mothers day: మేరీల్యాండ్లో ఘనంగా అంతర్జాతీయ మాతృదినోత్సవ వేడుకలు
అమెరికాలోని మేరీల్యాండ్ ఏరియా ఫ్రెడ్రిక్స్లో అంతర్జాతీయ మాతృదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓక్డేల్ మిడిల్ స్కూల్ ప్రాంగణంలో మే 18న జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కౌంటీ కౌన్సిల్ రినె క్నాప్ విచ్చేశారు.
మేరీల్యాండ్: అమెరికాలోని మేరీల్యాండ్ ఏరియా ఫ్రెడ్రిక్స్లో అంతర్జాతీయ మాతృదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓక్డేల్ మిడిల్ స్కూల్ ప్రాంగణంలో మే 18న జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కౌంటీ కౌన్సిల్ రినె క్నాప్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీల బ్రేవో (ఫ్రెడరిక్స్ కౌంటీ కమ్యూనిటీ లియేషన్), WETA వ్యవస్థాపకురాలు ఝాన్సీ రెడ్డి, అధ్యక్షురాలు శైలజ కల్లూరి, మేరీల్యాండ్ WETA (విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్) బీవోడి ప్రీతిరెడ్డి, టెక్సాస్ బీవోడీ ప్రతిమ రెడ్డి, డీఎంవీ కల్చరల్ ఛైర్ చైతన్య పోలోజు, రీజనల్ కోఆర్డినేటర్ స్వరూప సింగరాజు, మీడియా ఛైర్ సుగుణ రెడ్డి, ఇతర ప్రముఖ సంఘాల నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రావ్య మానస వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అమ్మ అనే పదంలోనే షరతుల్లేని కరుణ, ప్రేమ, ధైర్యం, దయ వంటి అంశాలు ఇమిడి ఉన్నాయని, ప్రస్తుత సందర్భంలో సమాజంలో మహిళల పాత్రపై వక్తలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవకు గాను రీనె క్నాప్, వైసీల బ్రేవోలకు సేవా పురస్కారాలు అందించారు. అనంతరం ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో అన్ని కష్టాల నుంచి మనల్ని కాపాడే రక్షణ కవచంలాంటిది తల్లి అన్నారు. సాంకేతికత, వైద్యం, పాక కళలు, ఇంజినీరింగ్, మరెన్నో ప్రాతినిధ్యాల్లేని రంగాల్లో బాలికలు, మహిళల అభివృద్ధికి మార్గాలను సృష్టించే ఉద్దేశంతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం, స్పాన్సర్ చేయడం వంటి కార్యక్రమాలతో WETA కృషిచేస్తోందన్నారు.
మదర్స్ డే ఈవెంట్లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్థానిక నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతులతో వినోదభరిత కార్యకలాపాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది డీసీ ఏరియా నివాసితులు, మేరీల్యాండ్ సభ్యులు పాల్గొన్నారు. తల్లులందరినీ సత్కరించేందుకు, అభినందించేందుకు పలు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ తెలుగు ప్లేబ్యాక్ సింగర్ అంజనా సౌమ్య తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. వైభవంగా మదర్స్డే వేడుకల్ని నిర్వహించినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి, లోకల్ వేట బృందం మేరీల్యాండ్ వేట-బీవోడీ ప్రీతిరెడ్డి, టెక్సాస్ బీవోడీ ప్రతిమ రెడ్డి, డీఎంవీ కల్చరల్ ఛైర్ చైతన్య పోలోజు, రీజనల్ కోఆర్డినేటర్ స్వరూప సింగరాజు, మీడియా ఛైర్ సుగుణ రెడ్డి, వాలంటీర్స్ గురుచరణ్ చిట్నా, మోహన్ పులిచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక స్పాన్సర్లు భాస్కర్ గంటి, అరుణ్ ఎరువ, చంద్రలకు మెమెంటోలను బహుకరిస్తూ వారి సహాయ సహకారాలను కొనియాడారు. ఈసారి పెద్ద ఎత్తున హైస్కూల్, యువ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుక దిగ్విజయానికి దోహదపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం చంద్రబాబును కలిసిన తానా బృందం
ఏపీ సీఎం చంద్రబాబును తానా ప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
తెదేపా నేత గౌరు వెంకటరెడ్డిని సత్కరించిన ప్రవాసాంధ్రులు
అమెరికా పర్యటనలో ఉన్న తెదేపా సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డిని ఫిలడెల్ఫియా నగరంలోని ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. -
తిరుమల కృష్ణ దేశికాచారికి గండపెండేర సత్కారం
ప్రముఖ కవి, రచయిత, మొట్టమొదటి తెలుగు ఫాంట్ వేమనను అందించిన టొరంటో వాస్తవ్యులు తిరుమల కృష్ణ దేశికాచారికి తెలుగువాహిని సంస్థ గండ పెండేరంతో సత్కరించింది. -
స్వర్ణోత్సవ వేడుకలకు రండి.. స్పీకర్, ఏపీ మంత్రులకు కృష్ణ లాం ఆహ్వానం
జీడబ్ల్యుటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను సెప్టెంబర్ 27, 28 తేదీల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. -
ఖతర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఖతర్లో పెద్దఎత్తున నిర్వహించారు. -
సింగపూర్లో వైభవంగా బోనాల పండుగ
సింగపూర్లో బోనాల జాతర ఘనంగా జరిగింది. -
అమెరికాలోని విద్యార్థులకు తెలుగు నేర్పడానికి ‘తానా-పాఠశాల’
అమెరికా వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడానికి ఏపీ ప్రభుత్వం, తానా సంయుక్తంగా ‘తానా-పాఠశాల’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భానుప్రకాశ్ మాగులూరి తెలిపారు. -
ఏపీ అమెరికన్ అసోసియేషన్(AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభమైంది. -
నెదర్లాండ్స్లో ఎన్డీయే కూటమి విజయోత్సవాలు
నెదర్లాండ్స్లో ప్రవాసాంధ్రులు ఏపీలో ఎన్డీయే కూటమి విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. -
ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై కోమటి జయరాం సంతాపం
అమెరికాలోని బే ఏరియాలో నివాసముంటున్న ఎన్ఆర్ఐ గోకుల్ రాచిరాజు మృతిపై తెదేపా ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం, పలువురు ఎన్ఆర్ఐలు సంతాపం వ్యక్తం చేశారు. -
బ్రిస్బేన్లో తెదేపా విజయోత్సవ సంబరాలు!
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో క్వీన్స్ ల్యాండ్ తెదేపా ఆధ్వర్యంలో పార్టీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. -
అమెరికాలో నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్
USA: అమెరికాలో నకిలీ కంపెనీలు సృష్టించి బలవంతంగా కొంతమందితో పని చేయించుకుంటున్న తెలుగువారిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘సింగపూర్ తెలుగు సమాజం’ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ఘనంగా ‘యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్’ 7వ వార్షికోత్సవం
యునైటెడ్ కింగ్డమ్ తెలుగు హిందూ ఆర్గనైజేషన్ (UTHO) 7వ వార్షికోత్సవాన్ని జూన్ 29న లండన్లో హారో ప్రాంతంలోని హచ్ ఎండ్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. -
‘కురుక్షేత్ర సంగ్రామం’పై సింగపూర్లో ప్రత్యేక ప్రవచన కార్యక్రమం
‘శ్రీకృష్ణ లీలావిభూతి - కురుక్షేత్ర సంగ్రామం’ అనే అంశంపై సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో ప్రవచనం కార్యక్రమం జరిగింది. -
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు. -
తానా ప్రపంచ సాహిత్యవేదిక ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు’ సదస్సు విజయవంతం
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు” సదస్సు ఘనంగా జరిగింది. -
అడిలైడ్లో ఘనంగా కూటమి విజయోత్సవ వేడుకలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంపై విదేశాల్లో ఎన్నారైలు విజయోత్సవాలు చేసుకొంటున్నారు. -
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
రాష్ట్ర పునర్నిర్మాణంలో వివిధ దేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు భాగస్వాములు కావాలని అమెరికాలోని మేరీల్యాండ్కు చెందిన ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు. -
డాలస్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద అంతర్జాతీయ యోగా వేడుకలు
అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. -
ఘనంగా జీడబ్ల్యూటీసీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల లోగో ఆవిష్కరణ
అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే గ్రేటర్ వాషింగ్టన్ డీసీ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షులు కృష్ణ లాం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
-
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
-
4 లక్షల స్కూటర్లు రీకాల్ చేసిన సుజుకీ.. ఇందులో మీ మోడల్ ఉందా?
-
దీపికా పదుకొణెతో ఇంటిమేట్ సీన్స్.. భయాందోళనకు గురయ్యా: బాలీవుడ్ నటుడు