NRI: సింగపూర్లో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
కార్మిక దినోత్సవం సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.
సింగపూర్: కార్మిక దినోత్సవం సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం నూతన కార్యవర్గం బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తెరుసన్ రిక్రియేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాటలు, డ్యాన్స్, మ్యూజిక్, వెంట్రిలాక్విజం, మెంటాలిజం, లేజర్ షో వంటి వివిధ వైవిధ్యభరితమైన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
దాదాపు 700 మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రజా కవి గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకన్న తన పాటలు, మాటలతో సభికులను ఉత్తేజపరుస్తూ అలరించారు. ప్రముఖ జానపద గాయని చైతన్య తనదైన రీతిలో జానపద గీతాలతో అలరించారు. వైవిధ్య కళాకారుడు రవి.. పిల్లల్ని, పెద్దల్ని తన మాయాజాలంతో మంత్ర ముగ్ధులను చేశారు. ఆ తర్వాత డ్యాన్స్లు, పాటలు, వినోదభరిత కార్యక్రమాలతో పలువురు శ్రామిక సోదరులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మిక సోదరుల కోసం 3 వారాంతాల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ పోటీలు అందరినీ ఏకతాటిపైకి తెచ్చాయి. పోటీల్లో గెలిచిన వారికి గోరటి వెంకన్న చేతులుమీదుగా బహుమతులు, ప్రైజ్ మనీ అందజేశారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు, మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి హాజరయ్యారు. కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ద్వారా అందరినీ ఒకతాటి పైకి తీసుకొచ్చిన కార్మిక సోదరులను, తెలుగు సమాజం చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఏపీఎన్ఆర్టీ ప్రవాస బీమా గురించి వివరించడంతో పాటు, అవసరమైనప్పుడు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులకై తన పరిధిలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. కార్మిక సోదరుల వృతి నైపుణ్య పరీక్షలు తెలుగులో నిర్వహించాలని తెలుగు సమాజం కార్యవర్గం చేస్తున్న కృషి ఫలించిందన్నారు. తొలి దశలో 5 కోర్సులు ఆమోదం పొందాయని హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. సింగపూర్ చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. సింగపూర్లో నివసించే వలస కార్మికులకు స్థిరమైన బీమా ప్రణాళికపై సింగపూర్ తెలుగు సమాజం గతకొంతకాలంగా పనిచేస్తుందన్నారు. ఆ ప్రణాళికను భారత హై కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం, బీమా ప్రయోజకుల పరిధిని పెంచేందుకు చొరవ తీసుకుని మరింత ముందుకెళ్లేలా కృతార్థులయ్యారని తెలిపారు.
ప్రస్తుతం కొత్తగా ఇక్కడకు వచ్చేవారు నూతన బీమా పరిధిలోకి వచ్చే విధంగా అనుమతులొచ్చినప్పటికీ, ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న కార్మికులు కూడా బీమా పరిధిలోకి వచ్చే విధంగా వివిధ శాఖలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ చివరిదశకు వచ్చిందని సింగపూర్లో భారత హై కమిషనర్ పెరియసామి కుమరన్ మే డే సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి సహకరించిన అందరికీ, హాజరైన వారికి, స్పాన్సర్స్, క్రీడాకారులకు నిర్వాహకులు మేరువ కాశిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా సుమారు 3,700 వీక్షించారని, భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం తెలుగు సమాజం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నూతన కమిటీ గతంలో సాధించిన విజయాల్ని పునాదిగా చేసుకొని మరెన్నో వినూత్న కార్యక్రమాల్ని చేపట్టబోతున్నట్టు గౌరవ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!