Maheshbabu: దుబాయ్‌లో కథా చర్చలా?

మహేష్‌బాబు కొత్త సినిమాపై దృష్టి పెట్టే సమయం ఇది. ‘సర్కారు వారి పాట’ని పూర్తి చేసిన ఆయన సెలవుల కోసం దుబాయ్‌ వెళ్లారు. సహజంగానే చేస్తున్న సినిమా పూర్తి కాగానే అలా విదేశాలకి వెళ్లడం

Updated : 25 Apr 2022 09:59 IST

మహేష్‌బాబు కొత్త సినిమాపై దృష్టి పెట్టే సమయం ఇది. ‘సర్కారు వారి పాట’ని పూర్తి చేసిన ఆయన సెలవుల కోసం దుబాయ్‌ వెళ్లారు. సహజంగానే చేస్తున్న సినిమా పూర్తి కాగానే అలా విదేశాలకి వెళ్లడం మహేష్‌కి ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. అందులో భాగంగానే కుటుంబంతో కలిసి దుబాయ్‌ వెళ్లారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్న అగ్ర దర్శకుడు రాజమౌళి కూడా అదే రోజున దుబాయ్‌కి పయనం కావడం చర్చనీయాంశంగా మారింది. మహేష్‌ - రాజమౌళి కలయికలోనే తదుపరి సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ కథా చర్చలకి దుబాయ్‌ వేదిక కావొచ్చనేది పరిశ్రమ వర్గాల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని