Forbes: ఫోర్బ్స్లో గుంటూరు యువకుడిపై వ్యాసం
ప్రపంచ ఖ్యాతి గాంచిన ఫోర్బ్స్ పత్రిక తన వెబ్సైట్లో గుంటూరుకు చెందిన సాయి ప్రజ్వల్ కాటంరాజు, అమెరికాకు చెందిన బోర్డాన్ జెస్టర్స్లను ప్రపంచ యువ స్టార్టప్ అధినేతల్లో ఒకరిగా ప్రశంసిస్తూ వ్యాసం ప్రచురించిందని కేఎల్ యూనివర్సిటీ రిజస్ట్రార్గా పనిచేస్తున్న సాయి ప్రజ్వల్ తండ్రి కాటంరాజు సుబ్బారావు తెలిపారు.
తాడేపల్లి, న్యూస్టుడే: ప్రపంచ ఖ్యాతి గాంచిన ఫోర్బ్స్ పత్రిక తన వెబ్సైట్లో గుంటూరుకు చెందిన సాయి ప్రజ్వల్ కాటంరాజు, అమెరికాకు చెందిన బోర్డాన్ జెస్టర్స్లను ప్రపంచ యువ స్టార్టప్ అధినేతల్లో ఒకరిగా ప్రశంసిస్తూ వ్యాసం ప్రచురించిందని కేఎల్ యూనివర్సిటీ రిజస్ట్రార్గా పనిచేస్తున్న సాయి ప్రజ్వల్ తండ్రి కాటంరాజు సుబ్బారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కేఎల్యూలో 2016 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసిన సాయి ప్రజ్వల్ అనంతరం 2017లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ పరిచయమైన బోర్డాన్ జెస్టర్స్తో కలిసి నూతన సాంకేతికతపై అవగాహన పెంచుకొని ‘ఆటోమోటాస్’ అనే ఆటోమేటెడ్ కర్బ్ మేనేజ్మెంట్ ఫ్లాట్ఫాంను 2023లో ఆవిష్కరించారు.
అమెరికాలోని నగరాలు, విమానాశ్రయాల్లో రద్దీని తెలుసుకోవడానికి, ప్రమాదాలు నివారించడానికి దీన్ని ఉపయోగించేలా రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటోమోటాస్ కెమెరాల సాయంతో ఎక్కడ ట్రాఫిక్ ఉందో కచ్చితత్వంతో తెలుసుకోవచ్చు. వినియోగదారులు దీన్ని ఉపయోగించుకొని రద్దీ సమస్యను అధిగమించడం, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ విధానం నచ్చి టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి ఎక్కువమంది ప్రజలకు చేరువ చేసేందుకు ‘టెక్ స్టార్స్ వెంచర్స్’ సంస్థ 12 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో ప్రపంచ యువ స్టార్టప్ అధినేతలంటూ ఫోర్బ్స్ మ్యాగజైన్ సాయి ప్రజ్వల్ కాటంరాజు, బోర్డాన్ జెస్టర్స్లపై వ్యాసం ప్రచురించింది. ప్రస్తుతం వీరు రూపొందించిన టెక్నాలజీ అమెరికాలోని 12 నగరాల్లో ఉపయోగిస్తున్నారని సాయి ప్రజ్వల్ తండ్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.