Samantha: పెళ్లి గౌనును రీమోడల్‌ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్‌

నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్‌ చేయించడం చర్చకు దారి తీసింది.

Updated : 26 Apr 2024 10:34 IST

హైదరాబాద్: వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు నటి సమంత (Samantha). తాజాగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అవార్డుల కార్యక్రమం కోసం పెళ్లి గౌనును రీ మోడల్‌ చేయించి ఉపయోగించడం వైరల్‌ అయ్యింది.

సమంత తాజాగా ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముంబయి వేదికగా జరిగిన ఈ వేడుకలో ఆమె నలుపు రంగు గౌను ధరించి స్టేజ్‌పై హొయలొలికించారు. ఈ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘ఎల్లే లీడర్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌గా నన్ను ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు. నాకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్‌ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించా. దీనిని అందంగా డిజైన్‌ చేసిన క్రేశాబజాజ్‌కు కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవడం, జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తులను రీమోడలింగ్‌ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిస్తోన్న అభిమానానికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు.

‘ఏమాయచేసావే’తో దగ్గరైన నాగచైతన్య - సమంత పెద్దల అంగీకారంతో 2017లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. అక్టోబర్‌ 6, 7 తేదీల్లో గోవా వేదికగా హిందూ, క్రైస్తవ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి తంతులో రామానాయుడి సతీమణి చీరను సమంత రీమోడల్‌ చేయించి కట్టుకున్నారు. క్రిస్టియన్‌ వెడ్డింగ్‌లో తెల్లని గౌనును ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకున్న విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల రీత్యా 2021లో వీరిద్దరూ విడిపోయారు. ఆనాటి వెడ్డింగ్‌ గౌనును తాజాగా సమంత నలుపు రంగులోకి మార్పించి ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని