telugu kalasamithi spl event: తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ‘వేగేశ్న ఫౌండేషన్‌ మధురగీతాలు’ ఈవెంట్‌

అన్నమయ్య జయంతి వేడుకల్ని పురస్కరించుకొని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

Published : 18 May 2024 19:49 IST

అమెరికా:  అన్నమయ్య జయంతి వేడుకల్ని పురస్కరించుకొని తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ‘వేగేశ్న ఫౌండేషన్‌ గాయకుల మధుర గీతాలు’ పేరిట మే 18న సాయంత్రం 6 గంటలకు ఈ ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎడిసన్‌లోని ఉడ్రోవిల్సన్‌ మిడిల్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. ఈవెంట్‌కు వచ్చినవారికి విందు ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

భారత్‌లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మానసిక వైకల్యం, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులకు వేగేశ్న ఫౌండేషన్‌ అండగా నిలుస్తోంది. ఈ కారణంగా ఆర్థిక, సామాజిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులకు తగిన తోడ్పాటునందిస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా, సమాజంలో అందరితో సమానంగా ఆ పిల్లలు గౌరవంగా జీవించేలా కౌన్సెలింగ్‌ వంటివి ఇస్తూ నిరంతరం సేవలందిస్తోంది. మహోన్నత ఆశయంతో పనిచేస్తోన్న వేగేశ్న ఫౌండేషన్‌కు ఛారిటీగా అన్నమయ్య జయంతి వేళ ఈ మధుర గీతాలు కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని