F3: వెంకీ-వరుణ్లతో ప్రగ్యా స్పెషల్ సాంగ్
తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ఎఫ్3’ ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్తేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ఎఫ్3’ ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్తేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. గతంలో వచ్చిన ‘ఎఫ్2’కు కొనసాగింపుగా ఈ సినిమా రాబోతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. త్వరలోనే చిత్రీకరణకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెలుగు చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రత్యేక గీతం కోసం కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ను చిత్ర బృందం సంప్రదించిందట. మాస్, యూత్తో పాటు అన్ని వర్గాలను ఈ పాట ఆకట్టుకునేలా ఈ గీతం ఉంటుందని సమాచారం. దీంతో ఈ పాటకు కాస్త పేరున్న కథానాయిక అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించిందట. అందుకే ప్రగ్యాను అడిగారట. ఆమెకు కూడా అందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం