Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్లో ఉంటున్నారు: గౌతమ్కృష్ణ
హైదరాబాద్: ‘బిగ్బాస్’లో నటుడు శివాజీ మాట మీద నిలబడే మనిషి కాదని హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన డాక్టర్ గౌతమ్ కృష్ణ (Gautham krishna) అన్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
‘‘ఒక విధంగా ‘బిగ్బాస్ సీజన్-7’తోనే (Bigg boss telugu 7) నా జీవితం మొదలైంది. ఇక్కడకు రాకముందు నేనెవరికీ తెలియదు. నాకు (Gautham krishna) ఇండస్ట్రీ నేపథ్యం కూడా లేదు. ఎవరూ సపోర్ట్ చేసే వాళ్లు కూడా లేరు. చాలా సమస్యలు దాటుకుని వచ్చాను. ఈ షో ప్రారంభంకాకముందు 8 నెలలు ఖాళీగా ఉన్నా. ఒక రోజు శాండ్విచ్ తిన్న తర్వాత చూసుకుంటే అకౌంట్లో రూ.100 కూడా లేవు. ఆ సమయంలో చాలా బాధగా అనిపించింది. అమ్మానాన్నకు ఫోన్ చేసి, అడగాలనిపించలేదు. ఒక ఫ్రెండ్కు ఫోన్ చేసి, అడిగి తీసుకున్నా. జీవితంలో ఇంకెప్పుడూ ఒకరి దగ్గర చేయిచాచి అడిగే పరిస్థితి లేకుండా చూసుకోవాలనుకున్నా. అనుకోకుండా బిగ్బాస్ అవకాశం వచ్చింది. ఒక్కో స్టేజ్ను దాటుకుని, ఇక్కడి వరకూ వచ్చా. ఇప్పుడు ఎలిమినేట్ కావడం వల్ల నేనేమీ బాధపడటం లేదు. కానీ, టాప్-5లో ఉంటే బాగుండేది’’
ఎమోషనల్గా ఆ డైలాగ్ వచ్చేసింది
‘‘ఐదో వారం ఎలిమినేట్ అయిన తర్వాత ఇక నా పని అయిపోయిదనుకున్నా. కానీ, నా హౌస్లో నా ఆటతీరు నిజాయతీ చూసి, నాగార్జున సర్ మరో అవకాశం ఇచ్చారు. తిరిగి హౌస్లోకి వెళ్లినప్పుడు ‘అశ్వాత్థామ’ అంటూ మాట్లాడా. ఆ పేరు అర్థం చావు లేని వాడని. ఫైనల్గా చనిపోయా (హౌస్లో). ఒకసారి ఎలిమినేట్ అయినా కూడా తిరిగి వచ్చా కదా! అందుకు ఆ పేరు నాకు నేను పెట్టుకున్నా. ఆ వారం అందరూ నాకు వ్యతిరేకంగా ఎందుకు నామినేట్ చేశారో అర్థం కాలేదు. ఏదైనా గ్రూపిజం చేస్తున్నారా? అనిపించింది. ఇండస్ట్రీలో పెద్దగా ఎవరూ తెలియదు. హౌస్లోకి రాకముందు కంటెస్టెంట్లలో ఎవరితోనూ పరిచయం లేదు. వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ డైలాగ్ వచ్చేసింది. నేను (Gautham krishna interview)తిరిగి వస్తానని హౌస్లో వాళ్లు కూడా ఎవరూ ఊహించలేదు’’
బయటకు వెళ్లాక శుభశ్రీని కలుస్తా!
‘‘ఎదుటి వ్యక్తి గురించి నాకు ఏదైనా అనిపిస్తే, వెంటనే బయటకు చెప్పను. మనసులోనే పెట్టుకుంటా. అది ఈ హౌస్లో నడవదని నాకు అర్థమైంది. నా ఆలోచన దృక్పథం మారింది. నెగెటివ్, పాజిటివ్ ఏదీ ఆలోచించలేదు. రెండోసారి వచ్చిన తర్వాత ప్రతిదీ కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడా. మొదటి రోజు నుంచే శుభశ్రీ నాకు మంచి ఫ్రెండ్ అయింది. బయటకు వెళ్లాక ఆమెను కలుస్తా. అలాగే నైనీ కూడా. నేను డైరెక్ట్ చేసిన మూవీ సినిమాటోగ్రాఫర్కు నైనీ ఫ్రెండ్. (Bigg boss telugu 7) అలా ఆమె గురించి ముందే తెలుసు. కానీ, బయట కలవలేదు. హౌస్లో ఉన్నన్ని రోజులు శుభశ్రీతో నిజాయతీగానే మాట్లాడా. ఏ రిలేషన్ షిప్ అయినా, ఫ్రెండ్ షిప్తోనే మొదలవుతుంది. అది ఎక్కడి వరకూ వెళ్తుందనేది ఐదు వారాల్లో డిసైడ్ చేసేది కాదు. తను వెళ్లేటప్పుడు మాట్లాడేంత సమయం లేదు. ఆమె హౌస్లో లేనప్పుడు నేను మాట్లాడితే, అది ఆమెకు నెగెటివ్ అవుతుంది. అందుకే ఆమె వెళ్లిన తర్వాత ఒక్కసారి కూడా తన గురించి చర్చ తీసుకురాలేదు’’
శుభశ్రీ విషయంలో అది జరగలేదు
‘‘లెటర్ త్యాగం చేసే సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యా. మీరు నన్ను స్వార్థపరుడనుకుంటే దాన్ని అంగీకరిస్తా. అప్పుడు గౌతమ్ 1.ఓ ఉన్నాడు. అర్థం చేసుకోలేకపోయాడు. సందర్భం వచ్చినప్పుడు శుభశ్రీకి కృతజ్ఞత చెబుదామనుకున్నా. ఆ సమయానికి ఆమె వెళ్లిపోయింది. నేను లోపలికి వచ్చాక సందీప్ మాస్టర్ను సేవ్ చేశా. నాకు నామినేట్ చేసే పవర్ ఉన్నా, ప్రియాంక, శివాజీలను నామినేట్ చేయలేదు. ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ముందు, నాకు సాయం చేసిన వారికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలన్నది నా ఆలోచన. శుభశ్రీ విషయంలో అది జరగలేదు’’
అందుకే శివాజీ హౌస్లో ఉండగలుగుతున్నారేమో!
‘‘శివాజీ’ అన్న మొదటిసారి నన్ను నామినేట్ చేస్తూ కొన్ని పాయింట్లు చెప్పారు. ‘గౌతమ్ స్థితిమంతుడు. ఒక సినిమా కూడా చేశాడు. బయటకు వెళ్లి ఎలాగైనా బతుకుతాడు. వేరే వాళ్లకు ఈ షో చాలా అవసరం’ అన్నాడు. గతంలో ఓ షూటింగ్ సందర్భంగా ఆయన్ను కలిశాను. చాలా మంచి వ్యక్తి. బాగా మాట్లాడారు. కానీ, హౌస్లో (Bigg boss telugu 7) ఇలా మాట్లాడే సరికి నాకు మాటలు రాలేదు. నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయో ఆయనకు తెలియదు కదా! ‘నేను నీతి, నిజాయతీలతో ఉంటా. నేను సరైన నిర్ణయాలే తీసుకుంటా’ అని ఆయన చెబుతుంటారు. కానీ, ప్రశాంత్, యావర్లు తప్పు చేస్తే, వాళ్లకు అది తప్పు అని చెప్పరు. అవన్నీ చూసే సరికి నాకు చికాకు వచ్చేసింది. చేయికి దెబ్బ తగిలిన తర్వాత ఆయన ఫిజికల్ గేమ్స్ పెద్దగా ఆడింది లేదు.
👉Click to follow EENADU WhatsApp channel
ఎక్కువగా సంచాలకుడిగానే చేశారు. ప్రశాంత్, యావర్లను సపోర్ట్ చేయడం ద్వారా ప్రేక్షకుల నుంచి సానుభూతి పొందడం ద్వారా ఇన్ని రోజులు ఉండగలుగుతున్నారేమో. అది ఆయన స్ట్రాటజీ కావచ్చు. ఒకవేళ నేను అనుకుంటున్నది తప్పు కూడా కావచ్చు. ఆయన ఎవరితోనైనా చర్చ పెడతే, ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించరు. నేను ఏదైనా మాట్లాడితే ఎవరు నమ్ముతారు చెప్పండి. ఆ స్థాయి వ్యక్తి మాటలను అందరూ చాలా మంది నమ్ముతారు. అందుకే కరెక్ట్గా మాట్లాడాలని అనుకుంటాను. హౌస్లోనూ, నాగార్జునగారికి చెప్పలేకపోయిన ఒక మాట ఇక్కడ చెబుతా. శివాజీ అన్న హౌస్లో మాట మీద నిలబడే మనిషి కాదు’’
బిగ్బాస్లో నేను చేసిన గొప్ప పని అదే!
‘‘గేమ్స్ లేనప్పుడు అందరూ ఫ్రెండ్స్లాగానే ఉంటారు. కానీ, ఏదైనా పాయింట్ వచ్చి సపోర్ట్ చేయాలంటే అందరూ నాకు వ్యతిరేకంగా ఉంటారు. గేమ్లో నా వృత్తిని తీసుకురావడం నాకు నచ్చలేదు. నేను పంచెకట్టుకున్నప్పుడు ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా నచ్చలేదు. అలాగే యావర్ విషయంలో నేను మాట్లాడింది కూడా తప్పు అని ఒప్పుకొంటా. అమర్లో కొన్ని మైనస్లు ఉన్నాయి. అతడి వల్ల ప్రియాంక ఆట చెడిపోతోంది. ఎందుకంటే ప్రియాంక నాకు పాయింట్స్ ఇచ్చిన తర్వాత నీకు అలాంటి పరిస్థితి వస్తే, అమర్కు పాయింట్స్ ఇవ్వమని పదే పదే చెప్పింది. అమర్ వచ్చి ప్రియాంకను అదే పనిగా అడగడం వల్లే అలా చేసింది. ఒకవేళ ప్రియాంక నాకు పాయింట్స్ ఇవ్వకపోతే, నేను వేరే రకంగా ఆలోచించేవాడిని. నేను కెప్టెన్గా ఉన్నప్పుడు లేడీస్ వీక్ అని పెట్టాను. మహిళా ఫాలోయింగ్ కోసం మాత్రం ఆ పనిచేయలేదు. ఈ బిగ్బాస్ హౌస్లో నేను ఏదైనా గొప్ప పనిచేశానంటే అది మహిళల వారం’’
- గౌతమ్ దృష్టిలో బిగ్బాస్ హౌస్లో ముందుకు వెళ్లేది ఎవరు? ముగిసిపోయేది ఎవరు?
- అర్జున్: ఫిజికల్ గేమ్ బాగా ఆడతున్నాడు. హౌస్మేట్స్తో కలిసి ఉంటే బాగుంటుంది.
- ప్రియాంక: తన సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆమెతో అనుబంధం ఏర్పడింది. టాప్-5లో ఉంటుంది
- శివాజీ: కొన్ని తప్పులు ఉన్నాయి. కానీ, మైండ్ గేమ్ ఆడుతున్నాడు. అందుకే ఫిజికల్ గేమ్స్ ఆడకపోయినా ఉండగలుగుతున్నారు. అదే ఆయనను గెలిపించే అవకాశం ఉంది. టాప్-5లో ఉంటారు.
- పల్లవి ప్రశాంత్: మంచి అబ్బాయి. శివాజీ అన్న ఏది చెబితే అది ఫాలో అవుతాడు. అలా చేయకుండా ఉంటే బాగుంటుంది.
- యావర్: ఎమోషనల్ వ్యక్తి. బయటకు వచ్చాక ఇద్దరం కలిసి ట్రిప్నకు వెళ్తాం
- అమర్: అందరి దగ్గరి నుంచి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు. వ్యక్తిగతంగా ఆడుతున్నప్పుడు అది మంచిది కాదు. టాప్-5కు వెళ్లడు.
- శోభ: నెగెటివిటీ ఎక్కువ. టాప్-5కు వెళ్లదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.