‘మైట’ ఆధ్వర్యంలో ధూమ్ధామ్గా బతుకమ్మ సంబరాలు
విదేశాల్లో తెలుగువారు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో పూలపండుగ అంగరంగ వైభవంగా జరిగింది.
మలేషియా: విదేశాల్లో తెలుగువారు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో పూలపండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను రెండు సంవత్సరాల తరువాత ఘనంగా నిర్వహించడంతో ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కౌలాలంపూర్లోని డీచక్రరూఫ్ టాప్ హాల్, టీఎల్కే కాంప్లెక్స్, బ్రిక్ఫీల్డ్ కౌలాలంపూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెలుగువారు హాజరై సందడి చేశారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెరాస శాసనసభ సభ్యుడు కిషోర్కుమార్, భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు, సూర్యాపేట జిల్ల్లా పరిషత్ ఛైర్పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, ఇండియన్ హైకమిషన్ సెక్రటరీ సుష్మ, మలేషియా తెరాస వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు సహా పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ.. ఏటా బతుకమ్మ సంబంరాలను నిర్వహిస్తున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ను అభినందించారు. విదేశాల్లో ఉంటున్నా, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న తెలంగాణ ఆడపడుచులను మెచ్చుకున్నారు. మలేషియా వచ్చి ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారికి, ప్రమాదవశాత్తూ మరణించిన వారికీ ‘మైట’ తరపున సహాయ సహకారాలు అందజేస్తున్న మైట కోర్ కమిటీ సభ్యులను అభినందించారు.
అనంతరం గాదరి కిషోర్కుమార్ మాట్లాడుతూ.. మైట చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందిస్తూ అలాగే తెలంగాణ వారికి ఏ సమస్య వచ్చినా మైట, తెలంగాణ ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మైట ప్రెసిడెంట్ తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ఏవౌస్, జెన్ టెక్, లావు టెక్సోలుషన్స్, అక్యూమెంట్ ఇన్ఫోటెక్, ఆలివ్ టెక్నాలజీస్ , తెరాస మలేషియా, మలబార్ గోల్డ్, కేవీటీ గోల్డ్, జాస్డేకొరేటర్స్, మినీమార్ట్ అప్, ట్రూఫ్రెషిస్, శ్రీబిర్యానీ.com రెస్టారెంట్, మై81 రెస్టారెంట్, బిగ్సి రెస్టారెంట్, ప్రబలీ రెస్టారెంట్, ఫామిలీ గార్డెన్ రెస్టారెంట్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు తిరుపతి, ఉపాధ్యక్షులు చొప్పరి సత్య, మోహన్రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ, రవిచంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రెజరర్ రవీందర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వర్మ, కృష్ణవర్మ, వివేక్, రాములు, సుందర్, కృష్ణారెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్, కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, అశ్విత, యూత్ వింగ్ ప్రెసిడెంట్, కిరణ్గౌడ్, రవితేజ, కల్చరల్ మెంబర్స్ చందు, రామకృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరణి, ఇందు, రోజా, శ్రీలతతో పాటు, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి