45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు.
కూకట్పల్లిలో హత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
ఈనాడు- హైదరాబాద్, మూసాపేట, న్యూస్టుడే: అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. వేలిముద్రలు, జాగిలాలు, నేర చరిత్ర ఆధారంగా నిందితుల్ని గుర్తించాలనుకున్నా ఆచూకీ చిక్కలేదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూకట్పల్లి పోలీసులు.. నిందితులు వాహనంలో ప్రయాణించిన మార్గాల ఆధారంగా 45 కిలోమీటర్ల మేర దాదాపు 1200 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. బైకు నంబరు పసిగట్టి నిందితుల్ని కనిపెట్టారు. కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో మహిళ హత్యాచారం కేసులో ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. నిందితుల్లో ఒకరు మైనరు. కూకట్పల్లి ఇన్స్పెక్టర్ డి.కృష్ణమోహన్తో కలిసి ఏసీపీ కె.శ్రీనివాసరావు గురువారం వివరాలను వెల్లడించారు.
అత్యాచారం.. హత్య..: ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన మహిళ(45).. భర్త చనిపోవడంతో కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చి ఒంటరి జీవితం గడుపుతోంది. మూసాపేట వై జంక్షన్లోని వాహన షోరూంలో స్వీపర్గా పనిచేస్తూ చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉపాధి పొందేది. బిహార్కు చెందిన నితీశ్కుమార్ దేవ్(24), బాలుడు సంగారెడ్డిలోని బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. నిత్యం తాగేవారు. ఈనెల 20న స్నేహితుడు బిహార్ వెళ్తుండటంతో ఆ ఇద్దరూ అతన్ని కలిసేందుకు బైకుపై ప్యారడైజ్ వద్దకు వచ్చి తిరిగి వెళ్తూ కూకట్పల్లి సమీపంలోని ప్రశాంత్నగర్లో టీ తాగేందుకు ఆగారు. అక్కడ ఆ మహిళ ఒంటరిగా కనిపించగా ఆమెను అనుసరించారు. నిర్మానుష్య ప్రాంతంలోని భవనం వద్దకు వెళ్లగానే ఆమెను సెల్లార్లోని దుకాణాల వద్దకు లాక్కెళ్లి ఇద్దరూ అత్యాచారం చేశారు. ఆమె పారిపోబోతుంటే ఆమె తలను నేలకేసి కొట్టి చంపేశారు. ఇద్దరూ పరారయ్యారు.
ఆర్సీల ఆధారంగా ఆరా
నిందితులు వెళ్లే బైకు నంబరు సరిగా కనిపించక దర్యాప్తు క్లిష్టంగా మారడంతో ఎస్సైలు పి.రామకృష్ణ, ఆర్.ప్రేమ్సాగర్, జి.చంద్రకాంత్, టి.ఇంద్రసేనారెడ్డి 4 బృందాలుగా ఏర్పడి జల్లెడ పట్టారు. కూకట్పల్లి వైజంక్షన్ నుంచి సంగారెడ్డి వరకు 45 కిలోమీటర్ల పొడవునా మొత్తం 1,400 సీసీ కెమెరాలను పరిశీలించారు. నంబరు ప్లేటుపై అంకెలు కనిపిస్తున్నా ఆంగ్ల అక్షరాలు స్పష్టంగా లేవు. అంచనా వేయగా 10 బైకులు సరిపోలాయి. కొందరి వివరాలు ఆరా తీసి చివరకు వాహనాన్ని గుర్తించారు. చివరగా కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులు సంగారెడ్డిలోని బార్లో పనిచేస్తున్నట్లు తేలడంతో పోలీసులు నిందితుడు నితీష్కుమార్ను, బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!