Hi Nanna: ‘హాయ్ నాన్న’లో సర్ప్రైజ్ పాత్రలున్నాయి: డైరెక్టర్ శౌర్యువ్
నాని హీరోగా శౌర్యువ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా ప్రచారంలో భాగంగా శౌర్యువ్ విలేకర్లతో ముచ్చటించారు.
నాని (Nani) హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయిక నటించగా.. శ్రుతి హాసన్ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఇప్పటికే నాని వరుస ఇంటర్వ్యూలతో సినిమా విశేషాలు షేర్ చేస్తుండగా.. తాజాగా దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) విలేకర్లతో ముచ్చటించి మరికొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అవేంటంటే..
మీ నేపథ్యం గురించి చెప్పండి ? ‘హాయ్ నాన్న’ జర్నీ ఎలా మొదలైంది?
శౌర్యువ్: మాది వైజాగ్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇంట్లో వాళ్ళు మెడిసిన్ చేయమని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చాను. మొదట కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. నాలుగేళ్ల క్రితమే ‘హాయ్ నాన్న’ కథ రాసుకున్నాను. ఈ కథ నానికి చెప్పిన వెంటనే ఓకే అన్నారు. ఆరు నెలల ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించాం.
‘హాయ్ నాన్న’కు ప్రధాన బలం ఏమిటి?
శౌర్యువ్: ఎమోషన్. తండ్రి కూతురు మధ్య అనుబంధం. అలానే మృణాల్ పాత్ర సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషన్ కారణంగానే నాని అంగీకరించాడని భావిస్తున్నా. మృణాల్ ఇటీవల మాట్లాడుతూ ‘హాయ్ నాన్న’ అందరికీ నచ్చుతుందని చెప్పారు. లేదంటే పేరు మార్చుకుంటా అన్నారు. సినిమాపై ఎంతో నమ్మకంతోనే ఆ మాట చెప్పారు.
ట్రైలర్ చూస్తుంటే నాగార్జున ‘సంతోషం’ గుర్తొస్తుందని అంటున్నారు?ఆ ఛాయలు ఉంటాయా?
శౌర్యువ్: లేదు. ‘సంతోషం’ కంటే ముందు ‘కుచ్కుచ్ హోతాహై’ ఉంది. సింగిల్ ఫాదర్ ప్రేమలో పడ్డాడని అనగానే ఆ సినిమాలన్నీ గుర్తొస్తాయి. కానీ, ‘హాయ్ నాన్న’ మాత్రం వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రోజూ మన జీవితంలో ఎదురయ్యే అంశాలు ఇందులో కనిపిస్తాయి.
మొదటి సినిమానే ఇలాంటి విభిన్నమైన కథను తెరకెక్కించడానికి కారణం?
శౌర్యువ్: దర్శకత్వం చేసే అవకాశం త్వరగా వస్తుందని యాక్షన్ కథలు కూడా రాశాను. కానీ, ప్రేమకథ అయితేనే ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఈ సినిమా భావోద్వేగాలతో కూడిని ప్రేమకథ. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ట్రైలర్లోనే సినిమా కథ అంతా తెలిసేలా ప్లాన్ చేశా. ఎందుకంటే ప్రేక్షకుడికి మనం ఏం చూపనున్నామనేది తెలియాలి. అందుకే ట్రైలర్ను అలా కట్ చేశాం.
‘హాయ్ నాన్న’ అనుకున్న దానికంటే ముందే విడుదల చేస్తున్నారెందుకు?
శౌర్యువ్: నాకు ఎంత సమయం ఉన్నా సరిపోదు(నవ్వుతూ). మొదట డిసెంబర్ 21న విడుదల చేయాలని అనుకున్నాం. ఇప్పుడు 7తేదీకి మార్చాం. అందరం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. నాని చాలా సలహాలిచ్చారు. హైదరాబాద్, గోవా, ముంబయి, కునూర్..తదితర ప్రాంతాల్లో 97 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం.
‘వాళ్లను నేను ఎంతో మిస్ అవుతున్నా’ : షారుక్ ఖాన్
ఇప్పుడు యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రేమకథను రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తోంది?
శౌర్యువ్: ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. హింసలేదు. ఇది చాలా భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రం. ఎమోషన్స్ తగ్గిపోతున్న సమయంలో ‘హాయ్ నాన్న’ లాంటి సినిమాలు రావాలి. ఈ కథ యూనివర్సల్. అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల వారికి నచ్చుతుంది.
సింగిల్ పేరెంట్ ఫాదర్పై మీ అభిప్రాయం ఏమిటి?
శౌర్యువ్: సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. అలాగే ఈ సినిమాకు సంగీతం మరింత బలాన్నిచ్చింది. ఇక ‘ఓడియమ్మ..’ పాట విక్రమ్ వాళ్ల అబ్బాయితో పాడించాం. అతడు నాకు మంచి స్నేహితుడు.
మృణాల్ ఠాకూర్ను ఎవరు ఎంపిక చేశారు?
శౌర్యువ్: ఈ సినిమాలో మృణాల్ను నేనే ఎంపిక చేశా. ఆమె నటించిన ‘తుపాన్’ చూశా. అందులో ఆమె నటన చాలా నచ్చింది. ‘హాయ్ నాన్న’లో ఏడ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి. మృణాల్ అలాంటి సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటిస్తారు. అందుకే ఆమెను ఎంపిక చేశా. ఇక బేబీ కియారా చాలా ప్రతిభావంతురాలు. ఎలాంటి సన్నివేశంలోనైనా సులువుగా నటించగలదు. స్క్రిప్ట్ పేపర్ ఇవ్వగానే ఎంత పెద్ద డైలాగునైనా చెప్పేస్తుంది. మేమంతా ఆశ్చర్యపోయాం.
శ్రుతి హాసన్ పాత్ర గురించి చెప్పండి?
శౌర్యువ్: ఇందులో శ్రుతి హాసన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతానికి ఇదే చెప్పగలను. ఈ సినిమాలో రెండు సర్ప్రైజ్ పాత్రలు కూడా ఉన్నాయి. ఇక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సపోర్ట్ చేశారు. వైర ఎంటర్టైన్మెంట్స్ నాకు సొంత బ్యానర్లా అనిపించింది.
‘హాయ్ నాన్న’ మీకు సవాలుగా అనిపించిన విషయం ఏమిటి?
శౌర్యువ్: ఇలాంటి కథను తెరకెక్కించడమే ఓ సవాలు. ఇది చాలా సున్నితమైన కథ.
దర్శకుడు కావడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
శౌర్యువ్: రాజమౌళి గారు. ఆయన సినిమాలు చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కొత్తగా వచ్చే ప్రతి దర్శకుడికి ఆయనే స్ఫూర్తి. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత వాటి గురించి చెబుతాను.
ఇక తాజాగా ‘హాయ్ నాన్న’ సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు క్లీన్ యూ (U) సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. దీని రన్టైమ్ 155 నిమిషాలు (2.35 గంటలు) ఉంది. అలాగే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రెండు మార్పులు సూచించింది. కొన్ని అభ్యంతర పదాలు ఉన్న సన్నివేశాల్లో మ్యూట్ను వాడాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు