ఎన్నారైలే తెదేపాకు కీలకం కావాలి: మాజీ మంత్రి గొల్లపల్లి
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రవాసీ ఓటర్లే కీలకం కావాలని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు.
దుబాయి: ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రవాసీ ఓటర్లే కీలకం కావాలని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. వేలాది మంది తెదేపా అభిమానులు గల్ఫ్లో ఉంటున్నారని. అభిమానాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడాన్ని సులభతరం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. యూఏఈ తెలుగుదేశం పార్టీ ఆహ్వానం మేరకు దుబాయి విచ్చేసిన ఆయన పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషిపై మాట్లాడారు. ప్రతి ఎన్నారై తమ ప్రాంతంలో తెదేపా బలోపేతానికి పనిచేయాలన్నారు. జగన్ విధ్వంసక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కనీస సౌకర్యాల్లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశేనని ప్రపంచంలో అందరికీ తెలుసన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని, అందుకోసం ప్రతి ప్రవాసీయుడూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్కు ఏదీ కట్టడం చేతకాదని.. కూల్చడం ఒక్కటే తెలుసని విమర్శించారు. తన స్వార్థ రాజకీయాల కోసం కూల్చడం సీఎం చేతగానితనానికి నిదర్శనమన్నారు. ఎన్టీఆర్ ప్రపంచంలో ప్రతి తెలుగువాడూ గర్వించదగిన మహానీయుడని.. పేదల సంక్షేమం కోసం ఆలోచించి ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలోని వైకాపా హయాంలో సంక్షేమం లేదు.. అభివృద్ధి లేదు.. రోడ్లు లేవు.. జీతాల్లేవు, ఉద్యోగాల్లేవ్.. ఇళ్లు లేవు.. పాలన లేదు.. ఇంత దారుణమైన పాలన ఇదివరకు ఎన్నడూ చూడలేదంటూ ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ పేరు తొలగింపును ముక్తకంఠంతో ఖండించాలి
అనంతరం గల్ఫ్ తెదేపా అధ్యక్షుడు రావి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమన్న దాన్ని కార్యచరణలో అమలు చేసి చూపిన ఏకైక తెలుగు నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రజల ఆరోగ్యంతోనే అసలైన సంక్షేమం అమలవుతుందని విశ్వసించిన కొద్దిమంది భారతీయ నేతల్లో ఆయనొకరన్నారు. మారుమూల మండల కేంద్రాల్లో పీహెచ్సీలను నెలకొల్పాలని 1985లో తెదేపా సర్కార్ నిర్ణయించినప్పుడో అదో సంచలనమన్నారు. మండల కేంద్రాల నుంచి మొదలుకొని హైదరాబాద్లో స్పెషాలిటీ ఆస్పత్రుల దాక ప్రతిచోట ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారన్నారు. ఆరోగ్య రంగంలో ఆయన ఎన్నారైల సేవలు, సూచనలు కూడా తీసుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞప్తిని మన్నించి ఎంతోమంది ఎన్నారైలు మాతృదేశానికి వచ్చి సేవలందించారని.. అలా వచ్చిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి డాక్టర్ కాకర్ల సుబ్బారావు అని గుర్తు చేశారు. డాక్టర్ కాకర్ల సుబ్బారావుతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక స్పెషాల్టీ ఆసుపత్రిగా నిమ్స్ని తీర్చిదిద్ది నేటి కార్పోరేట్ ఆసుపత్రుల కన్నా మెరుగ్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. ఎన్నారైల సూచన మేరకు మామూలు వైద్య సేవలతో పాటు వైద్య విద్యా బోధనా వసతులు సైతం మెరుగుపరిచారని.. అందులో భాగంగా ఆరోగ్య విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పారని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని నిమ్స్లాంటి ఆస్పత్రిని పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్ పేరు ఆరోగ్య వర్సిటీకి ఉండాలా? లేదంటే ఆరోగ్యశ్రీ పేరిట ప్రభుత్వ ఆస్పత్రులను వ్యూహాత్మకంగా నాశనం చేసి ప్రైవేటు ఆస్పత్రులకు లాభాలను ప్రోత్సహించిన వైఎస్సార్ పేరు ఉండాలో ఆలోచించుకోవాలన్నారు. ఇటీవల ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం బాధాకరమని.. దీన్ని అంతా ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూఏఈ తెదేపా నేతలు విశ్వేశ్వరరావు , ఖాదర్ బాషా, వాసు రెడ్డి , నిరంజన్ రవికిరణ్ , హరి , జాఫర్ అలీ, దుర్గా ప్రసాద్, బాబ్జీ, శ్రీనివాస్ , షబ్బీర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్