గల్ఫ్ కార్మికులతో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆత్మీయ సమ్మేళనం
ఇండియన్ పీపుల్స్ ఫోరం (దుబాయ్) తెలంగాణ కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయ్లోని ఆల్కుజ్ ప్రాంతంలోని అంబాసిడర్ స్కూల్లో ఆదివారం సాయంత్రం తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ పీపుల్స్ ఫోరం (దుబాయ్) తెలంగాణ కౌన్సిల్ ఆధ్వర్యంలో దుబాయ్లోని ఆల్కుజ్ ప్రాంతంలోని అంబాసిడర్ స్కూల్లో ఆదివారం తెలంగాణ గల్ఫ్ కార్మికులతో ఆత్మీయ సమ్మేశనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా విదేశీ వ్యవహారాల శాఖ ఇంఛార్జి డాక్టర్ విజయ్ చౌతైవాలే, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం యూఏఈ అధ్యక్షుడు జితేంద్ర వైద్య అధ్యక్షత వహించారు. ఫోరం ప్రధాన కార్యదర్శి రంజీత్ కోడోత్ అతిథిగా పాల్గొన్నారు. ఫోరం తెలంగాణ విభాగం అధ్యక్షుడు కుంభాల మహేందర్ రెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపీఎఫ్) భాగం కావడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జాతి నిర్మాణానికి తోడ్పడాలని ప్రవాసీయులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బుర్జ్ ఖలీఫాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇళ్లు కొనుక్కొంటూ కొందరు తెలంగాణ నాయకులు ధనవంతులైతే, పేద ప్రజలు మాత్రం గూడు కోసం విదేశాలకు వస్తున్నారని అర్వింద్ వ్యాఖ్యానించారు. ప్రవాసీ బీమా యోజన పథకంలో భాగంగా గల్ఫ్ ప్రవాసీయుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కానీ దీన్ని క్షేత్రస్థాయిలో ప్రచారం చేసి అమలు చేయడంలో తెలంగాణ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేవలం రూ.325 బీమా కింద ప్రవాసీయులకు, స్వదేశంలోని వారి కుటుంబాలకు వైద్య సదుపాయంతో పాటు గల్ఫ్లో న్యాయసాయం వరకు అన్ని రకాల ముఖ్య సేవలను కేంద్రం అందిస్తుందని వివరించారు. మోదీ ప్రధానిగా కాకుండా ఒక పేదవాడిగా అలోచించడంతో ఈ రకమైన సేవలను ప్రవాసీ బీమా యోజన కింద తీసుకువచ్చారని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న తన కాల్ సెంటర్ ద్వారా వేలాది మందికి తాను ఒక్కడినే సహాయం చేయగలిగినప్పుడు, ప్రభుత్వం ఎందుకు చేయరాదని ఆయన ప్రశ్నించారు. గల్ఫ్ దేశాల నుంచి తాను ఇప్పటి వరకు 4,700 తెలంగాణ ప్రవాసీయులను స్వదేశానికి రప్పించానని, అదే విధంగా తన ఫౌండేషన్ ద్వారా 1700 మంది రోగులకు వైద్య సహాయం అందించానని ఎంపీ వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ పలు రాజకీయ విమర్శలు చేశారు.
భాజపా కేంద్ర కార్యాలయంలో విదేశీ వ్యవహారాల విభాగం నెలకొల్పారని, అందులో నలుగురు సభ్యులుండగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తనను ఎంపిక చేశారని అర్వింద్ వెల్లడించారు. సభ జరుగుతుండగా, నమాజు వేళ కావడంతో అజాన్ మొదలు కాగా ప్రధాని మోదీ తరహా తాను కూడా నమాజును గౌరవిస్తూ ప్రసంగాన్ని ఆపుతున్నట్లుగా ప్రకటించి మౌనంగా ఉన్నారు. ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపీఎఫ్) తెలంగాణ విభాగం నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రవాసీయుల నుంచి అనూహ్యస్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో కటుకం రవి, వంశీ గౌడ్, నవనీత్ పటేల్, శరత్ గౌడ్, మదన్, జగదీశ్, గోవర్దన్, వినోద్ ఆర్మూరీ, కోరేపు మల్లేష్, పెంకుల ఆశోక్, దీపికా శ్రీనివాస్, రమేష్ గదార్ల , మేగీ కృష్ణహరి, రేండ్ల శ్రీనివాస్తో పాటు పాటు సుమారు 1300 మంది గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు.