Andhra News : గురుకులం టు వైట్హౌస్
ప్రతిభకు ఎల్లలుండవని రుజువు చేసింది బాపట్ల గురుకులం విద్యార్థిని అక్ష. పేద కుటుంబానికి చెందిన బాలిక చదువులో ప్రతిభ చూపి ఏకంగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కించుకుంది.
అమెరికాలో ఇంటర్ చదువుతున్న బాపట్ల విద్యార్థిని అక్ష
తాజాగా మరో అరుదైన అవకాశం దక్కించుకున్న వైనం
బాపట్ల, న్యూస్టుడే
ప్రతిభకు ఎల్లలుండవని రుజువు చేసింది బాపట్ల గురుకులం విద్యార్థిని అక్ష. పేద కుటుంబానికి చెందిన బాలిక చదువులో ప్రతిభ చూపి ఏకంగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కించుకుంది. బాపట్ల గురుకులంలో చదివే విద్యార్థిని ప్రస్తుతం అమెరికాలో సీనియర్ ఇంటర్ చదువుతోంది. తరగతి గదిలో చలాకీగా ఉంటూ కష్టపడి చదువుతూ తాజాగా అమెరికా అధ్యక్ష భవన కార్యాలయం వైట్హౌస్ నుంచి ఆహ్వానం అందుకుని సందర్శించింది. పేదరికం వంటి సమస్యలున్నా, కష్టపడి చదివి మంచి అవకాశాలు అందిపుచ్చుకొని అక్ష పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
కొమరాబత్తిన అక్ష స్వస్థలం పర్చూరు మండలం చెరుకూరు. తండ్రి మరియరాజు టీ కొట్టు నిర్వహిస్తుండగా, తల్లి రత్నకుమారి దర్జీగా పని చేస్తున్నారు. బాపట్ల మండలం నరసాయపాలెం గురుకులంలో 9, 10 తరగతులు చదివింది. ప్రిన్సిపల్ వినీత విద్యార్థినిలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించారు. పదో తరగతి ఫలితాల్లో 9.8 జీపీఏ సాధించింది. 2021లో బాపట్ల బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో జూనియర్ ఇంటర్ ఎంపీసీలో చేరింది. 80 శాతానికి పైగా మార్కులు సాధించింది. అమెరికాలో పది నెలలు సీనియర్ ఇంటర్ విద్యను అభ్యసించటానికి కెనడీ లిగర్ యూత్ ఎక్స్ఛేంజ్ స్టడీ(కేఎల్వైఈఎస్) కింద కేంద్రం నీతిఅయోగ్ ద్వారా ఏటా 35 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పంపించగా అందులో అక్ష ఒకరు. విద్యార్థిని చదువుకయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తోంది. రానున్న జూన్లో ద్వితీయ ఇంటర్ పూర్తి చేయనుంది.
ముగ్గురిలో ఒకరు
నీతి ఆయోగ్ ద్వారా విదేశాల్లో చదివేందుకు ఏపీ నుంచి ఎంపికైన ముగ్గురిలో అక్ష ఒకరు. గత ఆగస్టులో అమెరికా వెళ్లింది. వాషింగ్టన్ బ్రెమెర్టన్ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం సీనియర్ ఇంటర్ చదువుతోంది. సెమినార్లలో చురుగ్గా పాల్గొని బాగా చదివి విద్యలో రాణిస్తూ ప్రతిభావంతురాలైన విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. భారతదేశం నుంచి వాషింగ్టన్లో చదువుతున్న 35 మంది విద్యార్థినుల్లో ముగ్గురికి అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించే అవకాశం రాగా అందులో అక్ష ఒకరు. అమెరికా విదేశాంగ ప్రతినిధులు విద్యార్థినికి స్వాగతం పలికారు. కుమార్తె వైట్హౌస్ సందర్శించడంపై ఆమె తల్లిదండ్రులు మరియరాజు, రత్నకుమారి ఆనందం వ్యక్తం చేశారు.
అమెరికాలో సహచర విద్యార్థులతో అక్ష
అవకాశాల గని అమెరికా: అక్ష
ప్రతిభావంతులకు అమెరికా అవకాశాల గని. మారుమూల గ్రామానికి చెందిన నేను ఇక్కడికి వచ్చి చదువుతున్నానంటే ఇప్పటికి కలగానే ఉంది. విద్య, ప్రతిభ వల్లే అది సాధ్యమైంది. ప్రతిభకు ఎల్లలు లేవు. వాషింగ్టన్ బ్రెవెర్టన్ ఉన్నత పాఠశాలలో సీనియర్ ఇంటర్ చదవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఇక్కడి విద్యా విధానం బాగుంది. ఆత్మ విశ్వాసం పెరిగింది. మనో వికాసం కలిగింది. విద్యార్థులంతా ఎంతో కలివిడిగా, స్నేహంగా ఉంటున్నారు. గురువులు అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారు. కష్టపడి చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నా కలలు సాకారం చేసుకుంటున్నా. అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ సందర్శనకు పిలుపు రాగానే గొప్ప సంతోషం కలిగింది. విదేశాంగ శాఖ అధికారులు సాదరంగా ఆహ్వానించి అభినందించిన తీరు జీవితాంతం గుర్తుండి పోతుంది. కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వదేశానికి వచ్చి డిగ్రీ చదివి మరలా ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తా. ఉన్నత విద్య అమ్మాయిల జీవితంలో వెలుగులు నింపుతుంది. ప్రతిఒక్కరూ కష్టపడి చదివి వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి. జీవితంలో ఎదుగుదలకు బాటలు వేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.