బాటా-తానా ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల’ 11వ వార్షికోత్సవం
బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల 11వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి.
కాలిఫోర్నియా: బే ఏరియా తెలుగు అసోసియేషన్(బాటా), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాఠశాల’ 11వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి. ఆరు గంటలపాటు జరిగిన వార్షికోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా శాంతా క్లారా బోర్డు అఫ్ ఎడ్యుకేషన్ తారా కృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పాఠశాల’ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రతి సెంటర్ నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు వేదికపైకి వచ్చి సర్టిఫికెట్లు అందుకున్నారు. ఏటా బే ఏరియాలో ‘పాఠశాల’కు ఆదరణ పెరుగుతోందని, బే ఏరియాలో 400 మందికి పైగా విద్యార్థులు పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎన్నారైల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాలు ద్వారా భవిష్యత్ తరాలకు తెలుగు భాష, సంస్కృతిని నేర్పడమే ‘పాఠశాల’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
అనంతరం బాటా అధ్యక్షుడు కొండల్రావు మాట్లాడుతూ ‘పాఠశాల’ చేపట్టిన కార్యక్రమానికి మద్దతునిచ్చి సహకరించిన బాటా బృందాన్ని, కార్యక్రమానికి హాజరైన వారికి పరిచయం అభినందించారు. శివ కాడా (వైస్ ప్రెసిడెంట్), వరుణ్ ముక్క (సెక్రటరీ), హరి సన్నిధి(జాయింట్ సెక్రటరీ)లతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీని, రవి తిరువీధుల, కామేష్ మల్ల, శిరీష బత్తుల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరితో కూడిన స్టీరింగ్ కమిటీని, కల్చరల్ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, తారక దీప్తిలతో కూడిన సాంస్కృతిక కమిటీని, సురేష్ శివపురం, రవి పోచిరాజు, సందీప్ కేదారిశెట్టిలతో కూడిన నామినేషన్ కమిటీని, సంకేత్, ఉదయ్, ఆదిత్య, గౌతమి, సందీప్లతో కూడిన యూత్ కమిటీని తారా కృష్ణన్కు పరిచయం చేశారు.
విజయ ఆసూరి (సలహాదారు), వెంకట్ కోగంటి (తానా జాయింట్ సెక్రటరీ), వెంకట్ అడుసుమిల్లి (తానా ఆర్ ఆర్, నార్త్ కాలిఫోర్నియా), ప్రసాద్ మంగిన (సలహాదారు), డాక్టర్ రమేష్ కొండా, వీరు ఉప్పల,డాక్టర్ గీతా మాధవి, సుబ్బారావు చెన్నూరిలు ‘పాఠశాల’ వార్షికోత్సవానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. రంగురంగుల బ్యానర్లు, పూలు, ఇతర కళాకృతులతో ఆడిటోరియంలో పండుగ వాతావరణం నెలకొంది. ‘సొగసరి అత్త గడసరి కోడలు’ స్కిట్, ‘ఎందరో మహానుభావులు’ (నాటిక), ‘అంబ పలుకు..జగదాంబ పలుకు’ (అవధానం), ‘మంత్రి ఎంపిక’, ‘మోహిని భస్మాసుర’, శ్లోకాలు, పద్యాలు, గేయాలను విద్యార్థులు ప్రదర్శించి అలరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలను ‘పాఠశాల’ కో ఆర్డినేటర్లు నివృత్తి చేశారు. వినోదభరితమైన సాయంత్రాన్ని అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బృందానికి బాటా సలహా బోర్డు సభ్యులు జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు ఉప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, హరినాథ్ చీకోటి శుభాకాంక్షలు తెలిపారు. తానా టీం మెంబర్ శ్రీనివాస్ వల్లూరిపల్లి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
బే ఏరియా ‘పాఠశాల’ కో ఆర్డినేటర్లు శ్రీదేవి ఎర్నేని, సురేష్ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పలి, సునీత రాయపనేని, రవి పోచిరాజు ఉపాధ్యాయలు పద్మ సొంఠి, విజయ గోపరాజు, శ్రీవిద్య యలమంచిలి, షీలా గోగినేని, శ్రీకాంత్ దాశరథి, పద్మ విశ్వనాథ్, ధనలక్ష్మి, శరత్ పోలవరపు, దీప్తి మండలి, దీపికా బీహెచ్ఎస్, రాగిణి అరసాడ, ధన కనగాల, శ్యామ్ బాలె, శ్రీనివాస్ కొల్లి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ సంబరాలు ఆకట్టుకున్నాయి. నిర్వాహకులు, అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించి తళుక్కుమన్నారు. కార్యక్రమం మొత్తానికి 'గ్రాడ్యుయేషన్ వాక్' హైలెట్గా నిలిచింది. తెలుగు భాషా వికాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, శ్రేయోభిలాషులతో పాటు 500 మంది పాల్గొన్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!