నూతన సంవత్సరంలో పర్యాటక వీసాలు
‘‘తొలిసారి అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి వచ్చే ఏడాది స్లాట్లు అందుబాటులోకి వస్తాయి. విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.
విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం
బోగస్ వర్సిటీలపై కొరడా
‘ఈనాడు’తో హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్
తెలంగాణ ప్రభుత్వ సానుకూల ధోరణి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోందని కితాబు
ఈనాడు, హైదరాబాద్: ‘‘తొలిసారి అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి వచ్చే ఏడాది స్లాట్లు అందుబాటులోకి వస్తాయి. విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. పర్యాటక వీసాల పునరుద్ధరణకు డ్రాప్ బాక్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. నేరుగా ఇంటర్వ్యూలకు రావాల్సిన అవసరం లేదు. నూతన కాన్సులేట్ వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల ధోరణి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటోంది’’ అని హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
పర్యాటక వీసాల పరిస్థితులు ఎప్పటికి మెరుగవుతాయి?
వచ్చే ఏడాది నుంచి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. తొలి దశలో పర్యాటక వీసా స్లాట్లు అందుబాటులోకి తెచ్చేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. స్లాట్లు లేకపోవటం ఒక్క హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలోనే కాదు... దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కరోనా తరవాత వీసా ప్రక్రియ ప్రారంభం నుంచి కార్యాలయాల్లో పరిమిత సిబ్బందే ఉన్నారు. వీసా జారీని పెంచేందుకు చైనా, మధ్యప్రాచ్య దేశాల్లోని అమెరికా కార్యాలయాల సిబ్బంది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్కు కరోనా ముందునాటి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటారు.
హైదరాబాద్లో కాన్సులేట్ ఉండి కూడా చాలా మంది తెలుగు విద్యార్థులు చెన్నై, ముంబయి, దిల్లీలలోని కాన్సులేట్స్కు ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?
కేంద్రీకృత వ్యవస్థ ద్వారా వీసా స్లాట్లు జారీ అవుతాయి. కాన్సులేట్ వారీగా ఉండదు. స్లాట్లు విడుదల కాగానే ఎవరు ముందు ప్రయత్నిస్తే వారికే అవకాశం లభిస్తుంది.
అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థులకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
విద్యార్థుల రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. తరగతుల ప్రారంభానికి ముందుగానే అమెరికాలోని పరిస్థితులపై అవగాహన కల్పిస్తాం. క్యాంపస్ పోలీసులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తాం. బోగస్ విశ్వవిద్యాలయాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తాం. గతంలో కొన్ని మూసివేశాం.
నూతన కాన్సులేట్ కార్యాలయ ప్రారంభానికి అమెరికా అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందా?
అమెరికా అధ్యక్షుడిని ఆహ్వానించేందుకు సమయం సరిపోదు. ఏడాది ముందుగా ఆయన పర్యటనలు ఖరారవుతాయి. కాన్సులేట్ కొత్త కార్యాలయ పనులు దాదాపు పూర్తయ్యాయి. కొన్ని అనుమతులు తీసుకునేందుకు అమెరికా నుంచి అధికారులు రావాల్సి ఉంది. మార్చి లేదా ఏప్రిల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని నూతన కాన్సులేట్ భవనం ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం.
యూఎస్ఎయిడ్ కార్యాలయం ఇక్కడ ఏర్పాటవుతుందా?
యూఎస్ఎయిడ్(ద యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) విభాగం ఇప్పటి వరకు దిల్లీ కేంద్రంగా పని చేస్తోంది. త్వరలో ఓ అధికారి హైదరాబాద్ నుంచి పని చేస్తారు. యూఎస్ఎయిడ్ ఈ కాన్సులేట్ పరిధిలో చాలా ప్రాజెక్టులను నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కాన్సులేట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లిన సందర్భాల్లో పారిశ్రామికవేత్తలు సహా అందరూ అడుగుతున్నారు.
ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో వాణిజ్యం ఎలాంటి పాత్ర పోషిస్తోంది?
గడిచిన 20 సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం ఎనిమిది రెట్లు పెరిగింది. ప్రస్తుతానికి 159 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. గూగుల్, అమెజాన్, డెల్లాయిట్ లాంటి సంస్థలు అమెరికా వెలుపల అతి పెద్ద వ్యవస్థలను హైదరాబాద్లోనే ఏర్పాటు చేశాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు అమెరికా పరిశ్రమలేమైనా వస్తున్నాయా?
తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమల స్థాపనకు అమెరికాలోని పారిశ్రామికవేత్తలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోంది. పరిశ్రమలకు సత్వర అనుమతులు మొదలు కావాల్సిన అన్ని సౌకర్యాలనూ ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. ఏవియేషన్ రంగానికి చెందిన 16 మందికిపైగా పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వచ్చి వెళ్లిన తరవాత వారి నుంచి నాకు పెద్ద సంఖ్యలో ఫీడ్బ్యాక్ మెయిల్స్ వచ్చాయి. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్లో సానుకూల పరిస్థితులున్నాయని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందకుపైగా అమెరికా పరిశ్రమలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో