Miss World 2024 Pageant: నాపై ఒత్తిడేమీ లేదు.. మిస్ వరల్డ్ -2024 పోటీదారు సినిశెట్టి.. ఆసక్తికర కబుర్లు
Miss World 2024: ఫిబ్రవరి 18 నుంచి భారత్ వేదికగా మిస్ వరల్డ్ 2024 పోటీలు జరగనున్న నేపథ్యంలో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి పంచుకున్న విషయాలు..
మిస్ వరల్డ్ - 2024 పోటీల్లో పాల్గొనడం పట్ల తనకేమీ ఒత్తిడి లేదని సిని శెట్టి (Sini Shetty) చెప్పుకొచ్చింది. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్-2022 విజేత అయిన ఆమె ప్రస్తుతం మిస్ వరల్డ్ -2024లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 28 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా జరుగుతున్న పోటీలు కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు దిల్లీలోని భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్ ముంబయిలో జరగనున్నాయి. ఈ క్రమంలో సినిశెట్టి (Sini Shetty interview) పంచుకున్న విషయాలు..
- మిస్ ఇండియా టైటిల్ గెలవడం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. కార్పొరేట్ ప్రపంచంలో నేను సాధించిన విజయాలు, భరతనాట్యం నాకెంతో సంతృప్తినిచ్చినా, మిస్ ఇండియా కావటం నా దృక్పథాన్ని మార్చింది.
- కర్ణాటకకు చెందిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ మిస్ వరల్డ్ అయ్యారు. అదే రాష్ట్రానికి చెందిన నేను ఈసారి పోటీలో ఉన్నా, ఒత్తిడిగా ఏమీ భావించటం లేదు.
- నా తల్లిదండ్రులకు మాత్రం ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. చాలా విషయాల గురించి నన్ను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటారు. నేను చెప్పే సమాధానాల్లో లాజిక్ వెతుకుతారు.
- నాకు ఇప్పటికీ గుర్తే మేమంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ‘నేను ఇలా (మిస్ ఇండియా పోటీలకు సంబంధించి) చేయాలనుకుంటున్నా’ అని చెప్పాను. నా జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయమని నా భావన. (Sini Shetty interview) అంతేకాదు, పోటీల్లో విజయం సాధిస్తానన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశా. ఎందుకంటే నేను మధ్యలో వదిలిపెట్టే రకం కాదు.
- భావోద్వేగాల విషయంలో నేనొక రోలర్ కోస్టర్ని. ఒక పోటీదారుగా నేను చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందాల భామలందరూ ఇక్కడికి వస్తున్నారు. నేను చేయాల్సింది.. చూపించాల్సింది చాలా ఉంది. అదొక భావోద్వేగాల వేదిక. కానీ, ఏదోక మూల కాస్త భయంగానే ఉంటుంది.
- ఇలాంటి పోటీల్లో తీవ్రమైన ఒత్తిడి సహజం. మనం చేసే పనిపై ప్యాషన్, మనల్ని మనం ఆవిష్కరించుకోవడం ముఖ్యం. మిస్ వరల్డ్ కోసం రెండేళ్ల నుంచి సిద్ధమవుతున్నా.
- ఒత్తిడి పెరిగినప్పుడు అది శారీరక, మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. పనిపై మనకున్న ఇష్టం, ఎలా చేస్తామన్న దాన్ని నేను బలంగా నమ్ముతా. నా ప్యాషన్ ఏంటంటే, డ్యాన్స్. నీలా నువ్వు ఉన్నప్పుడు కాస్త గట్టిగా శ్వాస తీసుకుని అన్నింటినీ అర్థం చేసుకోవడమే. నీపై నీకు దృఢ సంకల్పం ఉన్న రోజున ప్రతిదీ మనకోసం పని చేస్తుంది.
- భారతీయ సంప్రదాయాలతో మనం వేళ్లూనుకుని ఉన్నాం. ఆ సమయంలో ప్రపంచ యవనికపై సరికొత్త భారతాన్ని చూస్తున్నాం. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనదేశం కూడా ఒకటి. సాంకేతికంగా ముందున్నాం. ప్రగతిశీల భారత్వైపు మన పయనం సాగుతోంది.
- భారతదేశం మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈసారి 120 దేశాల అతిథులకు మన ఆతిథ్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో నేనూ భాగస్వామిని అవుతున్నందుకు మరింత సంతోషంగా ఉంది.
- సినిశెట్టి తల్లిదండ్రులది కర్ణాటక అయినా, ఆమె పుట్టి పెరిగింది అంతా ముంబయిలోనే. (Sini Shetty interview) నాలుగేళ్ల వయసులోనే డ్యాన్స్పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. 14ఏళ్ల వయసులో అరంగేట్రం చేసింది. పలు వేదికలపైనా ప్రదర్శనలు ఇచ్చింది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా కార్పొరేట్ సంస్థల్లోనూ పనిచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
‘డబుల్ ఇస్మార్ట్’ పాట వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ క్లారిటీ ఇచ్చారు. అందులో వాడిన లిరిక్స్ ఎవరినీ కించపరచడం కోసం కాదన్నారు. -
ధనుష్ చేయాలనుకున్న పాత్రలో నేను నటించా!
‘‘నేను హీరోనా? లేక విలన్గా కనిపిస్తానా అనే విషయాల్ని పక్కనపెడితే... నటన పరంగా ‘రాయన్’ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది’’ అంటున్నారు సందీప్కిషన్. -
ఆ షాక్ నుంచి బయటకు రావడానికి మూడు రోజులు పట్టింది: కృష్ణవంశీ
ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమానికి దర్శకుడు కృష్ణవంశీ అతిథిగా హాజరయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. -
పవన్ కల్యాణ్పై ప్రశ్న.. ఇలాంటివి అడగొద్దన్న నిహారిక
తన సమర్పణలో రానున్న ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు నిహారిక. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. -
‘నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అంటూ తిట్టారు: కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ (Krishna Vamsi) ఈటీవీ ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ (Naa Uchvasanam Kavanam) ద్వారా తాను తండ్రిగా భావించే సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఎన్నో అనుభవాలనుపంచుకున్నారు. -
యాస్కీన్ పాత్ర ‘కల్కి: పార్ట్-2’లో అదిరిపోతుంది: కమల్హాసన్
Kalki 2898 AD: కల్కిలో యాస్కీన్ పాత్ర గురించి కమల్హాసన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. -
నా ఫ్లాప్లు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు: స్టార్ హీరో
ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం సాధారణమైపోయిందని స్టార్ హీరో అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు -
ఆఫీస్ బాయ్ అనుకొని టీ తీసుకురమ్మన్నారు..: కృష్ణవంశీ
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (sirivennela sitarama sastry) ని చాలా ఎక్కువగా అనుసరించే వాడినని దర్శకుడు కృష్ణవంశీ (Krishna vamsi) అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
అందుకే ‘భారతీయుడు’ సీక్వెల్ రెండు భాగాలు: శంకర్
‘భారతీయుడు 2’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో టీమ్ పాల్గొని, సందడి చేసింది. -
‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్బాబు: నాగ్ అశ్విన్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్ మీడియాతో ముచ్చటించారు. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ప్రభాస్ పాత్రపై ఫ్యాన్స్ అసంతృప్తి: అశ్వనీదత్ సమాధానమేంటంటే?
‘కల్కి 2898 ఏడీ’తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
‘భారతీయుడు 2’ ప్రమోషన్లో భాగంగా శంకర్ అభిమానులతో ముచ్చటించారు. వారి ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. -
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తనకెంతో ఇష్టమని నాగార్జున అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
kalki part 2 release date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
కావాలనే అప్పుడు రెమ్యూనరేషన్ పెంచాను: కమల్ హాసన్
‘భారతీయుడు’లో తాను భాగం కావాలని అనుకోలేదని కమల్ హాసన్ చెప్పారు. తాజాగా ‘భారతీయుడు 2’ మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. -
ఆయన్ని చూస్తే అసూయగా ఉండేది: నాగార్జున
గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని అగ్ర కథానాయకుడు నాగార్జున గుర్తుచేసుకున్నారు. -
ప్రభాస్ అభిమానులు నన్ను క్షమించాలి: అమితాబ్ బచ్చన్
తాజాగా ‘కల్కి’ చిత్రబృందం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అమితాబ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులు తనని క్షమించాలని కోరారు. ఎందుకంటే.. -
నువ్వలా చేస్తే.. అమితాబ్ నేనూ చేస్తానన్నారు: ప్రభాస్
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబయిలో జరిగింది. -
‘పుష్ప 2’ని తిరస్కరించారా?: విజయ్ సేతుపతి సమాధానమేంటంటే
విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’. ఈ నెల 14న విడుదలైంది. ‘థ్యాంక్ యూ మీట్’లో పాల్గొన్న సేతుపతికి ‘పుష్ప 2’పై ప్రశ్న ఎదురవగా స్పందించారు. -
‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్బాబు
మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్ ముచ్చటించింది. -
నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదు!
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్బాబు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్