Aruna Miller: హైదరాబాద్లో పుట్టి.. అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎదిగి!
అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా భారత సంతతికి చెందిన అరుణా మిల్లర్ ప్రమాణ స్వీకారం చేశారు. మేరీలాండ్లో ఈ పదవి చేపట్టిన తొలి ఇండో అమెరికన్ పౌరురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.
అన్నాపొలిస్: అగ్రరాజ్యం అమెరికా(America)లో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. గతేడాది నవంబర్లో అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించిన అరుణా మిల్లర్(Aruna miller) మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్(Maryland Lieutenant Governor)గా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. హైదరాబాద్లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి ఇండో అమెరికన్గా చరిత్ర సృష్టించారు. అరుణ డెమొక్రాట్ల తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు కూడా ఆమెకు మద్దతివ్వడం విశేషం. మరోవైపు, మేరీలాండ్ గవర్నర్గా విజయం సాధించిన వెస్ మూర్ సైతం బుధవారమే ప్రమాణస్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో గవర్నర్గా ఎన్నికైన మూడో నల్ల జాతీయ వ్యక్తి ఆయనే. వెస్ మూర్, అరుణ మిల్లర్ తరఫున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే, మన తెలుగు మహిళ అరుణా మిల్లర్ మేరీలాండ్లో 2010 నుంచి 2018 వరకు ప్రతినిధుల సభకు ఎన్నికై సేవలందించారు.
భగవద్గీతపై ప్రమాణం చేసిన అరుణ
చిన్నప్పుడే విదేశాలకు వెళ్లినా హిందూ మూలాల్ని మరిచిపోని 58 ఏళ్ల అరుణా మిల్లర్ బుధవారం ప్రమాణస్వీకారం సందర్భంగా చేతిలో భగవద్గీత పట్టుకున్నారు. గతంలో భారత్ నుంచి తన కుటుంబం అమెరికాకు వలస వెళ్లినప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అక్కడి పాఠశాలలో మొదటి రోజు తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. ‘‘ఇక్కడ ఫిట్ కావాలనుకున్నా. కెఫ్టెరియాకు వెళ్లినప్పుడు ముందుగా ఓ ప్లాన్ వేసుకున్నా. అందరూ ఏం చేస్తున్నారో నేనూ అలాగే చేయాలని. తొలిసారి నేను అమెరికన్ ఫుడ్ తీసుకున్నా. నా జీవితంలో కోల్డ్ మిల్క్ తాగడం అదే తొలిసారి. చాలా బాగా అనిపించింది. అంతా ఓకే అనుకున్నా. తోటి విద్యార్థులందరితో కలిసి సరదాగా ఉన్నా. ఇప్పుడు వాళ్లంతా నా స్నేహితులే. ఆ తర్వాత తరగతి గదికి నడుచుకుంటూ వెళ్లి డెస్క్ మొత్తం వాంతి చేసుకున్నా. చాలా సిగ్గుగా అనిపించింది’’ అని అరుణా మిల్లర్ తన స్కూల్ తొలిరోజు అనుభవాన్ని పంచుకున్నారు.
అరుణ గురించి క్లుప్తంగా..
అరుణా మిల్లర్ సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ. 58ఏళ్ల అరుణా మిల్లర్ హైదరాబాద్లో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు అరుణ తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఉద్యోగ రీత్యా 1972లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వెంకటరామారావుకు అరుణ రెండో సంతానం. ఆమె విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన అరుణా మిల్లర్.. ట్రాన్స్పోర్టేషన్ ఇంజినీరింగ్లో నిపుణురాలు. 1990లో డేవిడ్ మిల్లర్తో అరుణ వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. అరుణ డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలిగా చాలాకాలం నుంచి కొనసాగుతున్నారు. అంచెలంచెలుగా ఎదిగి లెఫ్ట్నెంట్ గవర్నర్ స్థాయికి ఎదిగారు. ఇప్పటికీ సొంతూరికి ఏడాదికోసారైనా వస్తుంటారని ఆమె బంధువులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!