Harihara veeramallu: లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. పవన్ ఓవైపు రాజకీయాలతోనూ.. మరోవైపు ఇతర సినిమాలతోనూ బిజీగా ఉండటంతో ఇది ఆలస్యమవుతూ వస్తోంది. అయితే గురువారం ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. దాంతో పాటు ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తొలి భాగానికి ‘హరి హర వీరమల్లు: స్వార్డ్ వెర్సెస్ స్పిరిట్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. దాదాపు నిమిషంన్నరకు పైగా నిడివితో ఉన్న ఈ టీజర్లో వీరమల్లు ప్రపంచాన్ని పరిచయం చేశారు. ‘‘ప్రతివాణ్నీ వాడిపైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబుని దిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. మనపైనున్న ఈ దొంగలందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు. వాడొచ్చి.. ఈ దొంగలు, దొరల లెక్కలన్నీ సరి చేస్తాడు’’ అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్తో వీరమల్లుగా పవన్ను పరిచయం చేసిన తీరు ఆసక్తిరేకెత్తించింది. ఇదొక రాబిన్హుడ్ తరహా కథాంశంతో రూపొందనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. దానికి తగ్గట్లుగానే టీజర్లో సన్నివేశాలు కనిపించాయి. అలాగే కోహినూర్ వజ్రం దీంట్లో కీలకంగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రచార చిత్రంలో పవన్ యాక్షన్ హంగామా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన చిత్రీకరణ, నిర్మాణానంతర పనుల్ని క్రిష్ పర్యవేక్షణలో దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుండగా.. బాబీ దేవోల్, నాజర్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్ రావు, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుదిరగక వెతుకు
‘ఇలాంటి పాత్రని పోషించడం నాకెరీర్లో ఇదే మొదటిసార’ని చెబుతున్నారు కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. -
జోడీ.. తేలేదెప్పుడో?
కథానాయకులతో కథ సెట్టయ్యిందంటే చాలు ఆ తర్వాత కసరత్తులన్నీ ఆయనకు జోడీగా కనిపించే నాయిక చుట్టూనే తిరుగుతుంటాయి. సినీప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా కొత్త భామతో ముందుకెళ్లాలా.. మార్కెట్ను ప్రభావితం చేసేలా హిట్టు జోడీని పునరావృతం చేయాలా.. -
‘గోట్’కి ‘అవతార్’ నిపుణుల వీఎఫ్ఎక్స్
అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా భారీ బడ్జెట్తో, అత్యంత భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న చిత్రం ‘గోట్’. వెంకట్ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం తోడైంది. -
ఎమర్జెన్సీ మరోసారి వాయిదా
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. 1975ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. -
కవితా కృష్ణమూర్తికి లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డు
శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సీనియర్ నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (యూకేఏఎఫ్ఎఫ్) జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. -
కేన్స్లో మన అందాలు
కేన్స్లో మరోసారి మెరిసింది ఐశ్వర్యరాయ్. కన్నుల పండువగా జరుగుతున్న 77వ కేన్స్ చిత్రోత్సవాల్లో రెడ్కార్పెట్పై నడిచి అలరించింది. -
థియేటర్ల బంద్ వ్యక్తిగత నిర్ణయమే
‘తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. -
దివ్యవతి దెయ్యం ఎందుకైంది?
‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాల్ని తప్పకుండా చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకి కళ వస్తుంది’’ అన్నారు ఆశిష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో తెలుగు యువకుడి దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
-
విశాఖలో ‘చంద్రగిరి’ దందా!!
-
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!