నాయి. ఈ కేంద్రాలు వైద్య, ఆరోగ్య శాఖ అనుమతితోనే ఏర్పాటు కావాల్సి ఉంది. నిర్దేశించిన గడువు మేరకు అనుమతులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది.
అయితే, రాష్ట్రంలో పలు చోట్ల ప్రధానంగా జిల్లా కేంద్రాల్లో సంతాన సాఫల్య కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీల్లో వెల్లడైంది. కృత్రిమ గర్భధారణకు సంబంధించి ఎలాంటి వసతులు, నిపుణులైన వైద్యులు లేకున్నా పలుచోట్ల కేంద్రాలను నిర్వహిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. మరోవైపు స్కానింగ్ సెంటర్లలో యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో నిబంధనలను అతిక్రమిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాలతోపాటు, స్కానింగ్ సెంటర్లపైనా చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ ఉపక్రమించింది.
ఉల్లంఘనల పరంపర..
వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న సంతాన సాఫల్య కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. చికిత్స కోసం వచ్చేవారిని తప్పుదోవ పట్టించేలా కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఓ కేంద్రంలో అనుమతి లేకుండా ఐవీఎఫ్ చికిత్స చేస్తున్న ఘటన వెలుగు చూసింది. మరో కేంద్రంలో ఎలాంటి చికిత్సలు చేయకుండా హైదరాబాద్లోని కేంద్రానికి పంపుతున్న ఘటన వెలుగు చూసింది. ఇటీవల హైదరాబాద్ మలక్పేటలోని ఓ ఫర్టిలిటీ సెంటర్లో అనుమతి లేకుండా నడుపుతున్న మెడికల్ షాపును ఔషధ నియంత్రణ మండలి అధికారులు సీజ్ చేశారు. నిషేధించిన స్టెరాయిడ్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా జిల్లాల్లోని పలు కేంద్రాలకు నోటీసులు ఇచ్చారు.
ప్రత్యేక సమీక్ష..
బాధితులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. చివరికి మోసపోతున్న ఘటనలపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కఠిన చర్యల దిశగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఇటీవల రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చోంగ్తూ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషర్ ఆర్.వి.కర్ణన్లు జిల్లా వైద్యాధికారులతో సమీక్షించి సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఆయా డీఎంహెచ్ఓల పరిధిలోని వాటిని క్రమంతప్పకుండా తనిఖీలు చేయడంతోపాటు ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో డీఎంహెచ్ఓలు ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు ఈసెట్ ఫలితాలు
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. -
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ విస్మయకర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందా సుదీర్ఘకాలంగా సాగినా ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. -
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకణ మళ్లీ మొదటికి..!
హైదరాబాద్ అవుటర్ రింగు రోడ్డు ఆవల నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు కోసం అటవీ భూసేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. సకాలంలో వివరాలు ఇవ్వకపోవటంతో మునుపటి ప్రతిపాదనల దరఖాస్తు రద్దు అయినట్లు సమాచారం. -
ఎప్సెట్ ఇంజినీరింగ్లో 74.98% ఉత్తీర్ణత
టీఎస్ ఎప్సెట్-2024 ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. -
మాదంటే మాదే!
భూవివాదంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తతకు దారితీసింది. పేట్బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ పరిధి సుచిత్ర కూడలి సమీపంలో జీడిమెట్ల సర్వే నంబరు 82లో ఎకరా 29 గుంటలు, సర్వే నంబరు 83లో 3 వేల గజాల స్థలాన్ని 2011లో కొన్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెబుతున్నారు. -
ముందస్తు వానాకాలం
రాష్ట్రంలో జూన్ 5వ తేదీ తరువాత తెరిపినిచ్చే వేసవి ఎండలు ఈ ఏడాది ముందస్తు వానలతో మే నెలలోనే చల్లబడ్డాయి. శనివారం సాయంత్రం కూడా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు కురిశాయి. -
మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే
‘మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్ ఇచ్చిన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
మంత్రి మండలి సమావేశం వాయిదా
తెలంగాణ సచివాలయంలో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురు చూసినా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నుంచి అనుమతి రాలేదు. -
ప్రభుత్వ రంగంలో తొలి మెగాఫుడ్ పార్క్
దాదాపు 200 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. అత్యుత్తమ ఆహారశుద్ధి వనరులు.. రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారుల కార్యకలాపాలకు వేదిక... 25 వేల మందికి ఉపాధి అవకాశాలు.. రాయితీలు, ప్రోత్సాహకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభానికి సిద్ధమైంది. -
జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తులతో ఆర్జిత పూజలు
యాదాద్రిలో పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్ 1 నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్రావు వెల్లడించారు. -
ఆరోగ్య సంరక్షణకు రూ.1,411 కోట్లు
ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ.1,411 కోట్లను వ్యయం చేయనున్నారు. -
పార్వతి బ్యారేజీ ఖాళీ
కాళేశ్వరం పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి(సుందిళ్ల) బ్యారేజీ నుంచి నీటిని దిగువన గోదావరిలోకి వదలడంతో జలాశయం వెలవెలబోతోంది. -
ఎవరెస్ట్ బేస్క్యాంప్పై తెలంగాణ యువకుడు
దేశంలో అన్ని కులాలు, మతాలు సమానమనే సందేశాన్ని చాటుతూ..ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటి రాజిపేటలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. -
ఉచిత పరీక్షలతో పేద రోగులకు ఊరట
క్యాన్సర్ ఉన్న వారిలో దాని మ్యుటేషన్ (ఉత్పరివర్తనం) ఎలా ఉందని గుర్తించేందుకు నిమ్స్లో ఆధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా మాలిక్యులర్ జెనెటిక్ పరీక్షలు ఉచితంగా చేస్తుండడంతో ఎంతో మంది పేద రోగులకు ఉపశమనం కలుగుతోంది. -
కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేశ్పై విజిలెన్స్ విచారణ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
వరంగల్ విమానాశ్రయంపై ముందడుగు
వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి చిక్కుముడులు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రాంతీయ విమానాశ్రయం విషయంలో కొంతకాలంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ) వేచి చూసే ధోరణితో ఉంది. -
ఇంకిన నీరు ఇంకినట్లే తోడివేత!
వర్షాలు, నీటివనరుల ద్వారా నేలలో ఇంకే నీటిని ఇంకినట్లే తోడుతున్నారు హైదరాబాద్ జిల్లా వాసులు. 2023 సంవత్సరానికి రాష్ట్రంలో నేలలోకి ఇంకిన నీటి పరిమాణం, తోడివేతపై రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. -
సహకార అధికారులకు న్యాయం చేయాలి
తెలంగాణ సహకారశాఖలో జీతభత్యాల విషయంలో ఆది నుంచీ జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని... కొత్త పీఆర్సీలో తమకు పూర్తి న్యాయం చేయాలని సహకారశాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
బూటకపు ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలి: ప్రొ. హరగోపాల్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలోని బస్తర్, సుకుమా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండను తక్షణమే నిలిపేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కొలిక్కిరాని ధరణి పెండింగ్ సమస్యలు
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులకు పరిష్కారం లభించడం లేదు. ఈ అంశంపై శనివారం రాష్ట్ర సచివాలయంలో ధరణి కమిటీ సమావేశమైంది. -
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో ఉద్యోగాలు
ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలో సెంట్రింగ్ (షట్టరింగ్ కార్పెంటర్స్), సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, ఐరన్ బెండింగ్ కార్మికుల ఉద్యోగాలకు ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి