సొంతచెల్లెలి చీరపై సీఎం మాట్లాడటం సంస్కారమా?: షర్మిల
‘‘వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చ చీర కట్టుకున్నానట.
అవినాష్ను గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారో జగన్ సమాధానం చెప్పాలి
సీబీఐ ఛార్జిషీట్లో వైఎస్సార్ పేరు చేర్పించిన వారికి పదవి
పీసీసీ అధ్యక్షురాలు ధ్వజం
ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్-అమరావతి, నరసరావుపేట: ‘‘వేల మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా సీఎం జగన్ నేను ధరించిన దుస్తుల గురించి ప్రస్తావించారు. నేను పచ్చ చీర కట్టుకున్నానట. పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చచీర కట్టుకుంటే తప్పేముంది. చంద్రబాబు పచ్చరంగు ఏమైనా కొనుక్కున్నారా? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా? జగన్ మరిచిపోయినట్లున్నారు... సాక్షి పత్రిక, సాక్షి ఛానల్లో పైన పసుపు రంగు ఉంటుంది. అప్పట్లో వైఎస్సార్ పసుపు రంగు ఉంటే తప్పేముంది. అది తెదేపా సొంతం కాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్లు పసుపు చీర గురించి మాట్లాడతారా? నా దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్రెడ్డికి అసలు సంస్కారం ఉందా?’’ అని షర్మిల మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు జిల్లా సంజీవయ్యనగర్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో షర్మిల మాట్లాడారు. ‘రాసిచ్చిన స్క్రిప్టును చదివేది జగన్మోహన్రెడ్డి. నేను వైఎస్సార్ బిడ్డను. నాకు మోకరిల్లే అవసరం లేదు. వైకాపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. నన్ను దూషించారు.. బెదిరించారు. సొంత చెల్లెలి గురించి ఆలోచించకుండా మగవారి మధ్య మాట్లాడటం సభ్యతేనా?’ అని నిలదీశారు. ‘రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆలోచించాలి. భాజపా, మోదీ ముందు మోకరిల్లింది జగన్మోహన్రెడ్డి. పోలవరం, ప్రత్యేక హోదా, ప్రాజెక్టులను తాకట్టు పెట్టారు. దిల్లీకి వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు. అవినాష్రెడ్డిని రక్షించడానికి దిల్లీ వెళ్తున్నారు. వైఎస్సార్కు జగన్ వారసుడు కాదు. మోదీకి వారసుడు. మోదీకి దత్తపుత్రుడిగా భాజపా నాయకులే చెబుతున్నారు’ అని షర్మిల పేర్కొన్నారు.
సీబీఐ ఛార్జిషీట్లో జగన్ న్యాయవాదే పేరు చేర్చారు
‘కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్లో చేర్చలేదు. జగన్మోహన్రెడ్డి న్యాయవాది వైఎస్సార్ పేరును చేర్పించారు. కేసుల నుంచి జగన్ బయటపడడని తెలిసి.. న్యాయవాది సుధాకర్రెడ్డి సీబీఐ ఛార్జిషీటులో వైఎస్సార్ పేరును కోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. అందుకు ప్రతిఫలంగా అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? జగన్ సమాధానం చెప్పాలి. వివేకాను చంపిన నిందితుడికి సీటు ఎందుకు ఇచ్చావని సౌభాగ్యమ్మ లేఖ రాస్తే కనీసం స్పందించలేదు. జగన్కు ఉన్నది గుండెనా? బండనా? ప్రజలు నిజం వైపు ఉంటారా? నేరం వైపు ఉంటారా? అని ఆలోచించుకుని ఓటెయ్యాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.
అవినాష్రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో..
‘అవినాష్ అమాయకుడు అని నమ్ముతున్నానని, ఎంపీ టికెట్ ఇచ్చానని జగన్మోహన్రెడ్డి బహిరంగంగా చెబుతున్నారు. అవినాష్రెడ్డిని ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు. ఆలోచన, ఇంగితం దేవుడు ఇవ్వలేదా? జగన్ సమాధానం చెప్పాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు. ‘అవినాష్రెడ్డి, చంపినవారి మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. అడ్వాన్సు తీసుకున్నారు. కాల్ రికార్డులు సరిపోతున్నాయని సీబీఐ సాక్ష్యాలు చూపుతున్నా ఎందుకు నమ్ముతున్నారు’ అని ప్రశ్నించారు. జగన్కు ఏ అవసరం ఉండి అవినాష్ను కాపాడుతున్నారో అని వ్యాఖ్యానించారు.
రాజధాని నిర్మించలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని వాషింగ్టన్ డీసీగా చేస్తానని చెప్పిన జగన్ ఆ తర్వాత చేతులెత్తేశారు. చివరికి మూడు రాజధానులు ప్రకటించి.. ఒక్కటీ నిర్మించలేదు. నాగార్జునసాగర్ కాలువల మరమ్మతులు చేపడతానని హామీ ఇచ్చి మరిచారు. ఇసుక దోపిడీకి పాల్పడటంతో పాటు లిక్కర్ మాఫియాలో 33% వాటాలు తీసుకుంటున్న అంబటి రాంబాబును ఇంటికి సాగనంపాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.
ఆడబిడ్డ చీరపై విమర్శలా!: చంద్రబాబు
- ‘తోడపుట్టిన చెల్లెలి పుట్టుకపై.. మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా’ అని సీఎం జగన్ తీరుపై ఎక్స్ వేదికగా తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మహిళలంటే గౌరవం లేని మనిషి సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ మారారని పొట్ట కొట్టిన వైకాపా నాయకులు
వైకాపా నాయకుల ఆగడాలు ఆగడం లేదు. తెదేపా సభలకు వెళ్లారని, ప్రచారంలో పాల్గొన్నారని, తమ పార్టీలో చేరలేదని వైకాపా శ్రేణులు... దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. -
అంగీకారం.. అభ్యంతరం.. రెండూ ఆయనవే!
‘ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పిలేట్ అథారిటీ (జిల్లా జడ్జి స్థాయి అధికారి) దృష్టికి తీసుకెళ్లొచ్చు. -
ప్రతి రంగంలోనూ మార్పులు తెచ్చాం
‘ఎన్నడూ లేని విధంగా ఈ 59 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. రూ.2.70 లక్షల కోట్లను అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. -
జగన్ పాలనంతా బూతులు.. గోతులే
‘ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసి పసుపు కుంకుమ కింద ఇచ్చే పొలాలకు జిరాక్స్ పత్రాలు ఇస్తామా? వాటికి విలువ ఉంటుందా? అందుకే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ను వ్యతిరేకించాలని కోరుతున్నా. -
నరసాపురం.. కూటమిదే బలం!
సాగునీరందక పంట విరామం.. తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి.. ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచిన భీమవరంలో జే ట్యాక్స్.. ఇంటికి పునాది పడితే ‘కే’ ట్యాక్స్.. ఇదీ నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో పరిస్థితి. -
జగన్ ఇంటి సమీపంలో యువతిపై అఘాయిత్యం కేసులో చర్యలేవి?
సీఎం జగన్ ఇంటి సమీపంలో యువతిపై జరిగిన అఘాయిత్యం కేసు నిందితుల్ని ఇంతవరకు పోలీసులు ఎందుకు శిక్షించలేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీశర్మ ప్రశ్నించారు. -
మేం అధికారంలోకి వచ్చాక రౌడీలు జైల్లోకే!
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి.. జైళ్లలోనైనా ఉండాలని తెదేపా ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించినవారి భరతం పట్టేందుకే ‘రెడ్ బుక్’ ఉందని హెచ్చరించారు. -
దళిత, గిరిజనులను జగన్ బిచ్చగాళ్లలా చూశారు
ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి జగన్.. దళిత, గిరిజనులను అడుక్కునేవాళ్లలా చూశారని, వారి అభివృద్ధికి చేసిందేమీ లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. -
మంత్రాలయం ఎమ్మెల్యేకి నిరసన సెగ
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామంలో శనివారం ఎన్నికల ప్రచార నిమిత్తం వచ్చిన మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి వై.బాలనాగిరెడ్డికి చుక్కెదురైంది. -
పోస్టల్ బ్యాలెట్కు రూ.3 వేలు
తమకు ఓటేస్తే రూ.3 వేలు ఇస్తామని కొందరు ఉద్యోగులకు వైకాపా నాయకులు ఎర వేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ వినియోగించే కేంద్రాల్లోకి సెల్ఫోన్లు అనుమతించకూడదు. -
జగన్ గెలిస్తే ప్రజల భూములన్నీ తాకట్టే!
కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రజల భూముల్ని తాకట్టు పెట్టడానికి జగన్ కుట్ర పన్నినట్లు తెదేపా నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. -
సందిగ్ధతతో ఓటును చెల్లని కాగితంగా చేయొద్దు..!
పోస్టల్ బ్యాలట్ వేయడంలో కొంతమంది ఉద్యోగులు చేస్తున్న తప్పుల కారణంగా ఓట్లు చెల్లనివిగా మారుతున్నాయి. ఓటు వేయడంలో సందేహాలు ఉంటే అక్కడే ఉండే పీఓ, ఏపీఓల సహాయం సైతం తీసుకోవచ్చు. -
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్ విధానం అస్తవ్యస్తంగా మారిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. -
పొలాల్లో నాటిన హద్దు రాళ్లే.. జగన్ ఓటమికి శిలాఫలకాలు
జగనన్న భూరక్ష పేరిట రైతుల పొలాల్లో నాటిన హద్దురాళ్లే జగన్ ప్రభుత్వ ఓటమికి శిలాఫలకాలని, ఆ పథకం పెద్ద బోగస్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజల ఆస్తులు లాక్కొనేందుకు జగన్ కుట్ర
భూ యాజమాన్య హక్కు చట్టం పేరిట ప్రజల ఆస్తులను లాక్కొనేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
నేడు ధర్మవరానికి అమిత్షా.. జమ్మలమడుగుకి రాజ్నాథ్సింగ్
అనంతపురం జిల్లా ధర్మవరంలోని బత్తలపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆదివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొననున్నారు. -
రేపు అనకాపల్లి జిల్లాకు ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాతో తెదేపా, జనసేన కూటమిగా జట్టుకట్టిన తర్వాత తొలిసారిగా చిలకలూరిపేట బహిరంగసభకు వచ్చిన మోదీ.. తాజాగా రాజమహేంద్రవరంతో పాటు అనకాపల్లి జిల్లాలో పర్యటించేందుకు సోమవారం రానున్నారు. -
పవన్ను ఇబ్బంది పెట్టాలని హెలిప్యాడ్ ధ్వంసం
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం జీబీసీ రహదారిలో ఇటీవల సీఎం పర్యటన సందర్భంగా నిర్మించిన హెలిప్యాడ్ను వైకాపా నాయకులు శనివారం ధ్వంసం చేశారు. -
అలా ఫిర్యాదు... ఇలా ఆదేశాలు
సీఎం జగన్ మొదలుకుని కింది స్థాయి వైకాపా నాయకుల వరకూ ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష పార్టీలే లక్ష్యంగా అసత్య ఆరోపణలతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయటంపై ఎన్ని ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం (ఈసీ).. ప్రతిపక్షాలపై వైకాపా నాయకులు చేస్తున్న ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తోంది. -
జగనన్న బ్రాండ్లు వద్దే వద్దు...‘గోవా’ నకిలీ మద్యం అంటగట్టొద్దు
‘జగనన్న బ్రాండ్ల మద్యం వద్దే వద్దు..గోవా బ్రాండ్ల పేరిట అంటగడుతున్న నకిలీ మద్యం అసలే వద్దు. ప్రచారానికి వస్తుంటే మా ప్రాణాలతో చెలగాటమాడతారా? -
ఎన్నికలయ్యేలోపు ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టేసుకోండి
ఎన్నికల వేళ ఓట్లను అక్రమంగా పొందడానికి అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కొత్త ఎత్తు వేశారు.