NIA: ఖలిస్థానీ గ్యాంగ్స్టర్లపై విరుచుకుపడ్డ ఎన్ఐఏ.. ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు..!
ఖలిస్థానీ ఉగ్రవాదంపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో భాగంగా ఆరు రాష్ట్రాల్లోని 50కిపైగా లొకేషన్లలో దాడులు చేపట్టింది. ముఖ్యంగా ఖలిస్థానీ గ్యాంగస్టర్ల స్థానిక హవాల నెట్వర్క్ను ఛేదించే పనిలో పడింది.
ఇంటర్నెట్డెస్క్: భారత్(India)-కెనడా (Canada) మధ్య దౌత్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఖలిస్థాన్ సానుభూతిపరులు-గ్యాంగ్స్టర్ల మధ్య ఉన్న బంధాన్ని కత్తిరించే పనిలోపడింది. దీనిలో భాగంగా ఆరు రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి పలువురిని అదుపులోకి తీసుకుంది. పంజాబ్, హరియాణా, దిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ల్లో 50 చోట్ల ఈ దాడులు జరిగాయి.
లారెన్స్ బిష్ణోయి, అర్షదీప్ దల్లా తదితరులతో సంబంధం ఉన్న నేరస్థుల నుంచి భారీగా ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మందుగుండు, డిజిటల్ ఆధారాలను సైతం సేకరించినట్లు తెలిసింది. ఎన్ఐఏ ప్రకారం.. దల్లా, గౌరవ్ పాటిల్ వంటి వ్యక్తులు ఇక్కడ లేకపోయినా ఖలిస్థానీ ఉగ్రవాదులతో వారు టచ్లో ఉన్నారు. నిధుల సేకరణ, అక్రమ ఆయుధాల రవాణా, హత్యలు, డోపీడీలు వారితో చేయిస్తున్నారు.
భారత్లో నియమించుకొన్న వ్యక్తులకు ఇతర దేశాల్లోని ఖలిస్థానీలు-గ్యాంగ్స్టర్ల నుంచి హవాల మార్గంలో డబ్బులు వస్తున్నాయని.. వీటిని ఉపయోగించి వారు డ్రగ్స్, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. వీరికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ నుంచి సహకారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే యూఏపీఏ కింద అరెస్టు చేసిన వారి నుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. బుధవారం పంజాబ్లో 30 చోట్ల, రాజస్థాన్లో 13, హరియాణాలో నాలుగు చోట్ల, ఉత్తరాఖండ్లో రెండు, దిల్లీ, ఉత్తరప్రదేశ్లో ఒక్కో చోట తనిఖీలు జరిగాయి.
పెండింగ్లో 70 కొలీజియం సిఫార్సులు
ఇప్పటికే భారత్ నుంచి పారిపోయి యూకే, కెనడా, దుబాయ్, పాకిస్థాన్ ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్న 19 మంది ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాబితాను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది. దీంతోపాటు హర్విందర్ సింగ్ సంధు, లక్బిర్ సింగ్ సంధు పేరిట రూ.10 లక్షలు చొప్పున రివార్డును కూడా ప్రకటించింది. వీరికి బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చల్లని కబురు.. నెలాఖరు నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు
దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి ఒకటీ రెండు రోజులు అటుఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. -
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం
ఆన్లైన్ న్యూస్ పోర్టల్ ‘న్యూస్క్లిక్’ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. -
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం అరెస్ట్ చేసింది. -
గర్భస్థ శిశువుకూ జీవించే హక్కు
తల్లి గర్భంలో ఉన్న శిశువుకూ జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని, ఏ చట్టమూ దానిని తోసిపుచ్చలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం మంజూరు షురూ
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరికి తొలి విడతలో భారత పౌరసత్వం మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే