హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
తెలుగు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
హాంకాంగ్: తెలుగు సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ‘ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా జరిగింది. చిన్నారులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని తెలుగు భక్తి గీతాలు, పద్యాలు, పాటలు, సంప్రదాయ సమకాలీన జానపద నృత్యాలు ప్రదర్శించారు. చిన్నారులు తేజస్వి సారంగా, వరుణ్ నాల్గె వ్యాఖ్యతలుగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. పూర్వ కార్యదర్శి మిరియాల బాలకిశోర్ చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విదేశాల్లో ఉంటూ పిల్లలకు మాతృభాష, సంప్రదాయాలను నేర్పిస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి సభకు కృతజ్ఞతలు తెలిపారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు బాల కిశోర్, రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగా, కొండ మాధురి, హర్షిణి పచ్చటి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు.
అనంతరం హాంకాంగ్ బాంగ్లాదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఫిబ్రవరి 21 భాషోధ్యమ దినోత్సవం’’ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జయ పీసపాటి పాల్గొన్నారు. బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ అధ్యక్షులు సయ్యద్ మోహి ఉద్దీన్ మోహి, ముఖ్య అతిథి ఇసరత్ ఆరాతో పాటు హాంకాంగ్ ప్రభుత్వ అధికారులు, హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్ ఉపాధ్యక్షురాలు మిటజీ లీయోంగ్, కమిటీ సభ్యుడు తిరుపతి నాచియప్పన, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రధాన ప్రతినిధులను సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కౌన్సిల్ జనరల్ ఇసరత్ ఆరా మాట్లాడుతూ.. భాష సమాన హోదా కోసం చేసిన ఉద్యమం గురించి వివరించారు. ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం ఢాకా నగరంలో ర్యాలీలను నిషేధించిందని, ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచంలోనే భాష కోసం ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఘనత బంగ్లాదేశ్కు మాత్రమే చెందుతుందని తెలిపారు. ఉద్యమం కోసం ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన అని, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారన్నారు. మిటజీ లీయోంగ్ మాట్లాడుతూ యునెస్కో చేపట్టిన మాతృభాష పరిరక్షణ కార్యక్రమం గురించి వివరించారు. జయ పీసపాటి మాట్లాడుతూ.. తాము గతేడాది జూమ్ మాధ్యమం ద్వారా నిర్వహించిన అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవంలో భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలతో కలిపి 16 భాషలకు చెందిన చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని భాషలను కలిపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇతర అతిథులు తమ మాతృ భాష ప్రాముఖ్యత, కార్యక్రమాల గురించి తెలిపారు. అనంతరం పిల్లలు దేశభక్తి గీతాలు పాడారు. BAHK జనరల్ సెక్రెటరీ రహమాన్ పలాష్ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
-
భద్రాచలం తరహాలో అమెరికాలో రామాలయం
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. -
సింగపుర్లో శ్రీ మారియంబికా ఆలయంలో ఘనంగా చండీహోమం
సింగపుర్లోని వాసవీ క్లబ్ మెర్లయన్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు అత్యంత పురాతన, విశిష్టమైన శ్రీ మారియంబికా ఆలయంలో చండీహోమం నిర్వహించారు. -
కూటమి గెలిస్తేనే ఏపీకి భవిష్యత్తు.. ఖతార్లో తెదేపా ఆవిర్భావ వేడుకల్లో నేతలు
తెదేపా ఆవిర్భావ వేడుకలు ఖతార్లో ఘనంగా నిర్వహించారు. ఖతార్ తెలుగుదేశం పార్టీ నేతల ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విజ్ఞాన వికాసంపై తానా ప్రపంచ సాహిత్యవేదిక సదస్సు
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ‘ప్రాచీన భారతీయ సాహిత్యం- ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే అంశంపై సదస్సు విజ్ఞానదాయకంగా జరిగింది. -
ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్సైట్ ఆవిష్కరణ
ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన సమాజమే లక్ష్యంగా ఆవిర్భవించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన వెబ్సైట్ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్యమైన సాంకేతిక ప్రయాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు వక్తలు పేర్కొన్నారు. -
ఏపీని ఆదుకునే ఎన్నారైలపై ఇంత అక్కసా?: జయరాం కోమటి
రాష్ట్రానికి మేలు చేసేలా కృషిచేస్తున్న ఎన్నారైలపై వైకాపా నాయకులు బెదిరింపులకు పాల్పడటం అత్యంత దారుణమని ప్రముఖ ప్రవాసాంధ్రుడు, ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త జయరాం కోమటి అన్నారు. -
ఎన్ఆర్ఐ తెదేపా, జనసేన ఆధ్వర్యంలో తెదేపా ఆవిర్భావ వేడుకలు
ఎన్ఆర్ఐ తెదేపా కువైట్, జనసేన కువైట్ సంయుక్త ఆధ్వర్యంలో తెదేపా 42వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
డార్ట్ఫోర్డ్లో ఉల్లాసంగా హోలీ వేడుకలు
బ్రిటన్లోని డార్ట్ఫోర్డ్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కెంట్లోనే అతిపెద్ద ఈవెంట్గా చేపట్టిన ఈ వేడుకలకు 3వేల మందికి పైగా హాజరయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?