Ysrcp: వైకాపా ప్రచార యావ.. ప్రజాధనం వృథా
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అంటూ వ్యవహరించింది. చెట్టు, పుట్ట, విద్యుత్తు స్తంభాలు, గృహాలు, ఆసుపత్రులు.. అనే తేడా లేకుండా వైకాపా జెండా నమూనా రంగులేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ‘కాదేదీ ప్రచారానికి అనర్హం’ అంటూ వ్యవహరించింది. చెట్టు, పుట్ట, విద్యుత్తు స్తంభాలు, గృహాలు, ఆసుపత్రులు.. అనే తేడా లేకుండా వైకాపా జెండా నమూనా రంగులేశారు. అంబులెన్సుల నుంచి ఆర్టీసీ బస్సుల వరకు సంక్షేమ పథకాల పోస్టర్లతో నింపేశారు.
వైకాపా నాయకుల ప్రచార యావ వల్ల ఇప్పటికే రూ.కోట్లలో ప్రజాధనం వృథా అయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ తీసేయటానికి, రంగులు చెరపడానికి మళ్లీ భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒక్కో భవనానికి రూ.3 వేలు: జిల్లాలో గత ప్రభుత్వాల హయాంలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు నడిచేవి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేశారు. మరికొన్ని చోట్ల యూపీహెచ్సీల కోసం కొత్తగా 36 భవనాలు నిర్మించారు. అధికారులు, స్థానిక నాయకులు అత్యుత్సాహంతో భారీగా ఖర్చుపెట్టి వాటికి వైకాపా జెండా రంగులు వేయించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆయా భవనాలకు గతంలో వేసిన రంగులు చెరపడానికి ఇద్దరేసి చొప్పున నియమించారు. ఒక్కో భవనానికి తెలుపు రంగు వేయడానికి కనీసం రూ.3 వేలు ఖర్చవుతోంది.
ప్రభుత్వ ఛాతి ఆసుపత్రిలో అంబులెన్సుపై జగన్, వైఎస్సార్ చిత్రాలు
టిడ్కో ఇళ్లు మరిచారా..?: తాటిచెట్లపాలెం (ఏఎస్ఆర్ నగర్), చిలకపేట, సుద్ధగెడ్డ, పెందుర్తి, గాజువాక, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో తెదేపా హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వైకాపా అధికారంలోకి రాగానే ‘మేమే అంతా చేశామని’ చెప్పుకొనేందుకు ప్రయత్నించింది. భవనాల లోపల పనులు పూర్తి చేయకుండానే, బయట వైకాపా జెండా పోలినట్లు తెలుపు, నీలం రంగులు వేయించారు. వాటిని ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ఇప్పుడు వాటిని మార్చాలంటే భారీగా వ్యయం చేయక తప్పదు.
వీటినెలా మార్చుతారు..: గతంలో విద్యా దీవెన కిట్లు, జగనన్న భూరక్ష, పాసుపుస్తకాలు, ధ్రువపత్రాలు తదితరాలపై ముఖ్యమంత్రి చిత్రాలు, పేర్లు ముద్రించారు. మరోవైపు పాఠశాల విద్యార్థులకు అందజేసిన ట్యాబుల్లోనూ సీఎం జగన్, నవరత్నాల వీడియోలు ప్రసారమవుతున్నాయి. ఇప్పుడు వాటిని ఎలా తొలగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. కోడ్ అమల్లోకి వచ్చి రెండు రోజులు గడుస్తున్నా రాజకీయ పార్టీలకు చెందిన పోస్టర్లు, చిత్రాలు తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పార్కులు, ఇళ్ల గోడలపై ఇప్పటికీ ‘సిద్ధం’ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.
- ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
[ 28-04-2024]
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. -
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా
[ 28-04-2024]
జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన మ్యానిఫెస్టో తుస్సుమందని తెదేపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. కొత్తవి లేక పోగా ఉన్న పథకాలను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఎస్ఎస్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి
[ 28-04-2024]
స్టాటిస్టికల్ సర్వెలెన్స్ బృందాల (ఎస్.ఎస్.టి.) పనితీరును విశాఖ లోక్సభ నియోజకవర్గ కేంద్ర వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ శనివారం ఉదయం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. -
పేదల ఆశలపై నీళ్లు.. పాలకులేనా వీళ్లు!!
[ 28-04-2024]
‘జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను. 2020 వరకు సమయం ఇవ్వండి. -
మహిళల ఓటుతో వైకాపాకు గుణపాఠం: శ్రీభరత్
[ 28-04-2024]
వైకాపా దుష్టపాలనను అంతమొందించడానికి మహిళలు సంఘటితం కావాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ పిలుపునిచ్చారు. -
‘తెదేపాతోనే రాష్ట్రానికి పూర్వవైభవం’
[ 28-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ భార్య, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అన్నారు. -
పెదజాలారిపేటను కాపాడుకుందాం
[ 28-04-2024]
తూర్పు నియోజకవర్గంలోని పెదజాలారిపేట పేరిట జరిగిన రూ.2500 కోట్ల టీడీఆర్ కుంభకోణం గురించి వివరించిన తెదేపా నాయకులు పెదజాలారిపేటను కాపాడుతామని గ్రామస్థులకు హామీఇచ్చారు. -
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
[ 28-04-2024]
జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం సమీపాన శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, -
‘కొర్రీల’మస్తు.. ‘ఆంక్షల’ తోఫా
[ 28-04-2024]
పేదింటి ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకాలనే వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ కల్యాణమస్తు పేరుతో అమలు చేస్తోంది. -
ధర పెరిగింది.. వినోదం తగ్గింది
[ 28-04-2024]
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అంతర్జాలం, వినోదాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్ నెట్ పథకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. -
జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తా
[ 28-04-2024]
అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేశారు
[ 28-04-2024]
పాయకరావుపేటలో ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేసి, ఇంకొక వ్యక్తిని అభ్యర్థిగా తీసుకొచ్చారంటూ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు. -
పేటలో ఓడిన వారికి చోటులేనట్లే!
[ 28-04-2024]
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేది పెద్దల మాట. ఎన్నికల్లో ఒకసారి ఓడితే రెండోసారి పోటీచేసి విజయం కోసం ప్రయత్నించడం సాధారణం. -
ఎనిమిదేళ్ల కిందట.. సరిగ్గా ఇక్కడే..
[ 28-04-2024]
నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా మరోసారి ఉలిక్కి పడింది. గతంలో ఇదే తరహా ఘోర రోడ్డు ప్రమాదం ఇక్కడే జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. -
నామపత్రాలను ఉపసంహరించుకొనే వారెందరు?
[ 28-04-2024]
జిల్లాలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామపత్రాలు దాఖలు చేసిన వారిలో తొలిరోజు శనివారం ఎవరూ ఉపసంహరించుకోలేదు. -
ఎన్నికల వేళ.. ఇదేమి తీరు!!
[ 28-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ డేటా ఎంట్రీ’ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ
[ 28-04-2024]
రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. -
ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’
[ 28-04-2024]
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..