NATS: ఫ్లోరిడాలో నాట్స్ సేవా కార్యక్రమాలపై స్థానికుల ప్రశంసలు
నాట్స్ సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత కూడా ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు.
ఫ్లోరిడా: నాట్స్ సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. అమెరికాలో రహదారుల పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రతను సైతం ప్రజలు తమ సామాజిక బాధ్యతగా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టాంపా బే విభాగం టాంపాలోని దాదాపు రెండు మైళ్ల పరిధి వరకు హైవేను శుభ్రం చేసేందుకు నడుం కట్టింది. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడంలో 25 మంది నాట్స్ సభ్యులు, స్థానికంగా ఉండే హైస్కూల్ విద్యార్థులు పాల్గొని తమ సేవలు అందించారు. నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమం స్ఫూర్తితో కేవలం పాఠశాల విద్యార్థులే కాకుండా స్థానికులు కూడా హైవే క్లీనింగ్లో పాల్గొన్నారు. రెండు మైళ్ల పరిధిలో రహదారికి ఇరువైపులా ఉన్న చెత్త, చెదారం తొలగించారు. అంతా శుభ్రంగా ఉండేలా చేశారు. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలనే స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు నాట్స్ తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నాట్స్ సేవా ధ్రువ పత్రాలను అందించింది. నాట్స్ టాంపా బే నాయకత్వం ఎంతో సమర్థంగా ఈ కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, బోర్డు గౌరవ సభ్యులు డా.కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది తదితరులకు నాట్స్ టాంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఫైనాన్స్/మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహ మండలి సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కో ఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కోఆర్డినేటర్ విజయ్ కట్టా, కోఆర్డినేటర్ కమిటీ చైర్స్ భరత్ ముద్దన, హరి మండవతో పాటు నాట్స్ స్వచ్ఛంద సేవకులు శ్రీనివాస్ బైరెడ్డి, అనిల్ అరేమండ, భార్గవ మాధవరెడ్డి చక్కటి ప్రణాళికతో కార్యక్రమం విజయవంతం చేశారు. భావితరాల్లో సేవాభావాన్ని నింపేందుకు కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగాన్ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందించారు. సేవే గమ్యం నినాదానికి తగ్గట్టుగా టాంపా బే విభాగం కార్యక్రమం నిర్వహించిందని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి టాంపా బే నాయకులను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సెక్రటరీ రంజిత్ చాగంటి, ఎగ్జిక్యూటివ్ మీడియా సెక్రటరీ మురళి మేడిచెర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Toll Charges: టోల్ రుసుముల పెంపు అమలులోకి..
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Crime News
గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక మృతి
-
Ap-top-news News
అభివృద్ధి లేదు.. ఆత్మహత్య చేసుకుంటా.. జంగారెడ్డిగూడెంలో ఓ కౌన్సిలర్ ఆవేదన
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం