Sonia Gandhi: చట్టబద్ధమైన డిమాండ్ లేవనెత్తితే వేటు వేస్తున్నారు.. సభ్యుల సస్పెన్షన్పై సోనియా
Sonia Gandhi: పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్పై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ స్పందించారు. లోక్సభలో భద్రతా వైఫల్యంపై చర్చ చేపట్టాలని తాము చట్టబద్ధమైన డిమాండ్ చేస్తున్నందుకే వేటు వేస్తున్నారని విమర్శించారు.
దిల్లీ: ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శించారు. మునుపెన్నడూ పార్లమెంట్ నుంచి ఈ స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయలేదని అన్నారు. అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్ను లేవనెత్తినందుకు వేటు వేశారని దుయ్యబట్టారు. పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్లను ఉద్దేశించి బుధవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ (Congress) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటులో సోమవారం రికార్డు స్థాయిలో 78 మంది లోక్సభ సభ్యులు సస్పెండ్ కాగా మంగళవారం మరో 49 మందిపై వేటువేసిన విషయం తెలిసిందే. గురువారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 141 మంది సస్పెండయ్యారు.
ప్రధాని స్పందనకు నాలుగు రోజులా?
డిసెంబర్ 13న పార్లమెంటులో జరిగిన అలజడి సంఘటన క్షమించరానిదని సోనియా గాంధీ (Sonia Gandhi) అన్నారు. దీన్ని ఎవరూ సమర్థించలేరని తెలిపారు. అయితే, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి మోదీకి (PM Modi) నాలుగు రోజుల సమయం పట్టిందని విమర్శించారు. అది కూడా ఇంత గంభీరమైన విషయంపై ఆయన తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేశారని తెలిపారు. ఇది సభను అపహాస్యం చేయడమేనని విరుచుకుపడ్డారు. దేశ ప్రజల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత వైఖరికి ఇది నిదర్శమని విమర్శించారు.
ఆ యత్నాల్లో ప్రధాని, హోంమంత్రి ముందున్నారు..
జమ్మూకశ్మీర్కు సంబంధించి కొన్ని కీలక బిల్లులకు ఈ పార్లమెంట్ సెషన్లో ఆమోదం లభించాయని సోనియా గాంధీ (Sonia Gandhi) గుర్తుచేశారు. జవహర్లాల్ నెహ్రూ వంటి దేశభక్తులను కించపరిచేందుకు కొంతమంది చరిత్రను వక్రీకరించి, చారిత్రక వాస్తవాలను కప్పిపెడుతూ నిరంతర దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి యత్నాల్లో ప్రధానమంత్రి, హోంమంత్రి స్వయంగా ముందుంటున్నారని విరుచుకుపడ్డారు. కానీ, తాము ఇలాంటి చర్యలకు బెదరబోమని.. నిజం చెప్పేందుకు నిరంతర పట్టుదలతో కృషి చేస్తామన్నారు.
అనేక కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్నాం..
మరోవైపు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి నిరాశ కలిగించిందని చెప్పేసి ఊరుకోవడం సరికాదన్నారు. ఇప్పటికే పార్టీ పేలవ ప్రదర్శనపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఓ దశ సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఓటమికి గల కారణాలేంటో విశ్లేషించారని వెల్లడించారు. తాము అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటున్నామని తెలిపారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఏకపార్టీ పాలన నెలకొల్పాలనుకుంటున్నారు..
దేశంలో ‘ఏకపార్టీ పాలన’ నెలకొల్పాలని ప్రధాని మోదీ, భాజపా భావిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అందుకే పార్లమెంటు నుంచి ఎంపీలను సస్పెండ్ చేశారని ఆరోపించారు. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనపై హోం మంత్రి నుంచి ప్రకటన కోరినందుకు 141 మంది సభ్యులను సస్పెండ్ చేశారన్నారు. మరోవైపు నిందితులు సభలోకి చొరబడడానికి కారణమైన భాజపా ఎంపీని ఇప్పటి వరకు ప్రశ్నించలేదన్నారు. పటిష్ఠ భద్రత ఉన్నా.. దుండగులు లోపలికి ఎలా ప్రవేశించగలిగారని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు
వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణించడం చట్టబద్ధమేనా అనే న్యాయపరమైన అంశంపై తీర్పును సుప్రీంకోర్టు బుధవారం రిజర్వు చేసింది. -
వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు..విమానానికి తప్పిన ప్రమాదం
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 170 మందితో బుధవారం మధ్నాహ్నం 1.45 గంటలకు దిల్లీకు ప్రయాణమైన విస్తారా ఎయిర్లైన్స్కు చెందిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ప్రమాదానికి గురైంది. -
దిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
దేశ రాజధాని ప్రాంతంలోని సుమారు 150 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం బుధవారం తీవ్ర కలకలం రేపింది. -
10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ
సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు భాజపా ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్కు విచ్చేశారు. -
అలాగైతే హంతకులూ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రారంభిస్తారు!
అరెస్టైన రాజకీయ నాయకులకు వర్చువల్ విధానంలో ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న వినతిపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కొవిషీల్డ్ సురక్షితమైందే.. ఆందోళన వద్దు
తమ కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సురక్షితమైందేనని ఆస్ట్రాజెనకా కంపెనీ పునరుద్ఘాటించింది. తమ టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. -
శని, ఆదివారాలూ మాకు తీరిక ఉండదు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సెలవులు సుదీర్ఘంగా తీసుకుంటారంటూ చేసే విమర్శలపై అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. -
‘స్మార్ట్’ అస్త్ర ప్రయోగం విజయవంతం!
సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో (స్మార్ట్) అనే ఆయుధ వ్యవస్థను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. -
డీప్ ఫేక్ వీడియోలపై వెంటనే చర్యలుండాలి
సార్వత్రిక ఎన్నికల వేళ డీప్ ఫేక్ వీడియోలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఇలాంటివి వెలుగు చూసిన వెంటనే జాప్యంలేకుండా వాటి వ్యాప్తిని అరికట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాదుల బృందం దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఉష్ణోగ్రతలు గరిష్ఠ‘మే’! : ఐఎండీ
దేశంలోని పలు ప్రాంతాల్లో మే నెల సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. -
యాప్ ఆధారిత పెట్టుబడి పథకాలు.. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
క్రిప్టోకరెన్సీ మైనింగ్ యంత్రాల అద్దెలపై పెట్టుబడుల పేరుతో మోసపూరిత పథకాల ద్వారా ప్రజల్ని ఒక యాప్ మోసగిస్తోందనే ఆరోపణలమీద దేశంలో 30 చోట్ల సీబీఐ బలగాలు సోదాలు నిర్వహించాయి. -
సూరత్ ఏకగ్రీవ ఎన్నికపై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ
సూరత్ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) పై అత్యవసర విచారణ జరిపేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. -
కొవిషీల్డ్పై వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి
ఆస్ట్రాజెనకా కరోనా టీకాపై తాజా దుమారం నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలు, ముప్పు కారకాల అవకాశాలను పరిశీలించేందుకు వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. -
అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..