Hi Nanna: ‘హాయ్ నాన్న’లో సర్ప్రైజ్ పాత్రలున్నాయి: డైరెక్టర్ శౌర్యువ్
నాని హీరోగా శౌర్యువ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా ప్రచారంలో భాగంగా శౌర్యువ్ విలేకర్లతో ముచ్చటించారు.
నాని (Nani) హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయిక నటించగా.. శ్రుతి హాసన్ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఇప్పటికే నాని వరుస ఇంటర్వ్యూలతో సినిమా విశేషాలు షేర్ చేస్తుండగా.. తాజాగా దర్శకుడు శౌర్యువ్ (Shouryuv) విలేకర్లతో ముచ్చటించి మరికొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అవేంటంటే..
మీ నేపథ్యం గురించి చెప్పండి ? ‘హాయ్ నాన్న’ జర్నీ ఎలా మొదలైంది?
శౌర్యువ్: మాది వైజాగ్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇంట్లో వాళ్ళు మెడిసిన్ చేయమని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చాను. మొదట కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. నాలుగేళ్ల క్రితమే ‘హాయ్ నాన్న’ కథ రాసుకున్నాను. ఈ కథ నానికి చెప్పిన వెంటనే ఓకే అన్నారు. ఆరు నెలల ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించాం.
‘హాయ్ నాన్న’కు ప్రధాన బలం ఏమిటి?
శౌర్యువ్: ఎమోషన్. తండ్రి కూతురు మధ్య అనుబంధం. అలానే మృణాల్ పాత్ర సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషన్ కారణంగానే నాని అంగీకరించాడని భావిస్తున్నా. మృణాల్ ఇటీవల మాట్లాడుతూ ‘హాయ్ నాన్న’ అందరికీ నచ్చుతుందని చెప్పారు. లేదంటే పేరు మార్చుకుంటా అన్నారు. సినిమాపై ఎంతో నమ్మకంతోనే ఆ మాట చెప్పారు.
ట్రైలర్ చూస్తుంటే నాగార్జున ‘సంతోషం’ గుర్తొస్తుందని అంటున్నారు?ఆ ఛాయలు ఉంటాయా?
శౌర్యువ్: లేదు. ‘సంతోషం’ కంటే ముందు ‘కుచ్కుచ్ హోతాహై’ ఉంది. సింగిల్ ఫాదర్ ప్రేమలో పడ్డాడని అనగానే ఆ సినిమాలన్నీ గుర్తొస్తాయి. కానీ, ‘హాయ్ నాన్న’ మాత్రం వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రోజూ మన జీవితంలో ఎదురయ్యే అంశాలు ఇందులో కనిపిస్తాయి.
మొదటి సినిమానే ఇలాంటి విభిన్నమైన కథను తెరకెక్కించడానికి కారణం?
శౌర్యువ్: దర్శకత్వం చేసే అవకాశం త్వరగా వస్తుందని యాక్షన్ కథలు కూడా రాశాను. కానీ, ప్రేమకథ అయితేనే ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఈ సినిమా భావోద్వేగాలతో కూడిని ప్రేమకథ. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ట్రైలర్లోనే సినిమా కథ అంతా తెలిసేలా ప్లాన్ చేశా. ఎందుకంటే ప్రేక్షకుడికి మనం ఏం చూపనున్నామనేది తెలియాలి. అందుకే ట్రైలర్ను అలా కట్ చేశాం.
‘హాయ్ నాన్న’ అనుకున్న దానికంటే ముందే విడుదల చేస్తున్నారెందుకు?
శౌర్యువ్: నాకు ఎంత సమయం ఉన్నా సరిపోదు(నవ్వుతూ). మొదట డిసెంబర్ 21న విడుదల చేయాలని అనుకున్నాం. ఇప్పుడు 7తేదీకి మార్చాం. అందరం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. నాని చాలా సలహాలిచ్చారు. హైదరాబాద్, గోవా, ముంబయి, కునూర్..తదితర ప్రాంతాల్లో 97 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం.
‘వాళ్లను నేను ఎంతో మిస్ అవుతున్నా’ : షారుక్ ఖాన్
ఇప్పుడు యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రేమకథను రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తోంది?
శౌర్యువ్: ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. హింసలేదు. ఇది చాలా భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రం. ఎమోషన్స్ తగ్గిపోతున్న సమయంలో ‘హాయ్ నాన్న’ లాంటి సినిమాలు రావాలి. ఈ కథ యూనివర్సల్. అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల వారికి నచ్చుతుంది.
సింగిల్ పేరెంట్ ఫాదర్పై మీ అభిప్రాయం ఏమిటి?
శౌర్యువ్: సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. అలాగే ఈ సినిమాకు సంగీతం మరింత బలాన్నిచ్చింది. ఇక ‘ఓడియమ్మ..’ పాట విక్రమ్ వాళ్ల అబ్బాయితో పాడించాం. అతడు నాకు మంచి స్నేహితుడు.
మృణాల్ ఠాకూర్ను ఎవరు ఎంపిక చేశారు?
శౌర్యువ్: ఈ సినిమాలో మృణాల్ను నేనే ఎంపిక చేశా. ఆమె నటించిన ‘తుపాన్’ చూశా. అందులో ఆమె నటన చాలా నచ్చింది. ‘హాయ్ నాన్న’లో ఏడ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి. మృణాల్ అలాంటి సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటిస్తారు. అందుకే ఆమెను ఎంపిక చేశా. ఇక బేబీ కియారా చాలా ప్రతిభావంతురాలు. ఎలాంటి సన్నివేశంలోనైనా సులువుగా నటించగలదు. స్క్రిప్ట్ పేపర్ ఇవ్వగానే ఎంత పెద్ద డైలాగునైనా చెప్పేస్తుంది. మేమంతా ఆశ్చర్యపోయాం.
శ్రుతి హాసన్ పాత్ర గురించి చెప్పండి?
శౌర్యువ్: ఇందులో శ్రుతి హాసన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతానికి ఇదే చెప్పగలను. ఈ సినిమాలో రెండు సర్ప్రైజ్ పాత్రలు కూడా ఉన్నాయి. ఇక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సపోర్ట్ చేశారు. వైర ఎంటర్టైన్మెంట్స్ నాకు సొంత బ్యానర్లా అనిపించింది.
‘హాయ్ నాన్న’ మీకు సవాలుగా అనిపించిన విషయం ఏమిటి?
శౌర్యువ్: ఇలాంటి కథను తెరకెక్కించడమే ఓ సవాలు. ఇది చాలా సున్నితమైన కథ.
దర్శకుడు కావడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
శౌర్యువ్: రాజమౌళి గారు. ఆయన సినిమాలు చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కొత్తగా వచ్చే ప్రతి దర్శకుడికి ఆయనే స్ఫూర్తి. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత వాటి గురించి చెబుతాను.
ఇక తాజాగా ‘హాయ్ నాన్న’ సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు క్లీన్ యూ (U) సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. దీని రన్టైమ్ 155 నిమిషాలు (2.35 గంటలు) ఉంది. అలాగే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రెండు మార్పులు సూచించింది. కొన్ని అభ్యంతర పదాలు ఉన్న సన్నివేశాల్లో మ్యూట్ను వాడాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం