Brahmanandam: నా జీవితంలో అదొక అందమైన అధ్యాయం!
నవ్వులు పంచే నటులు చాలా మందే. ఆ నవ్వుకి సైతం గిలిగింతలు పెట్టగల సమర్థుడు... బ్రహ్మానందం. తనదైన ముఖ కవళిక ఒక్కటి చాలు... ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడానికి! ఒక్క పంచ్ చాలు... సన్నివేశం పండడానికి!
నవ్వులు పంచే నటులు చాలా మందే. ఆ నవ్వుకి సైతం గిలిగింతలు పెట్టగల సమర్థుడు... బ్రహ్మానందం. తనదైన ముఖ కవళిక ఒక్కటి చాలు... ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడానికి! ఒక్క పంచ్ చాలు... సన్నివేశం పండడానికి! అధ్యాపక జీవితం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయనలో నటుడే కాదు... మంచి చిత్రకారుడు, సాహిత్యాభిమానీ ఉన్నారు. నాస్తికత్వం... ఆస్తికత్వం మేళవింపుతో జీవితాన్ని చూసే అలవాటున్న బ్రహ్మానందం ఆ కోణంలోనే తన ఆత్మకథని రాశారు. ‘నేను... మీ బ్రహ్మానందమ్’ అంటూ! ఈ సందర్భంగా బ్రహ్మానందంతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.
‘‘తరాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఉన్నప్పటి తరమే గొప్పదనుకుంటూ బతుకుతున్న మానవాళి ఎక్కువ. అది కాదు కావల్సింది, కాలం కొద్దీ మనం మారుతూ ఉండాలి. నూతనత్వాన్ని అంగీకరించాలి. నువ్వు ఆ పని చేయకపోయినా కాలం ఆగదు, మార్పు ఆగదు. ప్రపంచం అరచేతుల్లోకి వచ్చాక కూడా... ఈ మార్పులు కాదు, కూడదు అనుకోకూడదు. వాటితోపాటు మనం ప్రయాణం చేయాలి’’.
‘‘నేను చాలా గొప్పవాణ్ని, భయంకరమైన ప్రతిభ ఉంది కాబట్టే నేను ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నానని అనుకోవడం అజ్ఞానం. వందల, వేల మంది నటులు ఒక చోట కలిసున్నప్పుడు ఒకొక్కరిపై ఒక్కోసారి సినిమా ఫోకస్ లైట్ పడుతుంటుంది. ఆ లైట్ పడిన కాసేపు నా అంతటివాడు మరొకడు లేడనిపించేలా తళుక్ తళుక్మని మెరిసిపోతుంటాడు. అప్పుడు చాలా మంది నేను నిజంగా గొప్పవాణ్ని అని భ్రమలో పడి బతుకుతుంటారు. నాపై కూడా ఫోకస్ లైట్ పడింది. అయితే ఆ లైట్ నాపై వేసి అతను టీ తాగడానికి వెళ్లాడేమో, కాసేపు ఎక్కువ సమయం ఉండిపోయింది. అంతే తప్ప నాకు ముందు కానీ, నా తర్వాత కానీ ప్రతిభావంతులు లేరని కాదు అర్థం. బ్రహ్మానందం అంటే ఖరీదైన వ్యవహారం, ఆయన పారితోషికం ఎక్కువ అనే అభిప్రాయాలతో కొత్తతరం ఉంది. నాకు ఇంత పేరు రావడానికి కారణమయ్యారు దర్శకులు. ఈ నా జీవితం వాళ్లకీ ఉపయోగపడాలి కదా. అందుకే కొత్తతరం దర్శకులకు అందుబాటులో ఉంటూ సినిమాలు చేస్తున్నా’’.
ఆత్మకథకి ‘నేను...’ అనే పేరు పెట్టడానికి కారణం?
ఇది నేను, నా జీవితం అని తెలియడంతోపాటు... అందులో తాత్వికత కూడా స్పురించాలన్న ఆలోచనతో పెట్టిన పేరే అది. నేనెవరిని అని తెలుసుకోవడం గురించే కదా రమణ మహర్షి చెప్పింది. నాదైన జీవితం నుంచి వచ్చింది కూడా కావడంతో నా ఆత్మకథకి ‘నేను...మీ బ్రహ్మానందమ్’ అని పేరు పెట్టా.
ఆత్మకథ రాయడానికి సరైన సమయం ఇదే అనిపించిందా? లేక ఇతరత్రా కారణాలేమైనా మిమ్మల్ని ప్రేరేపించాయా?
నేను సెల్ఫ్ ఎడిటింగ్ ఉన్న మనిషిని. నా గురించి నేను గొప్పగా ఆలోచించుకోవడం కంటే... నన్ను నేను పొగుడుకోవడంకంటే విమర్శించుకోవడమే ఎక్కువ. వచ్చి పది సినిమాలు చేయగానే ఆత్మకథ మొదలు పెట్టామనుకోండి. ఇతనికి ఏం ఆత్మ ఉందని, దానికి ఏం కథ ఉందని అప్పుడే మొదలుపెట్టాడని అనుకుంటారు. నటుడిగా ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నప్పుడే నా ప్రయాణంలోని అనుభవాల్ని చెప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ఇది రాయడం మొదలుపెట్టాకే రెండేళ్లు సమయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై రాయడం కాదు కదా, ఇంచుమించు 70 ఏళ్లు వెనక్కి వెళ్లి రాయల్సి వచ్చింది.
ఆత్మకథలనగానే జీవితంలోని ఎత్తు పల్లాలు... వివాదాలు, సంచలనాలు గుర్తొస్తుంటాయి. మీరూ వాటిని స్పృశించారా?
నా ఆత్మకథ వైవిధ్యంగా ఉండాలనేది నా కోరిక. ఏదో ఒక సంచలన విషయాన్నో లేదంటే వివాదాన్నో స్పృశించి... దాంతో పుస్తకానికి ఓ భావోద్వేగాన్ని ఆపాదించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో రాసింది కాదు. దేవుడి దయవల్ల అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నాను. నా ఈ జీవితం నుంచి తర్వాత తరం ఏం తెలుసుకుంటుంది? వాళ్లకి ఎలా ఉపయోగపడుతుందనే కోణంలోనే ఆలోచించి రాశా. నేనే గొప్పవాణ్ని అని కొంతమంది అనుకుంటారు. అదేమీ కాదు, అంతా ఆ దేవుడి దయ అని మరికొంతమంది అనుకుంటారు. మరి ఇందులో నా కోణం ఏది? నా కష్టం.. దానికి భగవంతుడి సాయం తోడైతేనే పరిపూర్ణమైన ప్రతిఫలం అని నమ్ముతాను. ఇలాంటి ఆలోచనలతోపాటు... మరెన్నో విషయాలు ఇందులో ఉంటాయి.
మీలోని తాత్విక ఆలోచనల ప్రభావమే ఈ పుస్తకంపై ఎక్కువ ఉన్నట్టుంది?
తాత్వికత, వేదాంతం అని రకరకాల అభిప్రాయాలు వస్తుంటాయి. నా దృష్టిలో వేదాంతం అనేది, నిజం అనేది వేర్వేరు కాదు. ‘అతను రాత్రి 1 గంట వరకూ మాతోనే కూర్చున్నాడు. సరదాగా మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి ఇంటికి పయనమయ్యాడు. వద్దురా ఈ సమయంలో అన్నా వినలేదు. ప్రమాదం జరిగింది, పోయాడు’ అంటాం. ఇక్కడ అతను రాత్రి 1 గంట వరకూ ఉండటం నిజం, సరదాగా మాట్లాడటం నిజం. ప్రమాదంలో చనిపోవడమూ నిజమే. చివర్లో ఆ ఘటనకి వేదాంతం అద్ది ‘అతని కర్మ అలా ఉంది. అతనికి మృత్యువు అలా దగ్గరైంది, లేకపోతే అప్పటిదాకా మాతో ఉండటం ఏమిటి? వద్దన్నా వినకుండా వెళ్లడమేమిటి’ అంటూ ఉంటాం. మరిక్కడ వేదాంతం ఉందా? నిజం ఉందా? రెండూ కలిసే ఉంటాయి. వేదాంతం కావల్సినవాళ్లు దాన్ని తీసుకుంటారు. నిజం తీసుకోవల్సినవాడు నిజాన్ని తీసుకుంటాడు. నాస్తికుడిగా ఉండాలనుకున్నప్పుడు అలాగే ఉంటాడు. తాను ఆస్తికత్వాన్ని నమ్ముతాననుకుంటే అలానే మాట్లాడతాడు. అందరూ మనుషులే అనే భావనే ఈ పుస్తకంలో ఉంటుంది. అదెక్కువ, ఇది తక్కువ అని కాకుండా నా జీవితంలో ఏది ఉంటే అది రాశా. అందుకే నా పుస్తకంలో అన్నీ ఉండవు, అంతా ఉంటుందని చెబుతున్నా.
ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన అంశాలేమిటి?
ధనవంతుడు ఎవడో... పేదవాడు ఎవడో తెలియని వయసు ఒకటి ఉంటుంది. అదే... బాల్యం. పక్కనోడికి ఉన్నాయి, నాకు లేవు... తను మంచి డ్రెస్ వేసుకున్నాడు, నాకు లేదనే తారతమ్యాల గురించి పూర్తిగా స్పృహ లేని దశ ఒకటి ఉంటుంది. నా జీవితంలో అదొక అందమైన అధ్యాయం. దాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఆ ఘట్టాన్ని మరోసారి గుర్తు చేసుకున్నప్పుడు... అది అక్షరబద్ధమైనప్పుడు తెలియని అనుభూతి కలిగింది.
మీ జీవితం ఆధారంగా మరికొన్ని పుస్తకాలు కూడా వస్తున్నాయని తెలిసింది? ఆ వివరాలు చెబుతారా?
బ్రహ్మానందం ఫొటో బయోగ్రఫీ అని ఒక పుస్తకం వస్తుంది. సంజయ్ కిశోర్ రాస్తున్నారు. అందులో నేను వేసిన బొమ్మలు, చిత్రలేఖనం అభిరుచి ప్రస్తావన కూడా ఉంటుంది. నా సినిమా జీవితానికి సంబంధించిన విశ్లేషణని ఓ పుస్తకంగా రాస్తున్నారు శ్రీకాంత్ కుమార్. ఏ ఏ సినిమాల్లో ఎలా నటించాననే విషయాలు అందులో ఉంటాయి. ఇక వివాదాలు అంటున్నారు కదా, పేర్లు ఉచ్ఛరించకుండా అది కూడా అందరికీ ఉపయోగపడేలా అందమైన రీతిలో ఓ పుస్తకం రాద్దామనే ఆలోచన ఉంది. అందులో చిన్నప్పుడు పడిన అవమానాలు మొదలుకొని నాపైన అభిమానం, పొగడ్తలు, తెగడ్తలు అన్నీ ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!