రాజకీయ ప్రయోజనాలు ఆశించి పిల్ వేయలేదు
వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎం జగన్, ఆయన బంధుగణం పొందిన అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణ కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వేసిన పిల్పై విచారణ జూన్ చివరి వారానికి వాయిదా పడింది.
ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా అభ్యంతరం లేదు
హైకోర్టులో అఫిడవిట్ వేసిన ఎంపీ రఘురామ
విచారణ జూన్ చివరి వారానికి వాయిదా
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎం జగన్, ఆయన బంధుగణం పొందిన అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణ కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వేసిన పిల్పై విచారణ జూన్ చివరి వారానికి వాయిదా పడింది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి పిల్ వేయలేదని, ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ రఘురామ హైకోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేశారు. దానిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. హైకోర్టులో పిల్ దాఖలు, అది పెండింగ్లో ఉన్న వ్యవహారంపై పిటిషనర్, ప్రతివాదులెవరూ మీడియాతో మాట్లాడొద్దని స్పష్టంచేసింది. అయితే పిటిషన్లో పేర్కొన్న అంశాలపై మాట్లాడకుండా నిలువరించలేమని తెలిపింది. పిల్లోని అంశాలపై మాట్లాడకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. అంతకు ముందు జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఎన్నికల తర్వాత విచారణ జరపాలని కోరుతూ అఫిడవిట్ వేశామన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. పిల్ను పెండింగ్లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న భారతి సిమెంట్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ.. పిల్ పెండింగ్లో ఉంచడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్నారు. ఇరువైపు వాదనలూ విన్న ధర్మాసనం.. ఇప్పటి వరకు న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏమీ లేవని గుర్తుచేసింది. విచారణను జూన్ చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లద్దాఖ్లో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది. -
అవినీతి కేసు బూచితో మాలీవాల్ను కుట్రలో భాగం చేశారు
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై ఉన్న అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి, బెదిరించి సీఎం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాజపా ఆమెను పావుగా మార్చిందని ఆప్ ఆరోపించింది. -
జూన్ తొలివారంలోనే ‘రైతు భరోసా’ ఇవ్వాలి
జూన్ తొలి వారంలోనే ‘రైతు భరోసా’ డబ్బులివ్వాలని... పంటసాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని భారాస మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. -
రేవంత్రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు
‘ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు. కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో లేరు. -
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు