సంక్రాంతికి మేరీ క్రిస్మస్
‘మేరీ క్రిస్మస్’...కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.
‘మేరీ క్రిస్మస్’...కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబరు 8న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొత్త విడుదల తేదీని పంచకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోను పోస్ట్ చేసింది. ‘ప్రతి చిత్ర దర్శకనిర్మాతలలాగే ఈ సినిమాను ఎంతో ప్రేమతో రూపొందించాము. ఈ ఏడాది చివరి రెండు నెలలు చిత్రాల విడుదల కోలహలంతో నిండిపోయాయి. ఈ సీజన్లో విడుదలైన సినిమాల అనుభూతిని, ఆనందాన్ని ఆస్వాదించడానికి మా సినిమా విడుదల తేదీని పొడిగిస్తున్నాము. మా చిత్రాన్ని 2024 జనవరి 12న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లో సంక్రాంతి సందర్భంగా అభిమానులను అలరించనుందన్నమాట.
సుమంత్ చిత్రం... మహేంద్రగిరి వారాహి
సుమంత్ కథానాయకుడిగా జాగర్లపూడి సంతోష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మీనాక్షి కథానాయిక. కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మాతలు. ఈ సినిమాకి ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరుని ఖరారు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.
వీడు.. నిన్ను రాణిని చేసేస్తాడు!
‘రాజు యాదవ్’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించారు. అంకిత ఖరత్ కథానాయిక. ఈ సినిమా తొలి గీతాన్ని దర్శకుడు బాబీ ఇటీవల విడుదల చేశారు. ‘‘రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు.. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్ సాహిత్యమందించగా.. రామ్ మిరియాల ఆలపించారు. ‘‘ప్రేమ, వినోదంతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో నిండిన చిత్రమిది. నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కూర్పు: బి.నాగేశ్వర రెడ్డి, ఛాయాగ్రహణం: సాయిరామ్ ఉదయ్.
కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే చిత్రమిది
‘‘ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఒక వ్యక్తి కాదు.. శక్తి. తెలంగాణ కోసం ఉద్యమాలే ఊపిరిగా బతికారు. పేద ప్రజలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి. అలాంటి కాళోజీ కథతో సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. ఆ ప్రయత్నాన్ని ‘ప్రజాకవి కాళోజీ’ రూపంలో తెరపైకి తీసుకొచ్చి ప్రభాకర్ జైనీ దంపతులు వారి జన్మ ధన్యం చేసుకున్నార’’న్నారు నటుడు, దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి. ఆయన హైదరాబాద్లో ఇటీవల జరిగిన ‘ప్రజాకవి కాళోజీ’ చిత్ర ట్రైలర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూల విరాట్ టైటిల్ పాత్రలో ప్రభాకర్ జైనీ తెరకెక్కించిన చిత్రమిది. విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా దృష్టిలో ఒక అసాధ్యమైన టాస్క్. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని దీన్ని విజయవంతంగా పూర్తి చేశాం. కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా.. ప్రతి తెలుగు వాడు గర్వించే విధంగా సినిమా ఉంటుంది. దీంట్లో సమాజం కోసం ప్రాణాలర్పించే ఒక యువ జంటను చూపించాం. పునరుజ్జీవం పొందుతున్న.. సజీవ చైతన్యంతో తొణికిసలాడుతున్న సమాజాన్ని చూపించాం. ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణు ఊడుగుల, వీఎన్ ఆదిత్య, నరసింహప్ప, మామిడి హరికృష్ణ, వేముల శ్రీనివాస్, అమృత లత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Love Me - Trailer: థ్రిల్లింగ్ స్టోరీతో ‘లవ్ మీ’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘లవ్ మీ’(Love Me). ఇఫ్ యు డేర్.. అన్నది ఉపశీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకుడు. మే 25న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
విజయ్ దేవరకొండ చేయలేకపోయిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?
యువతలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన గతంలో కొన్ని సినిమాలను చేయలేకపోయారు. అవి బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయ్యాయి. మరి ఆ సినిమాలేంటి? వాటి కథేంటి? -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
‘జబర్దస్త్’ కెవ్వు కార్తిక్ ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటుడు
కెవ్వు కార్తిక్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి తుదిశ్వాస విడిచారు. -
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎమర్జెన్సీ’(Emergency). ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కొత్త సినిమా రాక... థియేటర్ నిండక...
వేసవి వినోదం అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది... సినిమానే. సుదీర్ఘంగా సాగుతుంది ఈ సీజన్. స్టార్ హీరోల చిత్రాలు...పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలు... -
దిమాక్ కిరికిరి
‘కిరాక్ పోరి వస్తే సైట్ మార్... ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్పా మార్... ఇదే నా స్టైల్’ అంటున్నాడు ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్. -
ఆరుతో అదృష్టం కలిసిరావాలి
ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్ యువకథానాయిక జాన్వీ కపూర్. -
అహం.. కలహం
దంపతుల మధ్య కలహాలకి వాళ్ల అహం ఎంత కారణమైందో తెలియాలంటే ‘విద్య వాసుల అహం’ చూడాల్సిందే. రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన చిత్రమిది. -
ఆ హత్యల వెనక ఒక్కడు?
ఒక్క ఆధారం కూడా దొరక్కుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఆ ఒక్కడు ఎవడో తెలియాలంటే ‘దక్షిణ’ చూడాల్సిందే. ‘మంత్రం’, ‘మంగళ’ చిత్రాల ఫేం ఓషో తులసీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
వచ్చింది... బడ్డీ పాట
అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ పతాకంపై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. -
నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సెట్స్పైకి!
‘మలైకోటై వాలిబన్’గా ఇటీవలే తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ అగ్రకథాయకుడు మోహన్లాల్. ప్రయోగాత్మక కథలు, సవాలు విసిరే పాత్రలతో ప్రయాణం చేస్తున్న ఆయన. -
ఎవరికీ లొంగని ఛాంపియన్
బాలీవుడ్లో ప్రస్తుతం బయోపిక్ల హవా నడుస్తోంది. ఇప్పుడీ బాటలోనే మరికొద్ది రోజుల్లో ‘చందు ఛాంపియన్’తో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ కథానాయకుడు కార్తిక్ ఆర్యన్. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ