టిడ్కో ఇళ్లు.. కదిపితే కన్నీళ్లు!
పేదల సంక్షేమం కోసం అయిదేళ్లలో రూ. కోట్లు ఖర్చు చేశామని పదేపదే చెబుతున్న వైకాపా పెద్దలకు.. టిడ్కో ఇళ్లు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు అసలు పట్టించుకోనే లేదు.
నిర్మాణాలు పూర్తికాకుండానే తాళాల అప్పగింత
మౌలిక సదుపాయాలు కల్పించకుండానే హడావుడి
ఈనాడు, నెల్లూరు: కార్పొరేషన్, న్యూస్టుడే
పేదల సంక్షేమం కోసం అయిదేళ్లలో రూ. కోట్లు ఖర్చు చేశామని పదేపదే చెబుతున్న వైకాపా పెద్దలకు.. టిడ్కో ఇళ్లు కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు అసలు పట్టించుకోనే లేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇళ్లు పూర్తికాకుండానే గృహ ప్ర‘వేషాల’ పేరుతో హడావుడి చేశారు. వేలాది మందికి గృహయోగం కల్పించామని ప్రగల్భాలు పలికారు. ఒకరిద్దరికే తాళాలు అప్పగించడంతో లబ్ధిదారులు ఆందోళన చేశారు. దిగొచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు విడతల వారీగా తాళాలు అందజేసినా.. ప్రస్తుతం వాటిలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో తాళాలు తీసుకున్న వారిలో ఒక్కరూ అక్కడ ఉండటం లేదు.
నెల్లూరు నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 41,696 ఇళ్లను తెదేపా ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్రం ఇచ్చే రూ. 1.50 లక్షలకు.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు కలిపి రాయితీగా అందించి.. మిగిలిన సొమ్మును బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకునేలా పథకం రూపొందించారు. 2017 నుంచి 2019 వరకు మూడు విడతల్లో ఇళ్లను జీ+3 విధానంలో నిర్మాణాలు ప్రారంభించి కొన్ని పూర్తి చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక.. మొదటి మూడేళ్లలో టిడ్కో ఇళ్ల ఊసే ఎత్తలేదు. అడపా దడపా ఇస్తున్నవీ.. అరకొర వసతులతోనే అప్పగించారు. కొన్నిచోట్ల తాగునీరు, విద్యుత్తు, మురుగు కాలువలు వంటివి పూర్తిస్థాయిలో కల్పించలేదు.
కనెక్షన్లు ఇవ్వని పైపులు
వేధిస్తున్న అసౌకర్యాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైకాపా ప్రభుత్వం హడావుడిగా టిడ్కో ఇళ్ల పంపిణీకి తెరదీసింది. ఫిబ్రవరి 14వ తేదీ వేలాది మందికి తాళాలు అందించేందుకు భారీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం, అల్లీపురం, అక్కచెరువుపాడు, కొండ్లపూడి, కల్లూరుపల్లి, ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారి ఆలయం దగ్గర్లో నిర్మిస్తున్న సుమారు 22,512 ఇళ్లలో.. 15,552 పూర్తి చేశామని, వాటికి సంబంధించిన లబ్ధిదారులను అల్లీపురం దగ్గరకు పిలిచి హడావుడి చేశారు. ఇది జరిగి నెల రోజులైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఇళ్లను అప్పగించలేదు. తాగునీరు, మురుగునీరు, విద్యుత్తు వంటి కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో తాళాలు తీసుకున్న వారిలో నేటికీ ఒక్కరంటే ఒక్కరు చేరకపోవడం గమనార్హం. సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తుంటే.. చివరకు ఇస్తామని అన్నీ చేసినట్లు చెబుతూ మోసగిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై టిడ్కో అధికారులను వివరణ కోరగా.. లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తున్నామని తెలిపారు. పనులు జరుగుతున్నాయని, త్వరలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
నిర్మాణ దశలో రక్షిత మంచినీటి పథకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాపుల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి భారీ మెజారిటీ సాధించడం ఖాయమని కాపు నేతలు తెలిపారు. -
లారీని ఢీకొన్న కారు.. ఏడుగురికి తీవ్ర గాయాలు
[ 18-05-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్తోపాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
సంగం చుట్టూ.. సవాళ్లెన్నో!
[ 18-05-2024]
సంగం బ్యారేజీ ప్రారంభించాం.. ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో అయిదు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా సమస్యాత్మకంగా మారింది. -
దారులిలా.. సాగేదెలా?
[ 18-05-2024]
గ్రామీణ రహదారుల అభివృద్ధిని పాలకులు విస్మరించారు. అవి అధ్వాన స్థితికి చేరినా.. అభివృద్ధి మాట దేవుడెరుగు? కనీస మరమ్మతులనూ పట్టించుకోలేదు. -
కత్తి దూసిన ఉన్మాదం
[ 18-05-2024]
తనతో పెళ్లికి నిరాకరించారని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతితో పాటు ఆమె తల్లిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఉన్మాద సంఘటన వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితుడు బాధితులకు సమీప బంధువు కావడం గమనార్హం. -
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలి
[ 18-05-2024]
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం రిటర్నింగ్, నోడల్ అధికారులతో వెబెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. -
వేసవి శిబిరాలు.. సృజనకు సోపానాలు
[ 18-05-2024]
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో .. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న.. కందుకూరి వీరేశలింగం సూక్తి పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది. -
డీకే మహిళా కళాశాలలో వినూత్న విద్యాబోధన
[ 18-05-2024]
డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో విద్యాబోధన అందిస్తున్న నెల్లూరు నగరంలోని దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో త్వరలో స్టూడియో ద్వారా విద్యాబోధన జరగనుంది. -
కొండెక్కిన చికెన్ ధర
[ 18-05-2024]
కూరగాయలు, నిత్యావసరాల ధరలు అందనంతదూరంలో ఉండగా.. కోళ్లు, గుడ్ల ధరలు కొండెక్కాయి. జిల్లాలో నెల వ్యవధిలో కోళ్ల ధరలు రూ.100-120.. గుడ్ల ధర డజను రూ.20 పెరిగింది. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 18-05-2024]
మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
-
పల్నాడు కలెక్టర్గా శ్రీకేశ్ బాలాజీ .. ఈసీ ఉత్తర్వులు
-
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి