స్వచ్ఛమైన గాలి.. పూల వనాలు

కృతిసనన్‌... బాలీవుడ్‌లో బిజీగా ఉన్న తార. ఇప్పటికే రాజ్‌కుమార్‌ రావ్‌తో ‘హమ్‌ దో హమారే దో’, అక్షయ్‌కుమార్‌తో ‘బచ్చన్‌పాండే’ చిత్రాలను పూర్తిచేసిన ఈ భామ... టైగర్‌ష్రాఫ్‌ ‘గణపత్‌’, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాలను ఒప్పుకొంది...

Published : 22 Apr 2021 01:27 IST

ముంబయి: కృతిసనన్‌... బాలీవుడ్‌లో బిజీగా ఉన్న తార. ఇప్పటికే రాజ్‌కుమార్‌ రావ్‌తో ‘హమ్‌ దో హమారే దో’, అక్షయ్‌కుమార్‌తో ‘బచ్చన్‌పాండే’ చిత్రాలను పూర్తిచేసిన ఈ భామ... టైగర్‌ష్రాఫ్‌ ‘గణపత్‌’, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాలను ఒప్పుకొంది. వరుణ్‌ధావన్‌తో కలిసి చేస్తున్న ‘భేదియా’ సినిమా షెడ్యూల్‌ ఇటీవలే ముగిసింది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘‘కరోనా చుట్టుముడుతున్న ఈ సమయంలో... హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రకృతి సోయగాల మధ్య అన్ని జాగ్రత్తలు తీసుకొని షెడ్యూల్‌ పూర్తిచేశాం. స్వచ్ఛమైన గాలి, అందమైన పూల వనాల మధ్య కాలం అలా గడిచిపోయింది. థ్యాంక్యూ కరోనా ఫ్రీ హిమాచల్‌ప్రదేశ్‌’’ అంటూ ట్వీట్‌ చేసింది. వరుణ్‌ధావన్‌తో కలిసి అక్కడ చేసిన సందడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని