చికాగోలో ‘ఆటా’ కార్యాలయం.. అట్లాంటాలో సందడిగా ‘ఆటా’ బోర్డు కీలక సమావేశం
అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 24న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కార్యవర్గ సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్.....
అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 24న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) కార్యవర్గ సమావేశం జరిగింది. పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్ కమిటీలు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఈ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఆటా కార్యాలయాన్ని చికాగోలో ఏర్పాటు చేసేందుకు ఈ బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల ప్రారంభోపన్యాసం చేస్తూ తనపై కార్యవర్గం ఉంచిన ఈ గురుతర బాధ్యతకు సదా కృతజ్ఞుడినన్నారు. తన ఆధ్వర్యంలో ఆటాలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఆటా చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 1500 మందితో వాషింగ్టన్ డీసీలో మహాసభలు నిర్వహించటం తన అదృష్టంగా భావిస్తున్నానని, అందుకు తోడ్పాటు అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి నివేదికను బోర్డుకు సమర్పించారు. మహాసభల సమయంలో ఎంతో సమర్థంగా కోశాధికారి బాధ్యతలు నిర్వహించినందుకు ఆయన సేవలను ఆటా బోర్డు కొనియాడింది. ఎన్నో కీలకమైన విషయాలు చర్చించిన ఈ సమావేశాన్ని సమర్థంగా నిర్వహించినందుకు కార్యదర్శి హరిప్రసాద్ రెడ్డి లింగాలను కార్యవర్గం అభినందించింది.
‘ఆటా‘లో రెండేళ్లకోసారి ఎన్నుకొనే నూతన కార్యవర్గం నామినేషన్ కమిటీ ఛైర్మన్గా పరమేశ్ భీంరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా పరమేశ్ మాట్లాడుతూ.. ఆటాని ఎంతో సమర్థంగా ముందుండి నడిపించినందుకు అధ్యక్షుడు భువనేశ్ను అభినందించారు. తొలిసారి వినూత్న పద్ధతిలో బ్యాలెట్ ద్వారా నామినేషన్ కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్రాసెస్, ఉపయోగాలను సంయుక్త కార్యదర్శి రామకృష్ణ వివరించారు. ఆటా ఎన్నికలు ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా నిర్వహించడానికి సభ ఆమోద ముద్ర వేసింది. ఎన్నికల కమిటీ ఛైర్గా జాయింట్ ట్రెజరర్ విజయ్ కుందూరు వ్యవహరిస్తారు. ఆటా 17వ మహాసభల కన్వీనర్ సుధీర్ బండారు, కో-కన్వీనర్ కిరణ్ పాశం, కోర్కమిటీ, అడ్హక్, కాన్ఫరెన్స్ కమిటీల సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటా కాన్ఫరెన్స్ అడ్వయిజరీ కమిటీ ఛైర్ జయ్ చల్లా ఇంత పెద్ద ఎత్తున ఆటా మహా సభలు నిర్వహించడం ద్వారా ఆటా బ్రాండ్ వాల్యూ రెట్టింపు కావడం ఆనందదాయకమన్నారు.
అట్లాంటాలో సభ ఘనంగా నిర్వహించినందుకు నిర్వాహకులకు ఆటా అడ్వయిజరీ కమిటీ ఛైర్ హనుమంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆటా కార్యాలయాన్ని చికాగోలో నెలకొల్పడం తన చిరకాల స్వప్నమని.. దాన్ని సాకారం చేస్తున్నందుకు బోర్డు సభ్యులను అభినందించారు. అట్లాంటా టీం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ఆటా పూర్వ అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, బర్డ్ అఫ్ ట్రస్టీస్ అనిల్ బొదిరెడ్డి, వేణు పిసికే, ప్రశీల్ గూకంటి, కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ కిరణ్ పాశం స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారా పటిష్టమైన నూతన కార్యవర్గం ఏర్పాటు అవుతుందని ఆకాంక్షించారు. మహిళలు విరివిగా సంస్థ కార్యకలాపాల్లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆటా అట్లాంటా టీం ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేయడం తనకు ఎంతో ఆనందదాయకమని కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు, పాటల కార్యక్రమాలు అతిథులను అలరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!