Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట..’లో ‘రంగస్థలం’ ఛాయలు: నిర్మాత ధీరజ్ సమాధానమేంటంటే?
ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఒకటి. టీమ్ ప్రెస్మీట్లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సుహాస్ (Suhas) హీరోగా దర్శకుడు దుష్యంత్ తెరకెక్కించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). శివాని నాగారం (Shivani Nagaram) హీరోయిన్. శరణ్య కీలకపాత్ర పోషించారు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈసందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ధీరజ్లు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ సంగతులివీ..
* ఈ సినిమాలోని పలు సన్నివేశాల్లో శరణ్య హీరో. ఆమె క్యారెక్టర్కు అంత ప్రాధాన్యమివ్వడానికి కారణమేంటి?
సుహాస్: ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ నాకు ఫోన్ చేసి ఈ విషయంపైనే ప్రత్యేకంగా మాట్లాడారు. ‘నువ్వు నీ పాత్రకు కాకుండా మిగిలిన పాత్రలకూ స్కోప్ ఉండాలని చూస్తావు. అదే నీలో నాకు నచ్చే అంశం. చాలామంది హీరోలు తమ క్యారెక్టర్కే నిడివి ఎక్కువ ఉండాలని చూస్తుంటారు’ అని అన్నారు. కథ బాగుండి, సినిమా హిట్ అయితే చివరకు హీరోకే పేరొస్తుంది కదా (నవ్వుతూ..).
* వరుసగా మూడో విజయం అందుకున్నారు. నటన పరంగా ప్రశంసలు పొందారు. మీ ఫీలింగ్ ఏంటి?
సుహాస్: నేను హీరో కావాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి రాలేదు. అనుకోకుండా ఇదంతా జరిగింది. ఈ విజయాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
* మీ పాత్ర స్ట్రాంగ్గా ఉంది. దాని కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
శివాని: పాత్రలో లీనమయ్యేందుకు రోజూ స్క్రిప్టును చదివేదాన్ని. వర్క్షాప్స్లో పాల్గొన్నా.
* రెండు వర్గాల నేపథ్యంలో అల్లుకున్న ఈ కథలో ఒక వర్గాన్నే తెరపై చూపించడానికి కారణమేంటి?
దుష్యంత్: ఇలాంటి కథలన్నింటిలో అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ ఉంటాయి. వాటి పేర్లు మెన్షన్ చేయకుండా సినిమా తీయాలని నేను ముందునుంచీ అనుకున్నా.
రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు
* క్లైమాక్స్ విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిపై మీ స్పందన?
దుష్యంత్: చంపడంతో పగ తీరితే దానికి అర్థం ఉండదు. అందుకే పతాక సన్నివేశంలో కీలకపాత్రను కిల్ చేయకూడదనుకున్నా. ఈ విషయంలో కొందరికి అసంతృప్తి ఉన్నా కొందరు ప్రశంసిస్తున్నారు.
* ఈ కథలో హీరోగా సుహాస్కు ముందు ఇంకెవరినైనా అనుకున్నారా?
ధీరజ్: లేదు. సుహాసే హీరో అని ఫిక్స్ అయి దర్శకుడు నాకు కథ చెప్పారు.
* ఈ కథ విన్నప్పుడు గానీ సినిమా చూసినప్పుడు గానీ ‘రంగస్థలం’ ఛాయలు ఉన్నాయని అనిపించిందా?
ధీరజ్: మాకేం అనిపించలేదు. ఎందుకంటే ‘రంగస్థలం’ కమర్షియల్ సినిమా. దానికి ఉండే క్రేజ్ వేరు. మేం వాణిజ్య అంశాలను దృష్టిలోపెట్టుకుని ఈ సినిమా చేయలేదు. అందుకే స్టార్లతో కాకుండా వర్ధమాన నటులతో రూపొందించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం