బాటా-తానా ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల’ 11వ వార్షికోత్సవం

బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల 11వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి.

Updated : 21 May 2024 23:50 IST

కాలిఫోర్నియా: బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాఠశాల’ 11వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి. ఆరు గంటలపాటు జరిగిన వార్షికోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా శాంతా క్లారా బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ తారా కృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పాఠశాల’ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతి సెంటర్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వేదికపైకి వచ్చి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఏటా బే ఏరియాలో ‘పాఠశాల’కు ఆదరణ పెరుగుతోందని, బే ఏరియాలో 400 మందికి పైగా విద్యార్థులు పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎన్నారైల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాలు ద్వారా భవిష్యత్ తరాలకు తెలుగు భాష, సంస్కృతిని నేర్పడమే ‘పాఠశాల’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.

అనంతరం బాటా అధ్యక్షుడు కొండల్‌రావు మాట్లాడుతూ ‘పాఠశాల’ చేపట్టిన కార్యక్రమానికి మద్దతునిచ్చి సహకరించిన బాటా బృందాన్ని, కార్యక్రమానికి హాజరైన వారికి పరిచయం అభినందించారు. శివ కాడా (వైస్ ప్రెసిడెంట్), వరుణ్ ముక్క (సెక్రటరీ), హరి సన్నిధి(జాయింట్ సెక్రటరీ)లతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరితో కూడిన స్టీరింగ్ కమిటీని, కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన సాంస్కృతిక కమిటీని, సురేష్ శివపురం, రవి పోచిరాజు, సందీప్ కేదారిశెట్టిలతో కూడిన నామినేషన్ కమిటీని, సంకేత్, ఉదయ్, ఆదిత్య, గౌతమి, సందీప్‌లతో కూడిన యూత్ కమిటీని తారా కృష్ణన్‌కు పరిచయం చేశారు.

విజయ ఆసూరి (సలహాదారు), వెంకట్ కోగంటి (తానా జాయింట్ సెక్రటరీ), వెంకట్ అడుసుమిల్లి (తానా ఆర్ ఆర్, నార్త్ కాలిఫోర్నియా), ప్రసాద్ మంగిన (సలహాదారు), డాక్టర్ రమేష్ కొండా, వీరు ఉప్పల,డాక్టర్‌ గీతా మాధవి, సుబ్బారావు చెన్నూరిలు ‘పాఠశాల’ వార్షికోత్సవానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. రంగురంగుల బ్యానర్లు, పూలు, ఇతర కళాకృతులతో ఆడిటోరియంలో పండుగ వాతావరణం నెలకొంది. ‘సొగసరి అత్త గడసరి కోడలు’ స్కిట్, ‘ఎందరో మహానుభావులు’ (నాటిక), ‘అంబ పలుకు..జగదాంబ పలుకు’ (అవధానం), ‘మంత్రి ఎంపిక’, ‘మోహిని భస్మాసుర’, శ్లోకాలు, పద్యాలు, గేయాలను విద్యార్థులు ప్రదర్శించి అలరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలను ‘పాఠశాల’ కో ఆర్డినేటర్లు నివృత్తి చేశారు. వినోదభరితమైన సాయంత్రాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బృందానికి బాటా సలహా బోర్డు సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి శుభాకాంక్షలు తెలిపారు. తానా టీం మెంబర్ శ్రీనివాస్ వల్లూరిపల్లి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.

బే ఏరియా ‘పాఠశాల’ కో ఆర్డినేటర్లు శ్రీదేవి ఎర్నేని, సురేష్ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పలి, సునీత రాయపనేని, రవి పోచిరాజు ఉపాధ్యాయలు పద్మ సొంఠి, విజయ గోపరాజు, శ్రీవిద్య యలమంచిలి, షీలా గోగినేని, శ్రీకాంత్ దాశరథి, పద్మ విశ్వనాథ్, ధనలక్ష్మి, శరత్ పోలవరపు, దీప్తి మండలి, దీపికా బీహెచ్ఎస్, రాగిణి అరసాడ, ధన కనగాల, శ్యామ్ బాలె, శ్రీనివాస్ కొల్లి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి. నిర్వాహకులు, అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కుమన్నారు. కార్యక్రమం మొత్తానికి 'గ్రాడ్యుయేషన్ వాక్' హైలెట్‌గా నిలిచింది. తెలుగు భాషా వికాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులతో పాటు 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని