Nawazuddin Siddiqui: ‘సైంధవ్’.. అదృష్టవశాత్తూ బోటులోనే ల్యాండ్ అయ్యా: నవాజుద్దీన్
‘సైంధవ్’ (Saindhav)తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui). వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషించారు.
ఇంటర్నెట్డెస్క్: వెంకటేశ్ (Venkatesh) హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన చిత్రం ‘సైంధవ్’ (Saindhav). నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో సిద్ధమైన ‘సైంధవ్’ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నవాజుద్దీన్ తాజాగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..
తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎందుకింత సమయం తీసుకున్నారు?
నవాజుద్దీన్ సిద్ధిఖీ: మంచి కథతో తెలుగు ప్రేక్షకులను పలకరించాలని ఎదురుచూశా. ‘సైంధవ్’తో ఆ అవకాశం వచ్చింది. ఇది ఎంతో ఆసక్తికరమైన కథ. వెంకటేశ్తో కలిసి వర్క్ చేయడం ఆనందంగా అనిపించింది. దాదాపు 40 రోజులు పనిచేశా. నా పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నా.
‘సైంధవ్’లో ప్రతినాయకుడిగా కనిపించడానికి కారణం?
నవాజుద్దీన్ సిద్ధిఖీ: హీరో లేదా విలన్.. పాత్ర ఏదైనా సరే ఆసక్తికరంగా ఉందా లేదా అనేది ముఖ్యం. నెగెటివ్ రోల్స్లో నటనకు ఆస్కారం ఉంటుందని నా భావన. శైలేశ్ విభిన్నమైన పాత్ర క్రియేట్ చేశారు.
డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమైనా సవాళ్లు ఎదుర్కొన్నారా?
నవాజుద్దీన్ సిద్ధిఖీ: ఇందులో నాది హైదరాబాదీ పాత్ర. భాష, భావాన్ని అర్థం చేసుకుని డబ్బింగ్ చెప్పా. కొత్త భాష నేర్చుకునేటప్పుడు కొంత కష్టంగానే ఉంటుంది. ప్రామ్టింగ్ మీద నాకు నమ్మకం లేదు. కష్టమైనా సరే డైలాగ్లను నేర్చుకుని చెప్పడమే ఇష్టం. యాక్షన్ సీన్స్లో నటించడం సవాలుగా అనిపించింది.
Vijay Sethupathi: ఆ లేబుల్ నాకు అవసరం లేదు: విజయ్ సేతుపతి
వెంకటేశ్ నుంచి మీరు ఎలాంటి విషయాలు నేర్చుకున్నారు?
నవాజుద్దీన్ సిద్ధిఖీ: వెంకటేశ్ చాలా కూల్గా ఉంటారు. సెట్లోకి వచ్చే ముందే డైలాగ్స్ అన్నీ నేర్చుకుని వస్తారు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్లో యాక్ట్ చేస్తారు. ఆయనకు సహనం ఎక్కువ.
దర్శకుడు శైలేశ్పై మీ అభిప్రాయం?
నవాజుద్దీన్ సిద్ధిఖీ: వర్క్ విషయంలో ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. కథ చెప్పినప్పుడే ఇది తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది. ఎంత అద్భుతంగా కథ చెప్పాడో అదే విధంగా తెరకెక్కించాడు. సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై అతడికి పట్టు ఉంది.
‘సైంధవ్’ చిత్రీకరణలో మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం?
నవాజుద్దీన్ సిద్ధిఖీ: శ్రీలంక షెడ్యూల్. సముద్రంలో బోటుపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు.. ఒక పెద్ద అల వచ్చింది. బోటు వదిలేసి అలతో పాటు పైకి లేచా. అదృష్టవశాత్తూ మళ్లీ బోటులోనే ల్యాండ్ అయ్యా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు