చికాగోలో ‘ఆటా’ కార్యాలయం.. అట్లాంటాలో సందడిగా ‘ఆటా’ బోర్డు కీలక సమావేశం
అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 24న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కార్యవర్గ సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్.....
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 24న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కార్యవర్గ సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్ కమిటీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆటా కార్యాలయాన్ని చికాగోలో ఏర్పాటు చేసేందుకు ఈ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రారంభోపన్యాసం చేస్తూ తనపై కార్యవర్గం ఉంచిన ఈ గురుతర బాధ్యతకు సదా కృతజ్ఞుడినన్నారు. తన ఆధ్వర్యంలో ఆటాలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఆటా చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 1500 మందితో వాషింగ్టన్ డీసీలో మహాసభలు నిర్వహించటం తన అదృష్టంగా భావిస్తున్నానని, అందుకు తోడ్పాటు అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి నివేదికను బోర్డుకు సమర్పించారు. మహాసభల సమయంలో ఎంతో సమర్థంగా కోశాధికారి బాధ్యతలు నిర్వహించినందుకు ఆయన సేవలను ఆటా బోర్డు కొనియాడింది. ఎన్నో కీలకమైన విషయాలు చర్చించిన ఈ సమావేశాన్ని సమర్థంగా నిర్వహించినందుకు కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి లింగాలను కార్యవర్గం అభినందించింది.
‘ఆటా‘లో రెండేళ్లకోసారి ఎన్నుకొనే నూతన కార్యవర్గం నామినేషన్ కమిటీ ఛైర్మన్గా పరమేశ్ భీంరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. ఆటాని ఎంతో సమర్థంగా ముందుండి నడిపించినందుకు అధ్యక్షుడు భువనేశ్ను అభినందించారు. తొలిసారి వినూత్న పద్ధతిలో బ్యాలెట్ ద్వారా నామినేషన్ కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రాసెస్, ఉపయోగాలను సంయుక్త కార్యదర్శి రామకృష్ణ వివరించారు. ఆటా ఎన్నికలు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా నిర్వహించడానికి సభ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల కమిటీ ఛైర్గా జాయింట్ ట్రెజరర్ విజయ్ కుందూరు వ్యవహరిస్తారు. ఆటా 17వ మహాసభల కన్వీనర్ సుధీర్ బండారు, కో-కన్వీనర్ కిరణ్ పాశం, కోర్కమిటీ, అడ్హక్, కాన్ఫరెన్స్ కమిటీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటా కాన్ఫరెన్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్ జయ్ చల్లా ఇంత పెద్ద ఎత్తున ఆటా మహా సభలు నిర్వహించడం ద్వారా ఆటా బ్రాండ్ వాల్యూ రెట్టింపు కావడం ఆనందదాయకమన్నారు.
అట్లాంటాలో సభ ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులకు ఆటా అడ్వయిజరీ కమిటీ ఛైర్ హనుమంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆటా కార్యాలయాన్ని చికాగోలో నెలకొల్పడం తన చిరకాల స్వప్నమని.. దాన్ని సాకారం చేస్తున్నందుకు బోర్డు సభ్యులను అభినందించారు. అట్లాంటా టీం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆటా పూర్వ అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, బర్డ్ అఫ్ ట్రస్టీస్ అనిల్ బొదిరెడ్డి, వేణు పిసికే, ప్రశీల్ గూకంటి, కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ కిరణ్ పాశం స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారా పటిష్టమైన నూతన కార్యవర్గం ఏర్పాటు అవుతుందని ఆకాంక్షించారు. మహిళలు విరివిగా సంస్థ కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆటా అట్లాంటా టీం ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేయడం తనకు ఎంతో ఆనందదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, పాటల కార్యక్రమాలు అతిథులను అలరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం