సిలికాన్ వ్యాలీ, ట్రై వ్యాలీలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని సిలికాన్ వ్యాలీ, ట్రై వ్యాలీలో ఘనంగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని సిలికాన్ వ్యాలీలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రవాసాంధ్ర (ఎన్నారై) తెదేపా నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నారై తెదేపా అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ... చంద్రబాబు 1998లో ముఖ్యమంత్రిగా సిలికాన్ వ్యాలీలో పర్యటించిన విశేషాలను గుర్తు చేశారు. అలాగే చంద్రబాబుతో తన అనుబంధాన్ని వివరిస్తూ.. 2024లో ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరాన్ని విశ్లేషించారు. చంద్రబాబు వందో పుట్టినరోజు కూడా తన ఆధ్వర్యంలో జరిగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరు: రవి మందలాపు
క్రమశిక్షణ పాటించే అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెదేపా సీనియర్ నాయకుడు రవి మందలాపు కొనియాడారు. చంద్రబాబు స్థిత ప్రజ్ఞత ఉన్న నాయకుడని... ఎప్పుడు కలిసినా, ఆయన ఏదో ఒక విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేయడమో, వివరించే ప్రయత్నమో చేస్తారని చెప్పారు. ఏడాది తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే, వంటిల్లును కేంద్రంగా చేసుకుని అనారోగ్య సమస్యలకు చికిత్సలు రూపొందించే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత నాలుగేళ్లలో విధ్వంసక పాలనను చూశామని... ఏడాదిలోనే ఏపీలో అద్భుతమైన చంద్రబాబు పాలన ప్రారంభం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక తెలుగుదేశం యువనేత రవి కిరణ్ మాట్లాడుతూ ‘‘చంద్రబాబు వంటి నాయకుడు ముందు తరాలకు ఆదర్శం. ఆయన మార్గదర్శకంలో ఏపీ ముందుకు సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో విజయం చంద్రబాబుదే’’ అని చెప్పారు.
తెలుగుదేశం నేత వెంకట్ కోగంటి సమన్వయ పరిచిన ఈ కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, లక్ష్మణ్ పరుచూరి, గోకుల్ రాచవరపు, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ గొంప, కోటిబాబు కోటిన, భాస్కర్ అన్నే, మోహన్, కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, రవి, సాయి ఖమాబాపతి, మధు కందేపి సాయి యనమదల, పాములు నారాయణ వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, వీరు వుప్పల, సుభాష్ ఆర్, రవికిరణ్ ఆలేటి, రవి ఆలపాటి, సతీష్ బొల్ల, ప్రకాష్ ఎన్, తమిళనాడు ఎన్నారై తెదేపా నేత కుమార్ వేల్ తదితరులు పాల్గొన్నారు.
ట్రై వాలీలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్ రామన్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెదేపా తరఫున ఏ విధంగా పని చేయాలనే విషయంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగు ఓటర్లను తెదేపాకు సానుకూలంగా ఎలా మలచాలనే విషయంపైనా, పార్టీకి మద్దతుగా ఎలా నిలవాలనే విషయాలపైనా తీర్మానాలు చేశారు.
స్థానిక తెలుగుదేశం నేత యంవి.రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరచగా, కార్యక్రమం విజయవంతం చేయడంలో గీత ఆలపాటి, శిల్ప మద్దినేని ముఖ్యపాత్ర పోషించారు. సురేష్ పోతినేని, అజయ్ నల్లూరి, రామ్ప్రసాద్, కేశవ్, రంగ నాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్