Bheemadevarapally Branch: సందేశమిచ్చే భీమదేవరపల్లి బ్రాంచి
అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, అభిరామ్, రూప శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’ (Bheemadevarapally Branch). రమేష్ చెప్పాల దర్శకుడు.
అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, అభిరామ్, రూప శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’ (Bheemadevarapally Branch). రమేష్ చెప్పాల దర్శకుడు. బత్తిని కీర్తిలత గౌడ్, నరేందర్ చెట్లపల్లి సంయుక్తంగా నిర్మించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, జేడీ లక్ష్మీనారాయణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్ను తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్ చాలా బాగుంది. మంచి సందేశం ఉన్న చిత్రమని అర్థమవుతోంది. పూర్తి సినిమాను తప్పక చూస్తా’’ అన్నారు. ‘‘దర్శకుడు రమేష్ ఓ మంచి సందేశాన్ని వినోదాత్మకంగా ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే ప్రయత్నం చేశారు. అది అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత కీర్తి లత గౌడ్. ఈ సినిమాకి సంగీతం: చరణ్ అర్జున్, ఛాయాగ్రహణం: కె.చిట్టిబాబు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెనుదిరగక వెతుకు
‘ఇలాంటి పాత్రని పోషించడం నాకెరీర్లో ఇదే మొదటిసార’ని చెబుతున్నారు కాజల్ అగర్వాల్. ఆమె ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. -
జోడీ.. తేలేదెప్పుడో?
కథానాయకులతో కథ సెట్టయ్యిందంటే చాలు ఆ తర్వాత కసరత్తులన్నీ ఆయనకు జోడీగా కనిపించే నాయిక చుట్టూనే తిరుగుతుంటాయి. సినీప్రియుల అభిరుచులకు తగ్గట్లుగా కొత్త భామతో ముందుకెళ్లాలా.. మార్కెట్ను ప్రభావితం చేసేలా హిట్టు జోడీని పునరావృతం చేయాలా.. -
‘గోట్’కి ‘అవతార్’ నిపుణుల వీఎఫ్ఎక్స్
అగ్ర కథానాయకుడు విజయ్ హీరోగా భారీ బడ్జెట్తో, అత్యంత భారీ అంచనాల మధ్య ముస్తాబవుతున్న చిత్రం ‘గోట్’. వెంకట్ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రానికి మరో ఆసక్తికర విషయం తోడైంది. -
ఎమర్జెన్సీ మరోసారి వాయిదా
బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. 1975ల నాటి ఎమర్జెన్సీ చీకటి రోజుల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది చిత్రబృందం. -
కవితా కృష్ణమూర్తికి లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డు
శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సీనియర్ నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (యూకేఏఎఫ్ఎఫ్) జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. -
కేన్స్లో మన అందాలు
కేన్స్లో మరోసారి మెరిసింది ఐశ్వర్యరాయ్. కన్నుల పండువగా జరుగుతున్న 77వ కేన్స్ చిత్రోత్సవాల్లో రెడ్కార్పెట్పై నడిచి అలరించింది. -
థియేటర్ల బంద్ వ్యక్తిగత నిర్ణయమే
‘తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. -
దివ్యవతి దెయ్యం ఎందుకైంది?
‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాల్ని తప్పకుండా చూస్తారు. మా చిత్రంతో మళ్లీ థియేటర్లకి కళ వస్తుంది’’ అన్నారు ఆశిష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లవ్ మీ’. ఇఫ్ యు డేర్ అనేది ఉపశీర్షిక. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న తెలుగమ్మాయి వైష్ణవీ చైతన్య ఇప్పుడు ‘లవ్ మీ’తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో ఎదురైన ప్రశ్నలపై ఆమె స్పందించారు. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.