‘మైట’ ఆధ్వర్యంలో ధూమ్ధామ్గా బతుకమ్మ సంబరాలు
విదేశాల్లో తెలుగువారు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో పూలపండుగ అంగరంగ వైభవంగా జరిగింది.
మలేషియా: విదేశాల్లో తెలుగువారు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో పూలపండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడంతో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కౌలాలంపూర్లోని డీచక్రరూఫ్ టాప్ హాల్, టీఎల్కే కాంప్లెక్స్, బ్రిక్ఫీల్డ్ కౌలాలంపూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగువారు హాజరై సందడి చేశారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెరాస శాసనసభ సభ్యుడు కిషోర్కుమార్, భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు, సూర్యాపేట జిల్ల్లా పరిషత్ ఛైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, ఇండియన్ హైకమిషన్ సెక్రటరీ సుష్మ, మలేషియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు సహా పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ.. ఏటా బతుకమ్మ సంబంరాలను నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ను అభినందించారు. విదేశాల్లో ఉంటున్నా, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న తెలంగాణ ఆడపడుచులను మెచ్చుకున్నారు. మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి, ప్రమాదవశాత్తూ మరణించిన వారికీ ‘మైట’ తరపున సహాయ సహకారాలు అందజేస్తున్న మైట కోర్ కమిటీ సభ్యులను అభినందించారు.
అనంతరం గాదరి కిషోర్కుమార్ మాట్లాడుతూ.. మైట చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందిస్తూ అలాగే తెలంగాణ వారికి ఏ సమస్య వచ్చినా మైట, తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మైట ప్రెసిడెంట్ తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ఏవౌస్, జెన్ టెక్, లావు టెక్సోలుషన్స్, అక్యూమెంట్ ఇన్ఫోటెక్, ఆలివ్ టెక్నాలజీస్ , తెరాస మలేషియా, మలబార్ గోల్డ్, కేవీటీ గోల్డ్, జాస్డేకొరేటర్స్, మినీమార్ట్ అప్, ట్రూఫ్రెషిస్, శ్రీబిర్యానీ.com రెస్టారెంట్, మై81 రెస్టారెంట్, బిగ్సి రెస్టారెంట్, ప్రబలీ రెస్టారెంట్, ఫామిలీ గార్డెన్ రెస్టారెంట్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు తిరుపతి, ఉపాధ్యక్షులు చొప్పరి సత్య, మోహన్రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ, రవిచంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రెజరర్ రవీందర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వర్మ, కృష్ణవర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణారెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్, కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత, యూత్ వింగ్ ప్రెసిడెంట్, కిరణ్గౌడ్, రవితేజ, కల్చరల్ మెంబర్స్ చందు, రామకృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరణి, ఇందు, రోజా, శ్రీలతతో పాటు, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్