డల్లాస్‌లో ఘనంగా నాట్స్ మహిళా సంబరాలు.. ఆకట్టుకున్న తెలుగమ్మాయి పోటీ

డల్లాస్‌లో నాట్స్ మహిళా సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా నిర్వహించిన తెలుగమ్మాయి పోటీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. 

Published : 11 Apr 2023 22:01 IST

డల్లాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్‌) డల్లాస్‌లో మహిళా సంబరాలను ఘనంగా నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలకు దాదాపు 300 మందికి పైగా తెలుగు మహిళలు హాజరై సందడి చేశారు. ఈసారి వేడుకల్లో ప్రత్యేకంగా నిర్వహించిన తెలుగు అమ్మాయి పోటీ అందరినీ ఆకట్టుకుంది. ఫ్రిస్కో నగరంలోని వాన్డెర్వెంటెర్ మిడిల్ స్కూల్లో జరిగిన ఈ సంబరాల్లో  శాస్త్రీయ నృత్యం, జానపద, సినిమా నృత్యం, మెహిందీ, రీల్స్ పోటీలు, మ్యూజికల్ ఛైర్స్ వంటి ఎన్నో కార్యక్రమాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగమ్మాయి పోటీల్లో తెలుగు భాష, యాస, కట్టు, బొట్టుని ప్రదర్శిస్తూ ముద్దుగుమ్మలు, కిన్నెరసానులు, కావ్యనాయికలు విభాగాల కింద ఎంతో మంది మహిళలు పోటీపడ్డారు. నాట్స్ తెలుగమ్మాయి  ప్రిలిమ్స్ కోసం డల్లాస్‌లో చాలామంది మేముసైతం అని ముందుకు రావడంతో ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. మహిళా సంబరాల వేదికపై అమెరికా అండర్ 19 క్రికెట్ టీమ్‌లో ఎన్నికైన సాయి తన్మయిని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి సత్కరించారు. సాయి తన్మయితో పాటు  తెలుగు కమ్యూనిటీకి డీఎఫ్‌డబ్ల్యూ ప్రాంతంలో స్వచ్చంద సేవలందిస్తున్న మహిళలను గుర్తించి నాట్స్‌ నాయకులు వారిని సేవా పురస్కారాలతో సన్మానించారు. నాట్స్ సేవా పురస్కారాలు అందుకున్న వారిలో సామాజిక కార్యకర్త డాక్టర్ భానుమతి ఇవటూరి, ప్రముఖ న్యాయవాది గీత దమన్న, ప్రముఖ యోగా శిక్షకురాలు మైత్రేయి ఇడపలపాటి ఉన్నారు.

ఈ కార్యక్రమంలో నాట్స్‌ అధ్యక్షుడు బాపు నూతి మాట్లాడుతూ.. మహిళలు, యువతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ మహిళా,యువ  వేదికలను ఏర్పాటుచేసి ఇలాంటి అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. "భాషే రమ్యం - సేవే గమ్యం" అనే నాట్స్ నినాదానికి అనుగుణంగా భాష, సేవలకు సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ సంబరాలను విజయవంతం చేయడంలో నాట్స్ జాతీయ మహిళా సమన్వయకర్త కవిత దొడ్డా, డల్లాస్ మహిళా సమన్వయకర్త స్వప్న కాట్రగడ్డ, జాతీయ సంయుక్త కార్యదర్శి జ్యోతి వనం, వీణ యలమంచిలి, ఆర్య బెల్లం, వనజ ఏపూరి, సందీప, లక్ష్మి కోటపాటి, రేవతి మిమ్మనేని, రాధికా న్యాలమడుగుల, యువ విభాగ సభ్యులు నిఖిత దాస్తి, యాషిత చుండూరు, మృదుల ముమ్మనేని, దక్ష మిటాపురం, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్స్ సత్య శ్రీరామేనని, రవి తాండ్ర, జోనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్, డల్లాస్ చాప్టర్ సభ్యులు రవీంద్ర చుండూరు, పార్థ బొత్స, తేజ వేసంగి, నాగిరెడ్డి మందల, రవీంద్ర చిట్టూరి, శ్రీనివాస్ ఉరవకొండ, శ్రీధర్ విన్నమూరి, రవి తుపురాని తదితరులు కీలకంగా వ్యవహరించారు. వీరందరిని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందించారు. తెలుగమ్మాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

తెలుగు సంబరాల్లో తెలుగమ్మాయి ఫైనల్స్ 

తెలుగమ్మాయి ప్రిలిమ్స్‌లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన ఫైనలిస్టులు మే 26-28 తేదీలలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2023 వేదికపై జరిగే ఫైనల్స్‌లో ఇతర నాట్స్ చాఫ్టర్లు నుండి వచ్చిన ఫైనలిస్ట్‌లతో పోటీ పడతారు. ఈ ఫైనల్స్ లో గెలిచిన వారికి ప్రతి కేటగిరిలో  మిస్ నాట్స్ కిరీటంతో పాటు నగదు బహుమతులు  ఇవ్వనున్నారు. నాట్స్ తెలుగమ్మాయి పోటీల్లో ఫైనలిస్టుల వివరాలివే.. 
•    ముద్దుగుమ్మ - వరుని శరను, తన్మయి జంగిడి, లోహిత్య సోము & యషిత చుండూరు    
•    కిన్నెరసాని -  అలేఖ్య యకమా & మోహన గ్రీష్మ గుదిమెళ్ళ  
•    కావ్యనాయిక - మైత్రేయి మియాపురం, పెరిన్ దేవి బెహరా & శ్రీలత బెల్దే

నాట్స్ తెలుగమ్మాయి విజేతలకు మొదటి బహుమతి - $2,500, రెండవ బహుమతి $1,500, మూడవ బహుమతి $1,000ల చొప్పున నాట్స్ అమెరికా తెలుగు సంబరాల వేదికపై ఇవ్వనున్నారు. 
మహిళా సంబరాలకు పసందైన విందు భోజనం అందించిన స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్ వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే,  ఈ కార్యక్రమానికి చేయూతనందించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, ఫార్మ్2కుక్, కోపెల్ చెస్ క్లబ్, సేజ్ ఐటీ, వైకుంఠ్ డెవెలపెర్స్, ఏజెనిక్స్ ఫార్మాస్యూటికల్స్, క్లౌడ్ జెనిక్స్, హింద్ సైట్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ, ప్రసూనా'స్ కిచెన్, ఔర్ ప్లేస్ రెస్టారెంట్ వారికి ఈవెంట్ కోఆర్డినేటర్స్ కవిత దొడ్డ, స్వప్న కాట్రగడ్డ, జ్యోతి వనం, వీణ యలమంచిలి, చాప్టర్ కోఆర్డినేటర్స్ సత్య శ్రీరామినేని,రవి తాండ్రలు కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని