NRI News: వైకాపా పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారు: జయరాం కోమటి
వైకాపా ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెదేపా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. వైకాపా దోపిడీ చూసి ప్రవాసాంధ్రులు పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడుతున్నారని చెప్పారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్లో ఆరో మహానాడు కార్యక్రమం నిర్వహించారు.
మేరీల్యాండ్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
మహానాడులో పలు తీర్మానాలకు ఆమోదం
ఇంటర్నెట్డెస్క్: వైకాపా ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెదేపా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. వైకాపా దోపిడీ చూసి ప్రవాసాంధ్రులు పెట్టుబడి పెట్టేందుకు వెనుకాడుతున్నారని చెప్పారు. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అమెరికాలోని మేరీల్యాండ్లో ఆరో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. జయరాం కోమటి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. శ్రీనాథ్రావు ఆధ్వర్యంలో ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ.. హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించడంతో తెలుగువారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని జయరాం కోమటి అన్నారు. తెలుగువాడి గుండెచప్పుడైన ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన సీఎం జగన్కు వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్తు మంత్రులే ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఏపీలో చట్టబద్ధ పాలన లేదన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని.. ప్రశ్నించిన వారిని అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. విశాఖలో భూములు దోచుకున్న విజయసాయిరెడ్డిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అనంతరం వెంకట్ కూకట్ల, జానకి భోగినేని, మహేశ్ నెలకుదిటి, శ్రీనివాసరావు దామా, శ్రీనివాసరం సామినేని, వాసు గోరంట్ల, శివ నెల్లూరి, హర్ష పేరంనేని, హరీశ్ కూకట్ల పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. ఈ కార్యక్రమంలో రవి మందలపు, శ్రీనివాస్ కూకట్ల, సాయి బొల్లినేని, యాష్ బొద్దులూరి, తానా పూర్వ అధ్యక్షుడు సతీష్ వేమన, ప్రొఫెసర్ నరేన్ కొడాలి, భాను మాగులూరి, బోయపాటి వెంకటరమణ, డీవీ శేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
ప్రవేశపెట్టిన తీర్మానలివే..
1. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి
2. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి
3. అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి
4. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, ఆగని వేధింపులు, అక్రమ అరెస్టులు
5. అన్నా క్యాంటీన్లు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య
6. పోలవరం నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలి
7. సభ్యత్వ నమోదు- పార్టీ సంస్థాగత నిర్మాణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే