కయ్యానికి కాలుదువ్వుతున్న కంగన.. తాప్సీ
బాలీవుడ్లో వరుస బయోపిక్లు చేస్తూ దూసుకెళుతున్నారు బాలీవుడ్ భామలు కంగనా రనౌత్, తాప్సీ పన్ను. అయితే.. ఈ ఇద్దరి మధ్య చాపకింద నీరులా గొడవ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదిక తన భావాలను వ్యక్తపరిచే కంగన.. కొంతకాలంగా తాప్సీపై తీవ్రంగా స్పందిస్తోంది.
ముంబయి: బాలీవుడ్లో వరుస బయోపిక్లు చేస్తూ దూసుకెళుతున్నారు బాలీవుడ్ భామలు కంగనారనౌత్, తాప్సీపన్ను. అయితే.. ఈ ఇద్దరి మధ్య నివురు గప్పిన నిప్పులా కయ్యం సాగుతోంది. సామాజిక మాధ్యమాల వేదిక తన భావాలను వ్యక్తపరిచే కంగన.. కొంతకాలంగా తాప్సీపై కామెంట్స్ను పెడుతోంది. దీనిపై తాప్సీ కూడా అదే స్థాయిలో స్పందించడంతో వివాదం బయటికి పొక్కింది. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి కారణమేంటో తెలియదు కానీ.. ఇద్దరు పరస్పరం విమర్శలు చేసుకుంటూ కనిపిస్తున్నారు. అసలేమైందంటే..
కొంతకాలం క్రితం తాప్సీ తన ఫొటోషూట్కు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అవి అచ్చం గతంలో కంగన పాల్గొన్న ఫొటోషూట్ను పోలి ఉన్నాయి. దీంతో కొంతమంది అభిమానులు ఈ ఇద్దరి ఫొటోలను పక్కపక్కనే ఉంచి.. ‘కంగన.. కంగన లైట్’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కంగన దృష్టికి తీసుకొచ్చారు. వాటిపై స్పందించిన కంగన.. ‘ఆమె నాకు నిజమైన అభిమాని. నన్ను అధ్యయనం చేసి అనుకరించేందుకు ఎంతో విలువైన తన సమయాన్ని కేటాయిస్తోంది. నన్ను ప్రతిబింబించేలా ఉండేందుకు ప్రయత్నిస్తోంది’ అని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. కంగన చేసిన వ్యాఖ్యలపై తాప్సీ స్పందించింది. ప్రముఖ అమెరికన్ రచయిత రాబర్ట్ హెయిన్లెయిన్ రచనను ‘థాట్ ఆఫ్ ది డే’ పేరుతో ఆమె పోస్టు చేసింది. ‘సమర్థులు, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు ఏ విషయంలోనూ అసూయపడరు. అసూయ అనేది అభద్రతాభావంలో ఉండే వాళ్ల లక్షణం’ అని ఆ రచన భావం. తాప్సీ పెట్టిన ఈ పోస్టుపై కంగన మళ్లీ స్పందించింది. ‘ఆమె అందం, ప్రతిభ చూసి నేను అసూయపడుతున్నాను’ అని మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇలా ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా కయ్యానికి దిగడం గమనార్హం. కాగా.. ఈ ఇద్దరు హీరోయిన్లు ప్రస్తుతం బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాప్సీ ‘రష్మీరాకెట్’ బయోపిక్లో నటిస్తుండగా.. ఇటీవల ‘తలైవి’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న కంగన ఇప్పుడు ‘తేజాస్’లో నటిస్తోంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం