Nani: విజయ్ దేవరకొండ, రష్మిక ఫొటో వివాదం.. స్పందించిన నాని
‘హాయ్ నాన్న’ (Hi Nanna) ప్రీ రిలీజ్ ఈవెంట్లో చోటుచేసుకున్న ఓ ఘటనపై నాని (nani) స్పందించారు.
హైదరాబాద్: ‘హాయ్ నాన్న’ (Hi Nanna) ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) ఫొటోలు ప్రదర్శించడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈవెంట్ నిర్వాహకులతోపాటు చిత్రబృందాన్నీ నెటిజన్లు తప్పుబట్టారు. ఈ వివాదంపై నటుడు నాని (Hi Nanna) తాజాగా స్పందించారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన ఆయా విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అది దురదృష్టకరం..!
ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మికకు సంబంధించిన ఫొటోలను స్క్రీన్పై వేయడం నిజంగానే దురదృష్టకరం. ఆ ఫొటో చూసి మేము కూడా షాకయ్యాం. అలాంటి ఈవెంట్స్ కోసం ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. ఇక (విజయ్ దేవరకొండ, రష్మికను ఉద్దేశించి) మేమంతా స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకు కూడా తెలుసు. ఆ చర్య వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే నాతోపాటు ‘హాయ్ నాన్న’ టీమ్ నుంచి క్షమాపణలు చెబుతున్నాం.
హీరోయిన్ రాకపోవడం.. యూఎస్ టూర్..!
మృణాల్ ఠాకూర్ ప్రమోషన్స్కు దూరంగా ఉంటున్నారనడంలో వాస్తవం లేదు. ప్రమోషన్స్, వరుస షూట్స్తో ఆమె ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొన్నిరోజులు ప్రమోషన్స్కు దూరంగా ఉన్నారు. ఇకపై ప్రతి ఈవెంట్లో ఆమె పాల్గొంటారు. నా గత చిత్రాలను యూఎస్ ఆడియన్స్ బాగా ఆదరించారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పి.. సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నా. ఈ క్రమంలోనే ‘హాయ్ నాన్న’ను అక్కడ ప్రమోట్ చేస్తున్నా.
ఆ సినిమాలు అందుకే వదులుకున్నా..!
ప్రస్తుతం కెరీర్ పరంగా నేను నా సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా. వేరే హీరోల చిత్రాల్లో నటించే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఈ క్రమంలోనే పలు క్రేజీ ప్రాజెక్ట్లు కూడా వదులుకున్నా. అలాగే, రీమేక్స్లో నటించడం నాకు పెద్దగా నచ్చదు. ఇప్పటివరకూ రెండు రీమేక్ చిత్రాల్లో నటించా. ప్రస్తుతం ఉన్న రోజుల్లో భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తున్నారు.
ఇది రీమేక్ కాదు..!
‘హాయ్ నాన్న’ అనేది రీమేక్ కాదు. ఇదొక ఒరిజినల్ కథ. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు. నేను ఓటీటీలోకి అడుగుపెట్టాలనుకుంటే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ వంటి ప్రాజెక్ట్తో రావాలనుకుంటున్నా. అలాగే, ‘యానిమల్’ లాంటి స్టోరీ నా వద్దకు వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా’’ అని నాని చెప్పారు.
పాట పాడి.. డ్యాన్స్ చేసిన నాని
‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్లో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘కమ్మని ఈ ప్రేమలేఖనే.. ’ పాటను నాని పాడి అలరించారు. మృణాల్ ఠాకూర్తో కలిసి ‘ఓడియమ్మా’ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి