Batukamma Celebrations: యూఏఈలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

యూఏఈ ఇండియన్ పీపుల్ ఫోరం తెలంగాణ కౌన్సిల్ అధ్యక్షుడు కుంబల మహేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో అజ్మన్ మైత్రి  ఫామ్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 01 Oct 2022 21:33 IST

అబుదాబి: యూఏఈ ఇండియన్ పీపుల్ ఫోరం తెలంగాణ కౌన్సిల్ అధ్యక్షుడు కుంబల మహేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో అజ్మన్ మైత్రి  ఫామ్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ గౌడ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మహిళలు, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. యూఏఈలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఒక చోట చేరి ఆహ్లాదంగా గడిపారు. ఆ తర్వాత బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వారందరికీ నిర్వాహకులు బహుమతులు అందజేశారు. వేడుకలు పూర్తయిన తర్వాత బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ పీపుల్‌ ఫోరం సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి రంజిత్, ప్రదీప్, శివకుమార్, శరత్ గౌడ్, నవనీత్, అశోక్, హరీష్, దశరథన్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని