కొడాలి నాని నామినేషన్.. వెలవెల
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా..
డబ్బులిచ్చి తెచ్చినా.. ఫలితం లేదు
తెదేపా కార్యాలయం వైపు వెళ్లాలని ప్రయత్నం
అడ్డుకున్న అధికారులతో.. నేతల వాగ్వాదం
నామినేషన్ దాఖలు చేస్తున్న నాని
ఈనాడు, అమరావతి: గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఎంత పోరాడినా జనం మాత్రం రాలేదు. గత ఐదేళ్లుగా గుడివాడలో నాని చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడమే దీనికి కారణం. జనానికి మంచినీటి అవస్థలు, రహదారులపై వెతలు కనీస స్థాయిలోనూ నాని పరిష్కరించలేకపోయారు. ఆయన ప్రచారానికి వెళితే.. నిలదీతలు తప్ప.. ఎక్కడా స్వాగతాలు లేవు. అందుకే.. సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ హారతులిప్పించుకోవడం, పూలు చల్లించుకోవాల్సి వస్తోందని.. వైకాపా నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాని గురువారం వేసిన నామినేషన్ కూడా జనాలు కరవై.. పేలవంగా మారింది.
గొడవకు కాలు దువ్వినా.. అధికారులు కొడాలి నాని ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లే రూట్మ్యాప్ ఇచ్చారు. తెదేపా కార్యాలయం వైపు రాకుండా.. వేరే మార్గంలో వెళ్లేలా అనుమతి ఇచ్చారు. కానీ.. ఈ మార్గాన్ని మార్చి ఏలూరు రోడ్డులోని తెదేపా కార్యాలయం మీదుగా వెళ్లాలని నాని వర్గం ప్రయత్నించింది. తెదేపా కార్యాలయం వద్దకు వెళ్లి గొడవకు కాలు దువ్వాలని అనుకున్నారు. కానీ.. గుడివాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేందుకు అవకాశం ఉందని పోలీసులు ముందే అప్రమత్తమై.. అటువైపు వెళ్లకుండా ర్యాలీని అడ్డుకున్నారు. అయినా పట్టువదలకుండా.. రాజేంద్రనగర్ ఎస్బీఐ బ్యాంకు మీదుగా.. ఏలూరు రోడ్డులోని తెదేపా కార్యాలయం వైపు ప్రవేశించేందుకు.. వైకాపా మూక ప్రయత్నించింది. ఎవరు అడ్డుకున్నా ఆగేదే లేదంటూ.. గొడవకు కాలు దువ్వారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి, వారితో వాగ్వాదానికి దిగారు. అయినా.. పోలీసులు అంగీకరించకపోవడంతో.. నాని అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. దీంతో ఏలూరు రోడ్డు, మార్కెట్ సెంటర్, పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి చేరింది.
వారమంతా ఊదరగొట్టి.. డబ్బులిచ్చినా.. పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ర్యాలీగా తీసుకొస్తుండగా.. నెహ్రూచౌక్కు చేరుకునేసరికి.. వాళ్లంతా వెనక్కి వెళ్లిపోయారు. వారిని ర్యాలీలో ఉండాలని, వెళ్లిపోవద్దంటూ వైకాపా నేతలు బతిమాలినా.. ఎవరూ వినలేదు. గత వారం రోజులుగా నాని నామినేషన్ ఉందంటూ.. గుడివాడ నియోజకవర్గంలో మైకుల్లో ఊదరగొట్టి మరీ.. ప్రచారం చేశారు. గురువారం ఉదయం నుంచి మనిషికి రూ.300, మద్యం, బిర్యానీ ఇస్తామని చెప్పి జనాన్ని తీసుకొచ్చారు. ట్రాక్టర్లు, ఆటోలు పెట్టి మరీ జనాన్ని తీసుకొచ్చినా.. వాళ్లు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం గమనార్హం.
మహిళతో అసభ్య ప్రవర్తన..?: కొడాలి ర్యాలీలో పాల్గొన్న ఇద్దరు కార్యకర్తలు.. శరత్ థియేటర్ ప్రాంతంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ర్యాలీలో జెండా పట్టుకునేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆమె వర్గీయులు వచ్చి.. వారిద్దరికీ దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన బయటకు రాకుండా.. నేతలు జాగ్రత్త పడినట్లు సమాచారం.
నెహ్రూచౌక్లో ప్రజలు లేక పేలవంగా ఉన్న ర్యాలీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 05-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ !
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. -
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM