డెట్రాయిట్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ మహిళల దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది.
డెట్రాయిట్: అంతర్జాతీయ మహిళల దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకుని ఫార్మింగ్టన్ మేనర్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం (మార్చి 2) నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ సంతతికి చెందిన జిల్లా న్యాయమూర్తి జస్టిస్ షాలినా కుమార్ మాట్లాడుతూ.. అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో భారతీయ మహిళలు అందిస్తున్న ఎనలేని సేవలను, కనబరుస్తున్న విశేష ప్రతిభా పాటవాలను కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగాలని సూచించారు.
ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య పద్మజ నందిగామ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబం కోసం రోజూ నిర్వహించే సేవలు వెల కట్టలేనివని అన్నారు. అనంతరం కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులు సుష్మ పదుకొనే, సుమ కల్వల మాట్లాడుతూ.. అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ సంఘం వనితా బృందాలు రాబోయే రోజుల్లో మహిళా దినోత్సవ కార్యక్రమాలను మరింత ఘనంగా నిర్వహించడానికి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమ నిర్వహణకు సహకరించిన కమిటీ సభ్యులు సుష్మ పడుకోనె, స్వప్న చింతపల్లి, సుమ కల్వల, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిణి బీరపు, అర్పిత భూమిరెడ్డి, కల్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులను జీటీఎ డెట్రాయిట్ కార్యవర్గం అభినందించింది. డెట్రాయిట్లో వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన జీటీఏ ఛైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలువల, అధ్యక్షుడు ప్రవీణ్ కేసిరెడ్డి, జీటీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో సుమారు 350 మంది విభిన్న భాషా సంస్కృతులకు చెందిన భారతీయ మహిళలు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. భారతీయ వంటకాలు కార్యక్రమానికి హాజరైన వారిని ఎంతగానో ఆకర్షించాయి. శ్రీకాంత్ సందుగు పాటలతో ప్రేక్షకులను అలరించారు. వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి తనదైన శైలి మాటలతో ఆకట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ